విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరంలోని ఏ ప్లస్ కన్వెన్షన్ సెంటరులో రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ముస్లీం సోదరులకు సోమవారం రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిన ఇఫ్తార్ విందుకు హాజరైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్(చిన్ని) ముస్లీం సోదరులతో కలసి ఘన స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు,మైనారిటీ సంక్షేమ శాఖ, న్యాయ మంత్రి ఎన్ ఎండి ఫారుక్, ఇతర ప్రజా ప్రతినిధులతో పాటుగా ముస్లీం సోదరులతో కలసి ఇఫ్తార్ విందు, నమాజ్, డిన్నర్లలో ఎంపీ కేశినేని శివనాథ్ పాల్గొన్నారు. ముస్లీం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.
Prajavartha Online Telugu News