విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వరద ముంపు ప్రభావిత ప్రాంతాల్లో బాధితులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తోంది. బాధితులకు లక్ష పాల ప్యాకెట్లు, 2 లక్షల వాటర్ బాటిళ్లను పంపిణీ చేస్తోంది. ఇందులో భాగంగా అజిత్ సింగ్ నగర్ లో బుధవారం వైసీపీ నగర అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, 33 వ డివిజన్ కార్పొరేటర్ శర్వాణి మూర్తి సహా వైసీపీ నాయకులు ఇంటింటికీ వెళ్లి పాలప్యాకెట్లు, వాటర్ బాటిళ్లను పంపిణీ చేశారు.
Read More »Monthly Archives: September 2024
ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలి .. జిల్లా కలెక్టర్
గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా పరిధిలోని బుడమేరు వరద ముంపు బారిన పడిన గ్రామాలలోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. నందివాడ మండలంలోని అరిపిరాల, పోలసివారిపాలెం, రామాపురం, ఇలపర్రు గ్రామాలు బుడమేరు వరద ముంపు బారిన పడే అవకాశం ఉన్న నేపథ్యంలో బుధవారం సాయంత్రం కలెక్టర్ గుడివాడలోని మున్సిపల్ కార్యాలయం కాన్ఫరెన్స్ హాల్లో వివిధ శాఖల అధికారులతో సమావేశమై ఆయా గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ప్రత్యేక అధికారులతో కూడిన బృందాలను …
Read More »వరద బాధితుల సహాయార్ధం ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : వరద బాధితుల సహాయార్ధం ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మీ ఐఏఎస్ అన్నారు. బుధవారం నరేడ్కో గుంటూరు జిల్లా బిల్డర్స్ అసోసియేషన్ ప్రతినిధులు నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ తో కలిసి జిల్లా కలెక్టర్ కి రూ.10 లక్షల విరాళం చెక్ ను, వాకర్స్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ చెలికాని సీతారామయ్య రూ.10 వేలు విరాళం అందించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రస్తుతం వరదల వలన ఇబ్బంది పడుతున్న ప్రజలకు అండగా …
Read More »వరద బాధితుల కోసం విరాళాలు అందించాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : వరద బాధితుల కోసం విరాళాలు అందించాలి అనుకునే దాతలు కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ గుంటూరు డిస్ట్రిక్ట్ పేరుతో IDFC బ్యాంక్ అకౌంట్ నం.33260919895, ఐఎఫ్ఎస్సీ కోడ్ IDFC0081061 పేరుతో చెక్ లు, డిడిలు అందించ వచ్చని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ గారు మాట్లాడుతూ వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలకు అండగా నిలవడానికి విరాళాలు అందించడానికి పలువురు ముందుకు వస్తున్నారని, విరాళాలు అందించే వారి …
Read More »బాధితులకు బాసటగా ఎమ్మెల్యే సుజనా చౌదరి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి వరద బాధితులకు బాసటగా నిలిచారు. చిట్టినగర్ లోని కామాక్షి విశ్వబ్రాహ్మణ కళ్యాణ మండపంలో నాలుగో రోజు కుడా ఆహారాన్ని సిద్ధం చేశారు. బుధవారం వరకు 80 వేల మందికి పైగా ఆహారాన్ని అందించారు. సుజనా ఫౌండేషన్ సిబ్బంది, ఎన్డీయే కూటమి, వాలంటీర్లు, ఎమ్మెల్యే కార్యాలయ సిబ్బంది సమన్వయంతో రేయింబవళ్లు పనిచేస్తున్నారు. ట్రాక్టర్ల ద్వారా ఎమ్మెల్యే కార్యాలయ సిబ్బంది, వాలంటీర్లు, ముంపు ప్రాంతాలలో పర్యటిస్తూ ఆహారాన్ని అందిస్తున్నారు. బుధవారం చిట్టినగర్, పాల ఫ్యాక్టరీ, …
Read More »సుజనా చౌదరి ఔదార్యం
