తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త :
తిరుమల శ్రీవారిని సోమవారం ప్రాతః కాల సమయంలో సతీ సమేతంగా శ్రీవారిని సేవించి దర్శించుకున్న రాష్ట్ర సమాచార పౌరసంబంధాల శాఖ, సినిమాటోగ్రఫీ మరియు వెనుక బడిన తరగతుల శాఖా మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ. శ్రీ వారి దర్శన అనంతరం తిరుమల నుండి వారు తిరుగు పయనమయ్యారు. ఈ సందర్భంగా మంత్రికి వీడ్కోలు పలికిన వారిలో జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ అధికారి బాల కొండయ్య, జిల్లా వెనుక బడిన తరగతుల సంక్షేమ మరియు సాధికార ఇన్చార్జి అధికారి భాస్కర్ రెడ్డి తదితరులు ఉన్నారు.
Prajavartha Online Telugu News