తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
తిరుచానూరు పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల సందర్బంగా ఆలయంలో ఘనంగా నిర్వహించిన వసంతోత్సవంలో ఆంధ్రప్రదేశ్ హస్తకళా నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్ డా. పసుపులేటి హరిప్రసాద్ కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి వచ్చిన వేలాది భక్తులతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. డా. హరిప్రసాద్ తో పాటు సతీమణి గౌరీ, సోదరులు వెంకటేశ్వర ప్రసాద్, శివ ప్రసాద్ మరియు వారి కుటుంబ సభ్యులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక సేవలు, పూజల్లో పాల్గొన్నారు. వసంతోత్సవం సందర్భంగా ఆలయ అర్చకులు సంప్రదాయ పద్ధతుల్లో నిర్వహించిన పూజా కార్యక్రమాలను వీక్షిస్తూ కుటుంబ సభ్యులు అమ్మవారి దివ్యదర్శనాన్ని పొందారు. బ్రహ్మోత్సవాల మహోత్సవ వాతావరణంలో పాల్గొన్న హరిప్రసాద్ కుటుంబం ఆలయ కార్యక్రమాలకు అనుగుణంగా శాంతియుతంగా దర్శనం పూర్తి చేసుకున్నారు. పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొనే అవకాశం కలగడం తమకు ఆనందంగా అనిపించిందని వారి కుటుంబ సభ్యులు తెలిపారు.
Prajavartha Online Telugu News