-కార్యకర్తకు ఆర్థిక సాయం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశాలతో 46 వ డివిజన్లో బుధవారం గుండెపోటుతో మరణించిన సత్యాల పానకాలరావు కుటుంబానికి ఆర్థిక సాయం అందించారు. ఎమ్మెల్యే కార్యాలయ సిబ్బంది ఎన్డీయే కూటమి నాయకులతో కలిసి వారి కూతురు లలితాంబను పరామర్శించారు. నిరుపేద అయినటువంటి పానకాలరావు కుటుంబానికి ఆర్థిక సాయం అందజేయాలని స్థానిక విలేకరులు సుజనా దృష్టికి తీసుకెళ్లగా తక్షణమే తమ కార్యాలయ సిబ్బందికి మట్టి ఖర్చుల నిమిత్తం రూ 10,000 వేలను అందజేయాలని ఆదేశాలు జారీ …
Read More »ప్రతి ఒక్కరికి ఆహారం చేరేలా చర్యలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతి ఒక్కరికి ఆహారం చేరేలా ప్రతి డివిషన్లో ప్రతి సందులో చివరి ఇంటి వరకు ఆహారం వెళ్లిలా చూసుకోవాలని అన్నారు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర. గౌరవనీయులైన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి అదేశాల మేరకు విజయవాడ, ఎంజీ రోడ్ లోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో నుండి వరద ప్రభావిత ప్రాంతాలలో ఆహార పంపిణీ జరుగుతుంది. విజయవాడ నగర పరిధిలో ఉన్న వరద ప్రభావిత ప్రాంతాలకు ప్రతి ఒక్కరికి …
Read More »భోజనం ప్యాకెట్లను ప్రతి ఒక్కరికి అందేలా చూసుకోవాలి
-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధనచంద్ర మంగళవారం ఉదయం కండ్రిక జంక్షన్, అజిత్ సింగ్ నగర్ ప్రాంతాలు పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అక్కడ ఉన్న ప్రజలకు బోట్ సహాయం అందుతుందా లేదా, భోజనం బోట్ల ద్వారా కానీ, ట్రాక్టర్ ద్వారా కానీ ప్రజలందరికీ అందుతున్నాయా లేదా వార్డ్ సెక్రటరీలు అప్రమత్తంగా ఉన్నారా లేదా, ప్రజలకు ఇంకేమైనా అవసరం ఉందా అన్న అంశంపై క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఫ్లై ఓవర్ పైన పంపిణీ …
Read More »వరద ప్రభావిత ప్రాంతాల్లో నీరు తగ్గిన తర్వాత చేపట్టాల్సిన చర్యలపై సమావేశం నిర్వహించిన మున్సిపల్ మినిస్టర్
-నగరంలో పారిశుధ్య నిర్వహణ కోసం ఇతర మున్సిపాలిటీల నుంచి అధికారులను రప్పించిన మంత్రి నారాయణ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో గల నూతన భవనంలో మంగళవారం సాయంత్రం మున్సిపల్ శాఖ మినిస్టర్ పొంగూరు నారాయణ, మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్, స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ఎండీ గంధం చంద్రుడు,మున్సిపల్ శాఖ డైరెక్టర్ హరి నారాయణన్, టీడ్కో ఎండీ సాయి కాంత్ వర్మ, వీఎంసి కమిషనర్ ధ్యాన చంద్ర, సమక్షంలో వివిధ …
Read More »ప్రజలను రక్షించేందుకు నిరంతర చర్యలు… : జిల్లా కలెక్టర్
పెదపారుపూడి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో అధిక వర్షాలు, వరదల కారణంగా ముంపుకు గురైన ప్రాంతాలలోని ప్రజలను రక్షించేందుకు జిల్లా యంత్రాంగం అహర్నిశలు నిరంతర చర్యలు తీసుకుంటూ అప్రమత్తంగా ఉందని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. బుధవారం ఉదయం కలెక్టర్ జిల్లా ఎస్పీ ఆర్ గంగాధర్ రావుతో కలిసి పెదపారుపూడి మండలంలోని వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటించారు. గ్రామాలలోని వీధుల్లో తిరుగుతూ వరద ముంపు పరిస్థితులను పరిశీలించి ప్రజలతో మాట్లాడారు. ఈ క్రమంలో వారు ట్రాక్టర్, ద్విచక్ర వాహనంపై చేరుకొని పుట్టగుంట, …
Read More »
Prajavartha Online Telugu News