అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో రోడ్ల పరిస్థితిపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఆర్ అండ్ బీ శాఖ అధికారులతో సెక్రటరియేట్లో గురువారం సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో రోడ్ల దుస్థితి, నిధుల అవసరం, ప్రస్తుతం ఉన్న సమస్యలపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు..రోడ్ల మరమ్మతులు, నిర్మాణంలో కొత్త, మెరుగైన సాంకేతికతను వినియోగించే విషయంపై సమీక్షలో చర్చించారు. తక్కువ ఖర్చుతో, ఎక్కువ మన్నిక ఉండేలా, త్వరతగతిన పూర్తి అయ్యేలా రోడ్ల నిర్మాణానికి అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు..పాత పద్దతిలో …
Read More »Monthly Archives: September 2024
ఎం.ఎస్.ఎం.ఈ.లను ప్రోత్సహించేలా త్వరలో నూతన విధానం
-క్రెడిట్ గ్యారెంటీ ఫండ్ ట్రస్టు ద్వారా రూ.5 వేల కోట్లు ఋణ సౌకర్యం -రాష్ట్ర ఎమ్.ఎస్.ఎం.ఈ., సెర్ప్ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలను పెద్ద ఎత్తున ప్రోత్సహించేలా త్వరలో నూతన ఎం.ఎస్.ఎం.ఈ.విధానాన్ని రాష్ట్రంలో అమల్లోకి తీసుకువస్తున్నట్లు రాష్ట్ర ఎమ్.ఎస్.ఎం.ఈ., సెర్ప్, ఎన్ఆర్ఐ ఎంపవర్మెంట్ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. గురువారం రాష్ట్ర సచివాలయం పబ్లిసిటీ సెల్లో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ రాష్ట్రంలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలను మరింత బలోపేతం …
Read More »ఈనెల17 నుండి అక్టోబరు 2 వరకు స్వచ్ఛతా హి సేవా కార్యక్రమం : సిఎస్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఈనెల17 నుండి అక్టోబరు 2వ తేదీ వరకూ రాష్ట్ర వ్యాప్తంగా స్వచ్ఛతా హి సేవా కార్యక్రమాన్ని విజయవతంగా నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ అధికారులను ఆదేశించారు.స్వచ్ఛతా హి సేవా కార్యక్రమానికి సంబంధించి గురువారం రాష్ట్ర సచివాలయంలో వివిధ లైన్ డిపార్ట్మెంట్ల కార్యదర్శులతో రాష్ట్ర స్థాయి తొలి స్టీరింగ్ కమిటీ సమావేశం,జిల్లా కలెక్టర్లతో వీడియో సమావేశం నిర్వహించారు.ఈసందర్భంగా సిఎస్ మాట్లాడుతూ ఈ పరిశుభ్రత ప్రచార కార్యక్రమం ఈనెల 17న ప్రారంభమై పక్షం రోజుల పాటు …
Read More »ఆధునిక సాంకేతిక పరిస్థితులకు అనుగుణంగా వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి
-అభివృద్ధి సంక్షేమ పధకాలపై ప్రజల్లో అవగాహనకు విస్తృత ప్రచారం చేయాలి -వెబ్ సైట్ మరింత సమర్థవంతంగా నిర్వహించాలి -ప్రభుత్వంపై వచ్చే నెగెటివ్ వార్తలపై ఆయా శాఖల ద్వారా వెంటనే వివరణ ఇవ్వాలి -ప్రభుత్వ ప్రతిష్టను పెంచే విధంగా సమాచారశాఖ పని చేయాలి -అభివృద్ధి సంక్షేమ పధకాలకు చెందిన సమాచారంపై డేటా బ్యాంకు ఏర్పాటు చేయాలి -రాష్ట్ర సమాచార పౌరసంబంధాలు,గృహ నిర్మాణ శాఖామాత్యులు కొలుసు పార్ధసారధి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రస్తుత ఆధునిక సాంకేతిక పరిస్థితులకు అనుగుణంగా సమాచార పౌరసంబంధాల శాఖలో పనిచేసే …
Read More »70 ఏళ్ళు పైబడిన వారికి ఉచిత ఆరోగ్య బీమా ఉదాత్తమైన పథకం
-ఆరు కోట్ల మంది వయోధికులకు ప్రయోజనకరం -ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కి ధన్యవాదాలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పేద, ధనిక అనే తారతమ్యం లేకుండా 70 సంవత్సరాలు పైబడినవారందరికీ రూ.5 లక్షల ఉచితంగా ఆరోగ్య బీమా కల్పిస్తూ కేంద్ర కేబినెట్ ఆమోదిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ స్వాగతిస్తారు. ‘ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన’ పథకం విస్తరిస్తూ…70 ఏళ్లు పైబడినవారందరికీ రూ.5 లక్షలు ఉచిత ఆరోగ్య బీమాను ఇవ్వడం ద్వారా ఆరు కోట్ల మంది వయోధికులకు ప్రయోజనం …
Read More »ఈ నెల 17 నుంచి అక్టోబరు 2 వరకు స్వచ్ఛతా హి సేవా
– కార్యక్రమం విజయవంతానికి ప్రణాళికాయుత కృషి – జిల్లా కలెక్టర్ డా. జి సృజన విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు ఈ నెల 17వ తేదీ నుంచి అక్టోబరు 2వ తేదీ వరకూ స్వచ్ఛతా హి సేవా కార్యక్రమాన్ని జిల్లాలో విజయవతంగా నిర్వహించేందుకు ప్రణాళికాయుత కృషి చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ డా. జి.సృజన తెలిపారు. స్వచ్ఛతా హి సేవా కార్యక్రమానికి సంబంధించి గురువారం రాష్ట్ర సచివాలయంలో వివిధ సమన్వయ శాఖల కార్యదర్శులతో రాష్ట్ర స్థాయి తొలి స్టీరింగ్ కమిటీ …
Read More »మనోధైర్యం కోల్పోవద్దు.. అండగా ఉంటాం..
