Breaking News

వెలుగుల పండుగ దీపావ‌ళి – ప్ర‌జ‌ల జీవితాల్లో స‌రికొత్త కాంతులు నింపాలి

-దీపావ‌ళి శుభాకాంక్ష‌లు తెలిపిన ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని)

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
తెలుగు ప్ర‌జ‌లంద‌రికీ దీపావ‌ళి పండుగ సంద‌ర్భంగా విజ‌య‌వాడ ఎంపీ కేశినేని శివ‌నాథ్ దీపావ‌ళి శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. ఈ మేర‌కు బుధ‌వారం ఎంపి కేశినేని శివ‌నాథ్ ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. “తెలుగునేలపై నరకాసురుని ఏలుబడిలో ఇక్కట్ల పాలైనసమస్త ప్రజలు చీకటి పాలనకు స్వస్తి వాచకం పలికారు. అంధకారం తొలిగిపోయి..ఎన్డీయే కూటమి అధికారంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనలో వెన్నెల వెలుగు తెలుగు లోగిళ్లలో ప్రసరిస్తుంది. రాష్ట్రం అభివృద్ధి దిశలో పయనిస్తోంది. ఈ శుభ సమయంలో విచ్చేసిన..తొలి దివ్య దీపావళికి స్వాగతం..సుస్వాగతం..వెలుగుల పండుగ దీపావ‌ళి – ప్ర‌జ‌ల జీవితాల్లో స‌రికొత్త కాంతులు నింపాలి ప్రతి ఒక్కరూ ఆనందోత్సాహాల మధ్య, సురక్షితంగా… ఈ వెలుగుల పండుగను జరుపుకోవాలి . ఈ దీపాల పండుగ ప్ర‌జ‌ల‌ జీవితాల్లో సంపదలు, సౌభాగ్యాలు, విజయాలు, తీసుకురావాలి. వాతావరణ కాలుష్యం పట్ల అప్రమత్తంగా ఉండి పర్యావరణాన్ని రక్షించు కుందాం” అని ఎంపి కేశినేని శివ‌నాథ్ ఆకాంక్షించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *