విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వరద బాధితులకు పరిహారం విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు దారుణమని సెంట్రల్ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మండిపడ్డారు. ఈ మేరకు ఆంధ్రప్రభ కాలనీలోని జనహిత సదనంలో మంగళవారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. వరద బాధితులను ఈ ప్రభుత్వం నిండా ముంచిందని.. ముఖ్యంగా సర్వే వివరాలు పొంతన లేనివిధంగా ఉన్నాయని మండిపడ్డారు. 97 శాతం మందికి నగదు బదిలీ చేసినట్లు ప్రభుత్వం చెబుతున్నా.. గ్రౌండ్ రిపోర్ట్ పూర్తి విరుద్ధంగా ఉందన్నారు. ఎన్యుమరేషన్లో …
Read More »Daily Archives: October 1, 2024
ఎంపి కేశినేని శివనాథ్ ను మర్యాద పూర్వకంగా కలిసిన ఒంగోలు ఎంపి మాగుంట
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఒంగోలు ఎంపి మాగుంట శ్రీనివాసులురెడ్డి మంగళవారం గురునానక్ కాలనీలోని విజయవాడ పార్లమెంట్ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఎంపి మాగుంట తో పాటు విచ్చేసిన ఆయన తనయుడు రాఘవరెడ్డి కూడా ఎంపి కేశినేని శివనాథ్ కలవటం జరిగింది. ఎంపి మాగుంట కు ఎంపి కేశినేని శివనాథ్ సాదర స్వాగతం పలికారు. అనంతరం వీరు రాష్ట్రానికి కేంద్రం నుంచి తీసుకురావాల్సిన నిధుల గురించి, రాష్ట్రంలో అభివృద్ది నిరోధక శక్తుల్ని …
Read More »అమ్మవారి దర్శన విషయంలో సామాన్య భక్తులకే ప్రాధాన్యత ఇవ్వాలి : ఎంపి కేశినేని శివనాథ్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దసరా శరన్నవరాత్రి మహోత్సవ పర్వదినములలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు, ఆటంకాలు జరగకుండా, అమ్మవారి దర్శనం అందరికీ అందేలా చూడాలని, సామాన్య భక్తులకే అధిక ప్రాధాన్యత ఇవ్వాలని విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ అధికారులకు సూచించడం జరిగింది. ఇంద్రకీలాద్రి పై కొలువు దీరిన శ్రీ కనకదుర్గ అమ్మవారి శరన్నవరాత్రి మహోత్సవ ఏర్పాట్ల పై దుర్గా ఘాట్ లోని మోడల్ గెస్ట్ హౌస్ నందు కమాండ్ కంట్రోల్ రూమ్ లో మంగళవారం సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమీక్ష సమావేశంలో …
Read More »నగరంలో హై లైఫ్ ఎగ్జిబిషన్ ప్రారంభం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలోని నోవాటెల్ లో హై లైఫ్ ఎగ్జిబిషన్ మంగళవారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా హైలైఫ్ ఎగ్జిబిషన్స్ ఎండి & సీఈఓ అబి పి డొమినిక్ మాట్లాడుతూ” అతిపెద్ద ఎగ్జిబిషన్లలో హై లైఫ్ ఒకటి. వెడ్డింగ్ ఫ్యాషన్స్, జ్యువెలరీ, బ్రైడల్ ఫ్యాషన్ అవసరాలతో పాటుగా లైఫ్ స్టైల్ ఉత్పత్తులు ప్రదర్శించనున్నామన్నారు. ఫ్యాషన్ డిజైనర్ల నుండి తాజా కలెక్షన్, ఫ్యాషన్ లేబుల్లు కూడా ప్రదర్శించనున్నాము” అని అన్నారు.ఫ్యాషన్ షాపింగ్, ఎక్స్ క్లూజివ్ వెడ్డింగ్ షాపింగ్, బ్రైడల్ ఫ్యాషన్లు, జ్యువెలరీ, ఫ్యాషన్ …
Read More »అక్టోబర్ 3 నుంచి దేవి శరన్నవరాత్రి మహోత్సవ కమిటీ ఆధ్వర్యంలో దసరా మహోత్సవాలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ శ్రీ దేవి శరన్నవరాత్రి మహోత్సవ కమిటీ ఆధ్వర్యంలో శత చండీ హోమం, రుద్రాభిషేకం అత్యంత వైభవంగా సిద్ధార్థ హోటల్ మేనేజ్మెంట్ కళాశాల గ్రౌండ్ మొగల్రాజపురం నందు జగద్గురువుల వారి ఆశీస్సులతో అక్టోబర్ 3 నుంచి 12 వ తేదీ వరకు దసరా మహోత్సవాలు జరుపుటకు నిర్ణయించినట్లు కమిటీ చైర్మన్ సి ఎ సుంకర అక్కయ్య నాయుడు తెలిపారు. మంగళవారం సిద్ధార్థ హోటల్ మేనేజ్మెంట్ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దసరా …