– నష్టాలపై కేంద్రానికి సమగ్ర నివేదిక సమర్పిస్తాం. – రైతులు, వరద ప్రభావిత ప్రజలతో – కేంద్ర హోంశాఖ జాయింట్ సెక్రటరీ అనిల్ సుబ్రహ్మణ్యం నేతృత్వంలోని కేంద్ర బృందం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : భారీ వర్షాలు, వరదల వల్ల దెబ్బతిన్న రైతులు, ప్రజలు మనోధైర్యం కోల్పోవద్దని.. అండగా ఉంటామని, జరిగిన నష్టంపై కేంద్రానికి సమగ్ర నివేదిక సమర్పిస్తామని కేంద్ర హోంశాఖ జాయింట్ సెక్రటరీ అనిల్ సుబ్రహ్మణ్యం నేతృత్వంలో కేంద్ర బృందం పేర్కొంది. అనిల్ సుబ్రహ్మణ్యం నేతృత్వంలో కేంద్ర బృంద సభ్యులు రోడ్డు …
Read More »భారీ వర్షాలు, ఆకస్మిక ముంపు అపార నష్టం కలిగించాయి
– నష్ట గణాంకాల నమోదు ప్రక్రియ శరవేగంగా జరుగుతోంది. – ప్రాథమిక అంచనాల ప్రకారం 42,328 హెక్టార్లలో పంట నష్టం – రూ. 730 కోట్ల మేర ఇరిగేషన్ ఆస్తులకు నష్టం – కేంద్ర బృందానికి వివరించిన జిల్లా కలెక్టర్ డా. జి.సృజన విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రికార్డు స్థాయిలో భారీ వర్షాలు, కృష్ణానదికి పోటెత్తిన వరద, బుడమేరుకు పడిన గండ్లు.. ఈ మూడింటి కారణంగా విజయవాడ, పరిసర ప్రాంతాలు ఆకస్మికంగా ముంపునకు గురయ్యాయని, ఎన్టీఆర్ జిల్లాకు అపార నష్టం వాటిల్లిందని …
Read More »సీతారాం ఏచూరి మరణ వార్త దిగ్బ్రాంతికి గురిచేసింది
– వైసీపీ నగర అధ్యక్షులు మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నిరాడంబరుడు, సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మరణ వార్త దిగ్బ్రాంతికి గురిచేసిందని వైసీపీ నగర అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. ఆయన మరణం దేశ రాజకీయాలకు తీరని లోటని విచారం వ్యక్తం చేశారు. విద్యార్థి నేతగా రాజకీయాలలోకి అడుగు పెట్టి జాతీయ రాజకీయాలలో తనదైన ముద్ర వేశారన్నారు. తెలుగు వాడిగా తన రాజకీయ వాణిని ఢిల్లీ స్థాయిలో వినిపించారని.. నమ్మిన సిద్ధాంతం కోసం …
Read More »వరద బురద శుభ్రం చేయడానికి ఫైరింజన్ల ఉపయోగం భేష్
-ఇది అద్భుతమైన ఆలోచన -వరద ప్రాంతాల్లో ఆరోగ్య సంరక్షణ చర్యలు బాగున్నాయి -కేంద్ర వైద్య బృందం సంతృప్తి -వ్యాధులు ప్రబలకుండా మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచన -వైద్య ఆరోగ్యశాఖాధికారులతో ముగిసిన కేంద్ర బృందం భేటీ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : వరద ముంపు ప్రాంతాల్లో వీధులు, కాలనీలు, ఇళ్లలో వచ్చిపడ్డ బురదను శుబ్రం చేయడానికి ఫైరింజన్లు ఉపయోగించాలనే ఆలోచన రాష్ట్ర ప్రభుత్వానికి రావడం అద్భుతమని కేంద్ర వైద్య బృందం ప్రశంసించింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో గత కొన్ని రోజులుగా కేంద్ర ప్రభుత్వం పంపిన …
Read More »
Prajavartha Online Telugu News