హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త :
నేడు జూబ్లీహిల్స్లోని డాక్టర్ ఎంసీఆర్ హెచ్ఆర్డీ ఇన్స్టిట్యూట్లో నిర్వహించిన గణేష్ ఉత్సవాల-2026 ఉన్నతస్థాయి సన్నాహక సమన్వయ సమావేశంలో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే వి. నవీన్ యాదవ్ పాల్గొన్నారు. ఈసందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పారిశుద్ధ్యం, భద్రత, విద్యుత్, వైద్య సేవలు, ట్రాఫిక్ తదితర ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ మట్టి విగ్రహాల వినియోగాన్ని ప్రోత్సహించాలని, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని నివారించాలని ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ప్రజలకు, ఉత్సవ నిర్వాహకులకు విజ్ఞప్తి చేశారు. గణేష్ నవరాత్రి ఉత్సవాలు మరియు నిమజ్జన కార్యక్రమాలు సజావుగా జరిగేలా అధికారులు, నిర్వాహకులు, ప్రజలు పరస్పర సహకారంతో ముందుకు సాగాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మంత్రులు,ఎంపీలు, రాష్ట్ర పోలీస్ అధికారులు, జిల్లా కలెక్టర్లు, వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు, పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News