విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో గల నూతన భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్ నందు జరుగుతున్న బీఫామ్ పట్ట రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముమ్మరం గా జరుగుతోందని ఇన్చార్జ్ కమిషనర్ డాక్టర్ డి చంద్రశేఖర్ అన్నారు. పాయికాపురం, కొత్త రాజరాజేశ్వరి పేట లో 10 సంవత్సరాలు నిండిన ఇంటి యజమానులకు బి ఫాం పట్టాను పక్క రిజిస్ట్రేషన్ చేసేందుకు విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో జరుగుతున్న రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముమ్మరంగా జరుగుతుందని, ఇంకాను రిజిస్ట్రేషన్ జరగవలసినవి 1171 ఉండగా, అందులో 371 రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేశారని తెలిపారు. ఇంకాను ఎవరైతే రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చెయ్యాలో త్వరగా పూర్తిచేసుకుని ప్రభుత్వం వారు కల్పించిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ప్రజలను కోరారు.
Prajavartha Online Telugu News