-ఈ నెల 10వ తేదీ వరకు పొడిగింపు
-ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ ఎం.వి.కృష్ణారెడ్డి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎస్సీఈఆర్టీలో పది అసెస్మెంట్ నిపుణుల (Assessment experts) ఖాళీలు భర్తీ చేయడానికి అర్హత గల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల నుండి ఆన్ డ్యూటీ ప్రాతిపదికన ఆహ్వానిస్తున్నట్లు ఎస్సీఆర్టీ డైరెక్టర్ ఎం.వి.కృష్ణారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తులు చేసుకోవడానికి ఈ నెల 10వ తేదీ వరకు గడువు పెంచినట్లు తెలిపారు. పూర్తి వివరాలు ఆర్జేడీలకు, జిల్లా విద్యాశాఖాధికారులకు పాఠశాల విద్యా సంచాలకులు వి.విజయ్ రామరాజు IAS ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. స్టేట్ అసెస్మెంట్ సెల్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి https://forms.gle/qFRjhWHMtVJ5UXUT8 లింక్పై క్లిక్ చేయాలని తెలిపారు.
Prajavartha Online Telugu News