అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయకస్వామి వారి బ్రహ్మోత్సవాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కి ఆలయ కమిటీ ఆహ్వానం పలికింది. పూతలపట్టు ఎమ్మెల్యే మురళీ మోహన్, దేవాదాయశాఖ కమిషనర్ రామచంద్రమోహన్, ఆలయ ఛైర్మన్ సురేంద్రబాబు సచివాలయంలో సీఎంను కలిసి ఈ నెల 14 నుంచి అక్టోబర్ 4 వరకు జరిగే ఈ ఉత్సవాలకు రావాలని ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా సీఎంకు ఆలయ పండితులు వేదాశీర్వచనం పలికి స్వామి వారి చిత్రపటాన్ని, ప్రసాదాలను అందించారు.
Prajavartha Online Telugu News