తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో తిరుపతి లోని ప్రముఖ కంపెనీ అయిన ప్రాగ్ రూరల్ ఐటి బిజినెస్ సొల్యూషన్స్ నందు కంప్యూటర్ టైపింగ్ లో నైపుణ్యం కలిగిన యువతీ యువకులకు ప్రొసెస్ అసోసియేట్స్ మరియు టీమ్ లీడర్ ఉద్యోగాల కొరకు 09-05-2023 అనగా ఈ మంగళవారం నాడు ఉదయం 9 గంటల నుంచి ఇంటర్వ్యూలు నిర్వహించబడును.
ఇంటర్వ్యూలు జరుగు స్థలం: ప్రాగ్ రూరల్ ఐటి బిజినెస్ సొల్యూషన్స్, 1St Floor, సురభి గార్డెన్స్, అవిలాల సర్కిల్,తిరుపతి.
ఇంటర్వ్యూలు జరుగుతేది మరియు సమయం: 09-05-2023 & 09AM
విద్యా అర్హతలు: డిప్లొమా/ఏదైనా డిగ్రీ లో ఉత్తీర్ణత సాధించి మరియు కంప్యూటర్ టైపింగ్ లో నైపుణ్యం కలిగిన వారు.
జీతం:11000/- to 15000/- వరకు.
గమనిక: ప్రాగ్ రూరల్ ఐటి బిజినెస్ సొల్యూషన్స్ లో ఇంటర్వ్యూలకు హాజరయ్యే యువతీ యువకులకు కచ్చితంగా కంప్యూటర్ టైపింగ్ లో నైపుణ్యం కలిగి ఉండవలెను.
ఇంటర్వ్యూలకు హాజరయ్యే యువతీ యువకులు తమ రెస్యూ మ్ (బయో డేటా ఫామ్)తో పాటు ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకొని రావలెను అదేవిధంగా క్రింద ఇచ్చిన రిజిస్ట్రేషన్ లింకు లో తప్పనిసరిగా నమోదు చేసుకోవలెను మరిన్ని వివరాల కోసం క్రింద తెలుపబడిన మొబైల్ నెంబర్ ను సంప్రదించగలరు.
రిజిస్ట్రేషన్ లింకు:http://rb.gy/tao5ns.
సంప్రదించవలసిన మొబైల్ నెంబర్: +919177508279(Mahesh)
Prajavartha Online Telugu News