Read More »గాయత్రీ ర్యాంపు ఆకస్మికంగా తనిఖీ చేసిన అధికారుల బృందం
-జెసి చిన్న రాముడు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : గాయత్రి 1 , 2 , 3 ర్యాంపుల్లో ఇసుక రవాణా ప్రక్రియను క్షేత్ర స్థాయిలో పరిశీలించి బోట్స్ మ్యాన్ సొసైటి సభ్యులతో చర్చించి మరింత సమర్థవంతంగా రవాణా కార్యకలాపాలు నిర్వహించాలని కోరడం జరిగిందని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు పేర్కొన్నారు. మంగళవారం స్థానిక గాయత్రి ర్యాంపులని సమన్వయ శాఖల అధికారులతో కలిసి జెసి పరిశీలించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు మాట్లాడుతూ గాయత్రి ర్యాంపుల …
Read More »రైతు సేవ కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు
-జిల్లావ్యాప్తంగా 220 రైతు సేవా కేంద్రాలు ఏర్పాటు -టోల్ ఫ్రీ నంబరు : 1967 -తూర్పు గోదావరి జిల్లా కంట్రోల్ రూం నెంబర్: 8309487151 -జాయింట్ కలెక్టర్ తో కలిసి బ్యానర్ ను ఆవిష్కరణ -కలెక్టరు పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము వారు రైతన్నలకు కల్పిస్తున్న అదనపు సౌకర్యాల నేపథ్యంలో ధాన్యం సేకరణకు అవసరమైన గోనెసంచులను ప్రభుత్వమే ఉచితంగా సరఫరా చేస్తుందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలియ చేశారు. స్థానిక కలెక్టర్ క్యాంప్ …
Read More »అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా స్వచ్ఛతహీ సేవ ముగింపు కార్యక్రమాలు
-వేడుకగా, స్పూర్తి నిచ్చే విధంగా కార్యక్రమాలు చేపట్టాలి -తరగతుల నిర్వహణా చేపట్టకుండా స్వచ్ఛత హి సేవా కార్యక్రమాలను నిర్వహించాలి – కలెక్టరు పి. ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : అక్టోబరు 2 వ తేదీన గాంధీ జయంతి ప్రభుత్వ సెలవు దినము నాడు జిల్లాలోకి అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల నందు “స్వచ్యత: హి సేవ’ ముగింపు నిర్వహణ కార్యక్రమము జరపవలేనని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మంగళ వారం ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈమేరకు జిల్లా విద్యాధికారి పాఠశాల విద్యా …
Read More »లబ్ధిదారునికి మనోధైర్యం కల్పించిన మంత్రి కందుల దుర్గేష్
తూర్పు గోదావరి జిల్లా, విజ్జేస్వరం, నేటి పత్రిక ప్రజావార్త : బ్రెయిన్ ఆపరేషన్ జరిగిన విజ్హేశ్వరం కి చెందిన చడల్లా సత్యనారాయణ కు కూటమి ప్రభుత్వం వొచ్చిన తరువాత పెన్షన్ల మొత్తాన్ని 15 వేలకు పెంచి ఇవ్వడం వల్ల మా కుటుంబానికి, నా మందులకు ఎంతో ఆసరాగా ఉందని పేర్కొన్నారు. మంగళవారం రాష్ట్ర పర్యటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ చేతుల మీదుగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ నగదును అందుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ లబ్ధిదారునికి మనోధైర్యం కల్పించి, కూటమి ప్రభుత్వం …
Read More »డ్రెయిన్ల వ్యవస్థపై ప్రత్యేక దృష్టి
– ముంపు సమస్య శాశ్వత పరిష్కారంలో భాగంగా చర్యలు – రైల్వేతో ముడిపడిన అంశాల్లో పురోగతిపై ప్రతి నెలా సమావేశాలు – విజయవాడ అర్బన్ పరిధిలో ఈ నెల 3, 4 తేదీల్లో ఉమ్మడి తనిఖీల నిర్వహణ – విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని), కలెక్టర్ డా. జి.సృజన విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఇటీవల వరద ముంపుతో విజయవాడ, పరిసర ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులుపడ్డారని.. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు రాకుండా ఉండేందుకు, శాశ్వత పరిష్కారానికి రాష్ట్ర …
Read More »
Prajavartha Online Telugu News