విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
2024 సంవత్సరమునకుగాను “గవర్నెన్స్ నౌ 9th పి ఎస్ యు ఐటీ అవార్డ్స్” అవార్డుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఎంపిక అయినదని తెలియచేయుటకు సంతోషించుచున్నాము. “యాప్” ద్వారా నగదు రహిత లావాదేవీలు మరియు కాగిత రహిత టికెట్ల జారీ సౌలభ్యాన్ని ప్రవేశ పెట్టుట, In Bus లో డిజిటల్ టికెట్లు జారీ చేయుట, సంస్థ అన్ని బస్సులలో ట్రాకింగ్ సిస్టం ను ఏర్పాటు చేయుట ద్వారా సంస్థ ఈ అవార్డును అందుకొనుచున్నది. ఈరోజు, ఢిల్లీ లో హోటల్ హాలిడే ఇన్ యందు జరిగిన అవార్డు ప్రదానోత్సవంలో సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ద్వారకా తిరుమలరావు తరుపున చీఫ్ ఇంజనీర్ (ఐటీ), V. సుధాకర్ ఈ అవార్డును అందుకోవటం జరిగినది.
Prajavartha Online Telugu News