Breaking News

సోమేశ్వరుడు సేవలో జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా…

పెనుమంట్ర, నేటి పత్రిక ప్రజావార్త :
పెనుమంట్ర మండలం జుత్తిగ గ్రామం లో శ్రీ ఉమా వాసుకి రవి సోమేశ్వర స్వామివారిని కార్తీక మాసం సందర్భంగా బుధవారం ఉదయం జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా దర్శించుకున్నారు. ఆలయ అధికారులు , అర్చకులు పూర్ణ కుంభ స్వాగతం తో స్వాగతం పలికారు. శ్రీ స్వామి వారికి స్వయంగా అభిషేకం నిర్వహించారు. అనంతరం ఆలయ మండపం లో వేద పండితులు ఆశీర్వచనాలు అందజేశారు. గ్రామ సర్పంచ్ తమనంపూడి వీర్రెడ్డి శ్రీ స్వామి అమ్మవార్ల వారి చిత్ర పటాన్ని, ప్రసాదాన్ని, శేష వస్త్రాన్ని కలెక్టర్ కార్తికేయ మిశ్రా కి అందజేశారు. ఆలయ విశిష్టతను ప్రముఖ సిద్ధాంతి ఏ వి ఆర్ సుబ్రహ్మణ్యం జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా కి తెలియజేసారు. ఈ కార్యక్రమంలో ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యుడు సి హెచ్ విశ్వనాథం, ఆలయ.ఈ.ఓ సాయి ప్రసాద్, అర్చకులు ర్యాలీ వాసు శర్మ, కె.రామకృష్ణ , పవన్ కుమార్ శర్మ, గణేష్ శర్మ , మండల తహసిల్ధార్ దుర్గా కిషోర్, రెవెన్యూ, పంచాయతీ, మండలం పరిషత్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *