-20 మంది లబ్ధిదారులకు ₹12.27 లక్షల CMRF చెక్కుల పంపిణీ
హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త :
ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ద్వారా మంజూరైన ఆర్థిక సహాయాన్ని జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలకు అందిస్తూ ఎమ్మెల్యే వి. నవీన్ యాదవ్ అందించారు. యూసుఫ్గూడలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో 20 మంది లబ్ధిదారులకు మొత్తం ₹12,27,500 విలువైన CMRF చెక్కులను ఎమ్మెల్యే స్వయంగా అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వి. నవీన్ యాదవ్ మాట్లాడుతూ, ఆపదలో ఉన్న ప్రతి కుటుంబానికి అండగా నిలిచి, అవసరమైన వారికి ప్రభుత్వ సహాయం అందేలా కృషి చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమన్నారు. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం అందుబాటులో ఉంటూ, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా కృషి చేస్తామని తెలిపారు.
Prajavartha Online Telugu News