విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జగ్గయ్యపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ గా నియమితులైన కొఠారు సత్యనారాయణ ప్రసాద్ ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) ను మర్యాదపూర్వకంగా కలిశారు. గురునానక్ కాలనీలోని విజయవాడ పార్లమెంట్ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో శుక్రవారం టీడీపీ రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి జంపాల సీతారామయ్య, ఎన్టీఆర్ జిల్లా తెలుగు రైతు సంఘం అధ్యక్షుడు చెరుకూరి రాజేశ్వరరావు లతో కలిసి ఎంపీ కేశినేని శివనాథ్ ను ఎ.ఎమ్.సి చైర్మన్ గా నియమితులైన కొఠారు సత్యనారాయణ ప్రసాద్ కలుసుకున్నారు.. తనపై నమ్మకంతో మార్కెట్ యార్డ్ ఛైర్ పర్సన్ గా అవకాశం కల్పించినందుకు ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని)కు కొఠారు కృతజ్ఞతలు తెలిపారు. ఎ.ఎమ్.సి ఛైర్ పర్సన్ గా ఎన్నికైనందుకు ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పెనుగ్రంచిప్రోలు మాజీ ఎంపిపి వెల్ది శ్రీనివాసరావు, టిడిపి నాయకులు రావూరి విశ్వనాథం, ముత్తినేని అశోక్, కిలారు విశ్వనాథ్, పెల్లిబోయిన నాగరాజు, కనపర్తి చిట్టిబాబు, పోతురాజులతో పాటు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News