Breaking News

ఇంటర్ లో ఉత్తీర్ణత సాధించని విద్యార్థులను సప్లమెంటరీ పరీక్షలకు సన్నద్ధం చేయండి

-100 శాతం ఉత్తీర్ణతే లక్ష్యం
-పేద పిల్లల భవిష్యత్తుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక శ్రద్ధ
-మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త :
ఇంటర్మీడియట్ లో ఫెయిల్ అయిన అంబేద్కర్ గురుకులాలు, సాంఘిక సంక్షేమ వసతి గృహాల విద్యార్థులకు సప్లమెంటరీ పరీక్షలకు శిక్షణ ఇచ్చి 100 శాతం ఉత్తీర్ణత సాధించేలా కృషి చేయాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం నాడు వెలగపూడి సచివాలయంలో APSWREIS, సాంఘిక సంక్షేమ శాఖ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. ఇంటర్ లో పెయిల్ అయిన విద్యార్థులకు సప్లిమెంటరీ పరీక్షలకు సన్నద్దం చేసేందుకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలి. అందుకోసం ప్రతి జిల్లాకు బాలురకు ఒకటి, బాలికలకు ఒకటి చొప్పున రెసిడెన్షియల్ ఉచిత శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయాలి. విద్యార్థులకు సప్లమెంటరీ పరీక్షలు వరకు శిక్షణ ఇచ్చి 100% ఉత్తీర్ణత సాధించే దిశగా కృషి చేయాలని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అధికారులను ఆదేశించారు. పేద పిల్లల భవిష్యత్తుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కూటమి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టిందన్నారు. పేద విద్యార్థులకు బంగారు భవిష్యత్తు కల్పనే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *