తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చంద్రగిరి మండలం, నారావారిపల్లికి తన సొంత గ్రామానికి సంక్రాంతి పండుగ సందర్భంగా విచ్చేసిన సందర్భంలో మంగళంకు చెందిన చెంచయ్య నాయుడు యాక్సిడెంట్ అయి ఒక కాలుకి రాడ్ వేశారని, దాని కారణంగా ఆరోగ్యం క్షీణించి పనిచేయలేని పరిస్థితికి వచ్చాము అని బతుకు తెరువు కష్టమైందని ఆర్థిక స్తోమతి లేనందున ఇబ్బంది పడుతున్నానని రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఈ రోజు జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్ ఆ కుటుంబానికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ఆర్థిక సహాయం కింద రెండు లక్షల రూపాయలు అందజేసారు.
Prajavartha Online Telugu News