Breaking News

జనసేన పార్టీలో చేరిన వైసీపీ కీలక నేతలు

-మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు సామినేని ఉదయభాను, కిలారి రోశయ్య చేరిక
-విజయనగరం జిల్లా నుంచి వైసీపీ నేతలు అవనపు విక్రమ్ దంపతులు
-పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించిన జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ 

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
వైసీపీలో కీలకంగా పని చేసిన పలువురు నేతలు గురువారం మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమక్షంలో పార్టీలో చేరారు. ప్రకాశం జిల్లా వైసీపీ నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి, ప్రభుత్వ మాజీ విప్, జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను, పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలారి రోశయ్య, విజయనగరం జిల్లాకు చెందిన వైసీపీ యువజన విభాగం అవనపు విక్రమ్, ఉమ్మడి విజయనగరం జిల్లా డి.సి.ఎం.ఎస్. చైర్పర్సన్ అవనపు భావన పార్టీలో చేరారు. ఒంగోలుకు చెందిన వ్యాపారవేత్త  కంది రవిశంకర్, నెల్లూరుకు చెందిన సినీ నిర్మాత చిట్టమూరు ప్రవీణ్ కుమార్ రెడ్డి పార్టీలో చేరారు. వీరందరికీ పవన్ కళ్యాణ్ పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు.
పార్టీ బలోపేతానికి కృషి చేయాలని, పల్లె పల్లెకు జనసేన పార్టీ సిద్ధాంతాలను తీసుకెళ్లాలని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్  సూచించారు. పార్టీ కార్యాలయం బయట కృష్ణా, గుంటూరు, ప్రకాశం, విజయనగరం జిల్లాల నుంచి భారీగా వచ్చిన కార్యకర్తలకు పవన్ కళ్యాణ్ కార్యాలయం వెలుపలకు వచ్చి వారికి అభివాదం చేశారు. ఈ సందర్భంగా కార్యకర్తలు భారీ గజమాలతో పవన్ కళ్యాణ్ ని సత్కరించారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి సభ్యులు  పిడుగు హరిప్రసాద్, తిరుపతి శాసనసభ్యులు ఆరణి శ్రీనివాసులు, టిడ్కో ఛైర్మన్, పార్టీ కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ కమిటీ హెడ్ వేములపాటి అజయకుమార్, పార్టీ కార్యక్రమాల నిర్వహణ కమిటీ కన్వీనర్ కళ్యాణం శివ శ్రీనివాస్, పార్టీ ప్రకాశం జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్, గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు, కృష్ణా జిల్లా అధ్యక్షుడు బండ్రెడ్డి రామకృష్ణ, పార్టీ నేతలు చిల్లపల్లి శ్రీనివాస్, అక్కల గాంధీ, అమ్మిశెట్టి వాసు, మండలి రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

నాబార్డు క్రెడిట్ ప్లాన్ ఆవిష్కరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు

-2026-27 సంవత్సరానికి రూ.5.11 లక్షల కోట్ల రుణ ప్రణాళిక అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : నాబార్డు క్రెడిట్ ప్లాన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *