Breaking News

Daily Archives: October 18, 2024

సబ్సిడీ సరుకులను అందించేందుకు సహకరించండి

-వంట నూనె దిగుమతిదారుల సమావేశంలో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రజలకు భారీ ఊరట కల్పించింది. పెరిగిన ధరల నుంచి ప్రజలను కాపాడేందుకు తక్కువ ధరకే వంట నూనెను అందించాలని నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా పామాయిల్ లీటరు 110/- రూ.. సన్‌ప్లవర్ ఆయిల్ 124/- రూ.. ప్రజలకు అందుబాటులో ఉంచడం జరిగింది అన్నారు. సివిల్ సప్లయ్స్ భవనంలో శుక్రవారం వంటనూనె దిగుమతిదారులతో …

Read More »

ఇసుక వ్యవహారంలో రాష్ట్ర ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం

-స్థానిక అవసరాలకు ట్రాక్టర్ లలోనూ ఉచిత ఇసుక తరలింపుకు అనుమతి -సీఎం ఆదేశాలతో ఉత్తర్వులు జారీ చేసిన గనుల శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా -ఇప్పటి వరకు ఎడ్ల బండికి మాత్రమే అనుమతి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఏపీ ప్రభుత్వం ఇసుక విషయంలో గుడ్‌న్యూస్ చెప్పింది.ఇసుక రీచ్‌ల నుంచి ఇసుకను ట్రాక్టర్లల్లో తీసుకెళ్లేందుకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో స్థానిక అవసరాలకు ఇసుకను తీసుకెళ్లేందుకు కేవలం ఎడ్ల బండ్లకు మాత్రమే ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. సీఎం …

Read More »

ప్రశాంతంగా ముగిసిన పద్నాలుగవ రోజు ఉపాధ్యాయ అర్హత పరీక్షలు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఉపాధ్యాయ అర్హత పరీక్షలలో భాగంగా పద్నాలుగవ రోజు అనగా 18/10/2024 తేదీన ఉదయం, పేపర్-2ఏ మాథ్స్ & సైన్స్ విభాగంలో మధ్యాహ్నం సాంఘిక శాస్త్ర విభాగంలో అభ్యర్థులకు ఉపాధ్యాయ అర్హత పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షలలో మొత్తం 21534 మందికి గాను 18441 మంది అభ్యర్థులు అనగా 85.63 శాతం మంది హాజరయ్యారు. ఉదయం 30 సెంటర్లలో జరిగిన పేపర్-2ఏ.మాథ్స్ & సైన్స్ ఉపాధ్యాయుల అర్హత పరీక్షకు 6610 మందికి గాను 5702 మంది అనగా 86.26 …

Read More »

కుక్క‌, పాము కాటుల‌కు గురైన వారికి స‌త్వ‌ర చికిత్స‌

-పోస్ట‌ర్లు, క‌ర‌ప‌త్రాల్ని ఆవిష్క‌రించిన వైద్య ఆరోగ్య శాఖ‌ స్పెష‌ల్ సియ‌స్ ఎం.టి.కృష్ణ‌బాబు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కుక్క‌, పాము కాటుల‌కు గురైన వారికి స‌త్వ‌ర చికిత్స అందించే చ‌ర్య‌ల్లో భాగంగా స‌మాచారాన్ని అందించేందుకు రాష్ట్ర ప్ర‌భుత్వం కొత్త‌గా హెల్ఫ్ లైన్ ను ఏర్పాటు చేసింది. జాతీయ స్థాయిలో ఏర్పాటు చేసిన 15400 టోల్ ఫ్రీ నంబ‌రుకు బాధితులు సంప్ర‌దిస్తే కుక్క కాటుకు వ్యాక్సిన్లు ఎక్క‌డ ల‌భ్య‌మ‌వుతాయో వెంట‌నే స‌మాధానం చెప్తారు. ఉద‌యం 9 నుంచి సాయంత్రం ఆరు గంట‌ల మ‌ధ్య ఈ …

Read More »

రాయలసీమలో మహిళలకు ప్రత్యేక ఇంజనీరింగ్ కళాశాల

-విద్యా మంత్రి లోకేష్ కు మంత్రి సత్యకుమార్ యాదవ్ వినతి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆధునిక విజ్ఞాన, ఆర్థిక వ్యవస్థలో మహిళా సాధికారికతపై గట్టి సందేశం పంపే విధంగా రాయలసీమలో మహిళలకు ప్రత్యేకంగా ఇంజనీరింగ్ కళాశాలను ఏర్పాటు చేసే విషయాన్ని పరిశీలించాలని రాష్ట్ర మానవవనరుల అభివృద్ధి శాఖా మంత్రి శ్రీ నారా లోకేష్ కు వైద్య ఆరోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ విజ్ఞ‌ప్తి చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేత్రుత్వంలో సమైక్య, విభజిత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలుగు వారి …

Read More »

అగ్నివీర్ ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆర్మీ రిక్రూటింగ్ ఆఫీస్, గుంటూరు, అగ్నివీర్ జనరల్ డ్యూటీ, అగ్నివీర్ టెక్నికల్, అగ్నివీర్ ఆఫీస్ అసిస్టెంట్/స్టోర్ కీపర్ టెక్నికల్, అగ్నివీర్10TH ట్రేడ్స్మన్, అగ్నివీర్ 8TH ట్రేడ్స్మన్, 10 నవంబర్ 2024 నుండి 15 నవంబర్ 2024 వరకు గుంటూరు (ఆంధ్రప్రదేశ్)లోని DSA స్టేడియంలో కడప రిక్రూట్మెంట్ ర్యాలీని నిర్వహించబోతోంది. అగ్నివీర్ ట్రేడ్స్మన్ 8వ తరగతి ఉత్తీర్ణత. సబ్జెక్ట్ ర్యాలీకి అడ్మిట్ కార్డులు పొందిన కర్నూలు, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, అనంతపురం, వైఎస్ఆర్ కడప, గుంటూరు, ప్రకాశం, …

Read More »

ఉల్లాస్ అక్ష‌రాస్య‌తా కార్య‌క్ర‌మంపై దృష్టిపెట్టండి

-ప‌థ‌కం అమ‌లుకు అధికారులు ప‌టిష్ట స‌మ‌న్వ‌యంతో ప‌నిచేయండి -జిల్లా ఇన్‌ఛార్జ్ క‌లెక్ట‌ర్ డా. నిధి మీనా విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప‌దిహేనేళ్ల‌కు పైబ‌డిన వారిలో నిర‌క్ష‌రాస్యుల‌ను గుర్తించి.. వారిని అక్ష‌రాస్యులుగా తీర్చిదిద్ద‌డంతో పాటు ఆర్థిక అక్ష‌రాస్య‌త‌, డిజిట‌ల్ అక్ష‌రాస్య‌త పెంపొందించేందుకు ఉద్దేశించిన ఉల్లాస్ (అండ‌ర్‌స్టాండింగ్ లైఫ్‌లాంగ్ లెర్నింగ్ ఫ‌ర్ ఆల్ ఇన్ సొసైటీ) కార్య‌క్ర‌మం అమ‌లుపై అధికారులు ప్ర‌త్యేకంగా దృష్టిసారించాల‌ని జిల్లా ఇన్‌ఛార్జ్ క‌లెక్ట‌ర్ డా. నిధి మీనా ఆదేశించారు. శుక్ర‌వారం సాయంత్రం జాయింట్ క‌లెక్ట‌ర్ క్యాంపు కార్యాల‌యంలో ఉల్లాస్ కార్య‌క్ర‌మం …

Read More »

ప్రత్యేక వైద్య నిపుణులుతో ఉచిత మెగా వైద్యశిబిరం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ అధ్వర్యంలో విజయవాడ పట్టణ పరిధిలోని వాంబేకాలనీలో ఇటీవల వరదల ప్రభావానికి గురై వివిధ అనారోగ్య పరిస్థితులు ఏర్పడిన దృష్ట్యా ఈ నెల 19 వ తేదీ శనివారం ఉదయం 9 గం నుండి 5 గం వరకు స్పెషలిస్ట్ డాక్టర్లతో ఉచిత మెగా ప్రత్యేక వైద్య శిబిరం పట్టణ ఆరోగ్య కేంద్రం, వాంబే కాలనీ GXL – G . block., నందు ఏర్పాటు చేయడం జరిగినది.ఈ శిబిరం నందు గుండె …

Read More »

90 రోజుల స్పెషల్ శానిటేషన్ డ్రైవ్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగర పాలక సంస్ధ ప్రత్యేకంగా చేపట్టిన 90 రోజుల స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ ని ముమ్మరం చేయాలని, డ్రైవ్ పర్యవేక్షణకు విధులు కేటాయించబడిన అధికారులు మరింత శ్రద్దగా పర్యవేక్షణ చేయాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ శుక్రవారం టెలి కాన్ఫరెన్స్ ద్వారా ఆదేశించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ గుంటూరు నగరాన్ని స్వచ్చ నగరంగా తీర్చిదిద్దుకోవదానికే 90 రోజుల స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ చేపట్టామని, డ్రైవ్ పర్యవేక్షణకు విధులు కేటాయించబడిన 22 మంది సీనియర్ …

Read More »

మురుగు పారుదలకు అడ్డంకిగా ఉన్న డ్రైన్లపై ఆక్రమణలను దశల వారీగా తొలగింపు…

-కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్  గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో డ్రైన్ల పై ఆక్రమణలను దశల వారీగా తొలగిస్తామని, ప్రజా సౌకర్యార్ధం ఆక్రమణదారులు సహకరించాలని నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ తెలిపారు. నగర కమిషనర్ ఆదేశాల మేరకు శుక్రవారం ప్రభుత్వ వైద్యశాల, రైల్ పేట ప్రధాన రహదారిలో డ్రైన్ మీద, రోడ్ల మీద ఆక్రమణలను ఏసిపి మల్లికార్జున ఆధ్వర్యంలో పట్టణ ప్రణాళిక అక్రమ ఆక్రమణ దళం తొలగించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో …

Read More »