Breaking News

ఈవీఎంలు భద్రపర్చిన గోడౌన్ల యొక్క లాక్స్, సీళ్లు పరిశీలించిన  కలెక్టర్ జె.నివాస్…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లా కలెక్టర్ జె.నివాస్ పోమవారం కలెక్టరేట్ ఆవరణలో గల ఈవిఎం గొడౌన్ సందర్శించి ఇవిఎంలు భద్రపర్చిన గోడౌన్ల యొక్క లాక్స్, సీళ్లు పరిశీలించారు. గొడౌన్ వద్ద సెక్యూరిటీ చెక్ పరిశీలించారు. సెక్యూరిటీ గార్డుల రూము వర్షాలకు లీకేజ్ అవుతుందని పోలీసు సిబ్బంది. చెప్పగా వెంటనే మరమ్మత్తులు చేయించాలని ఆదేశించారు. కొత్తగా నిర్మించే గొడౌన్ కలెక్టర్ పరిశీలించి , 2 గొడౌన్లను అనుసందానిస్తు వర్షం పడకుండా నిర్మించిన రూఫ్ పరిశీలించారు. రెండు గొడౌన్ల మధ్య రెండవ వైపు ఉన్న దారి గోడ నిర్మించి మూసివేయాలని ఆదేశించారు. గొడౌన్ల వెలుపల అన్ని వైపుల సిసి కెమోరాలు ఏర్పాటు చేయలన్నారు. బందరు ఆర్ డివో ఎస్ఎస్ కె. ఖాజావలి , తహసిల్దారు డి. సునీల్ బాబు, ఎన్నికల సెక్షన్ సూపరింటెండెంటు శ్యామ్ కలెక్టర్ వెంట ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *