Breaking News

Daily Archives: October 27, 2024

బి ఎన్ కే యూ 1వ ఇంటర్నేషనల్ ఫిడే ర్యాపిడ్ రేటింగ్ చెస్ టోర్నమెంట్-2024 విజేతలు

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : మూడు దేశాల నుండి 601 క్రీడాకారులు పాల్గొనగా ర్యాపిడ్ విభాగంలో ఐదు రోజులు పాటు స్విస్ లీగ్ పద్ధతిలో తొమ్మిది రౌండ్ల పోటీలు నిర్వహించారు. ర్యాపిడ్ విభాగంలో 3లక్షల నగదు బహుమతిని విజేతలకు బహుమతి ప్రధానం చేశామని టోర్నమెంట్ కన్వీనర్ ఎస్కే ఖాసీం గారు, బి ఎన్ కే యూ ఫౌండేషన్ సెక్రటరీ విత్తనాల్ కుమార్, కార్యదర్శి టి నరేష్, వైస్ ప్రెసిడెంట్ అమ్మినేని ఉదయ్ కుమార్ నాయుడు తెలిపారు. బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా  శ్రీనివాసరాజు, …

Read More »

విశాఖ స్టేడియంలో అంతర్జాతీయ ప్రమణాలతో కూడిన వసతులు కల్పిస్తాం. : ఎసిఎ అధ్యక్షుడు, ఎంపి కేశినేని శివ‌నాథ్

-మ‌రిన్నీ అంత‌ర్జాతీయ క్రికెట్ మ్యాచ్ లు జ‌రిపించ‌ట‌మే ల‌క్ష్యం  -వైజాగ్ లో ఏసీఏ-వీడీసీఏ స్టేడియం ప‌రిశీల‌న‌ -జిల్లా క్రికెట్ అసోసియేష‌న్ నాయ‌కులతో స‌మీక్షా సమావేశం వైజాగ్, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృషి, ప్రధాని నరేంద్ర మోదీ సహకారంతో రాష్ట్రం ప్రగతి పథంలో నడుస్తోంది. అలాగే బిసిసిఐ స‌హ‌కారంతో ఆంధ్ర క్రికెట్ అసోసియేష‌న్ ఆధ్వ‌ర్యంలో రాష్ట్రంలో మ‌రిన్నీ అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ లు జ‌రిపించేందుకు కృషి చేస్తామ‌ని ఆంధ్ర క్రికెట్ అసోసియేష‌న్ అధ్య‌క్షుడు, విజ‌య‌వాడ ఎంపి కేశినేని శివ‌నాథ్ …

Read More »

రాష్ట్రంలో విమాన‌య‌న రంగం అభివృద్ధి పై సీఎం చంద్ర‌బాబు ప్ర‌త్యేక దృష్టి పెట్టారు : ఎంపి కేశినేని శివ‌నాథ్

-విశాఖ‌-విజ‌య‌వాడ మ‌ధ్య ఎయిరిండియా..ఇండిగో విమాన స‌ర్వీసులు -వైజాగ్ ఎయిర్ పోర్టులో ప్రారంభించిన కేంద్ర‌మంత్రి రామ్మోహ‌న్ నాయుడు, ఎంపి కేశినేని శివ‌నాథ్ వైజాగ్, నేటి పత్రిక ప్రజావార్త : అమ‌రావ‌తి రాజ‌ధాని ప్రాంతానికి విమాన స‌ర్వీసుల కనెక్టివిటీ పెరిగితే వ్యాపార‌స్తుల‌కి, ప్ర‌జ‌ల‌కి మ‌రింత సౌక‌ర్యంగా వుంటుందని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు రాష్ట్రంలో విమాన‌య‌న రంగం అభివృద్దిపై ప్ర‌త్యేక దృష్టి పెట్టారు. ఇక కేంద్రం నుంచి ప్ర‌ధాన మంత్రి మోదీ, పౌర‌విమాన‌యాన శాఖ మంత్రి రామ్మోహ‌న్ నాయుడు అందుకు ఎంతో స‌హ‌క‌రిస్తున్నార‌ని విజ‌య‌వాడ ఎంపి కేశినేని శివ‌నాథ్ …

Read More »

“ఆయుర్వేద సద్వైద్య సంభాష పరిషద్ ” కార్యక్రమం

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : దేశంలో ఉన్న ప్రసిద్ధి చెందిన క్వాలిఫైడ్ ఆయుర్వేద వైద్యులు వారి ప్రాక్టీసు లోని అనుభవ ఆయుర్వేద చికిత్సల విశేషాలు ఆయుర్వేద వైద్యులు, విద్యార్థులు కి తెలుపుట ద్వారా విజ్ఞాన సముపార్జన, అభివృద్ధి కి దోహదపడుతుందన్న ఉద్దేశ్యం తో”ది ఇండియన్ మెడికల్ ప్రాక్టీషర్స్ కో-ఆపరేటివ్ ఫార్మసీ అండ్ స్టోర్స్ (ఇంపికాప్స్) ఆధ్వర్యంలో” విజయవాడ,బీసెంట్ రోడ్ లో ఉన్న ఇంపీకప్స్ పంచకర్మ హాస్పిటల్ లో ప్రతి నెల జరుగుతున్న “ఆయుర్వేద సద్వైద్య సంభాష పరిషద్ ” కార్యక్రమం మరియు 9 …

Read More »

కాంగ్రెస్ శ్రేణుల సంబరాలు

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మల్లికార్జున్ ఖర్గే రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ పార్టీ నగర కార్యాలయంలో శనివారం రాత్రి సంబరాలు నిర్వహించారు. నగర అధ్య క్షుడు నరహరిశెట్టి నరసింహారావు, ఏఐసీసీ ఉపాధ్యక్షులు కొలనుకొండ శివాజీ, వి. గురునాథంల ఆధ్వ ర్యంలో కేకు కోశారు. ఖర్గే బాధ్యతలు స్వీకరించిన అనంతరం శ్రేణుల్లో నూతనోత్సాహం వెల్లివిరిసింద న్నారు. 60 సంవత్సరాలుగా చట్ట సభలకు ఆయన ప్రాతినిధ్యం వహిస్తూనే ఉన్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి కృష్ణాజిల్లా కాపు సెల్ నాయకుడు …

Read More »

డాక్టర్ తరుణ్ కాకానికి పురస్కారం

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : అమరావతి బోటింగ్ క్లబ్ సీఈవో డాక్టర్ తరుణ్ కాకాని ప్రకృతి మరియు వన్యప్రాణుల సంరక్షణ కోసం సంస్థ చేపట్టిన కార్యక్రమాలకు తెలంగాణ గవర్నర్ విష్ణు దేవ్ వర్మ నుండి మొమెంటో అందుకున్నారు. హైదరాబాద్‌లోని మ్యారిగోల్డ్ హోటల్‌లో డబ్ల్యూడబ్ల్యూఎఫ్ (వరల్డ్ వైల్డ్‌లైఫ్ ఫండ్) ఇండియా-హైదరాబాద్ కార్యాలయం ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. 9వ గోల్ఫ్ టోర్నమెంట్‌ని WWF ఇండియా-హైదరాబాద్, HGA-హైదరాబాద్ గోల్ఫ్ అసోసియేషన్‌తో కలిసి వన్యప్రాణులు మరియు ప్రకృతి సంరక్షణ కోసం నిధులను సేకరించేందుకు నిర్వహించింది. హైదరాబాద్ గోల్ఫ్ అసోసియేషన్ …

Read More »

హ్యాపీ కిడ్స్ క్లినిక్ ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం

-డాక్టర్ లక్ష్మీ ప్రసన్న విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : హ్యాపీ కిడ్స్ క్లినిక్, భవానిపురం వైద్య నిపుణుల సంయుక్త ఆధ్వర్యంలో ఎన్డీఏ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతమైందని పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ వై .లక్ష్మీ ప్రసన్న( పీడియాట్రిక్స్) అన్నారు. హ్యాపీ కిడ్స్ క్లినిక్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఉచిత వైద్య శిబిరానికి స్థానిక మహిళలు, చిన్నారులు, వృద్ధులు భారీగా తరలివచ్చి నిపుణులైన వైద్యుల నుంచి చికిత్సను తీసుకొని సలహాలు, సూచనలు పొందారన్నారు. చిన్నపిల్లలకు సురక్షితమైన, నాణ్యమైన …

Read More »

28 అక్టోబర్ నుండి 30 అక్టోబర్ తారీకు వరకు విజయవాడ నగరంలో దీపావళి విత్ మై భారత్ కార్యక్రమాలు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడా మంత్రిత్వ శాఖ మరియు కేంద్రం మై భారత్ డిపార్ట్మెంట్ ఆదేశాల మేరకు మైభారత్ పోర్టల్ లాంచ్ అవి సంవత్సరకాలం ముగుస్తున్నందున దీవాలి విత్ మై బారత్ అనే కార్యక్రమంలో చేపట్టడం జరుగుతుందని నెహ్రూ కేంద్ర జిల్లా యువ అధికారి ధికారి సుంకర రాము ఓ ప్రకటనలో తెలిపారు. దీవాలి విత్ మై బారత్ మేరా యువభారత్ ప్రోగ్రాం లో భాగంగా ఎన్టీఆర్ జిల్లా విజయవాడ నగరంలో ఈనెల 28 న …

Read More »

మధుమేహం, ఎండోక్రైనాలజీ చికిత్సల్లో విప్లవాత్మక ఆవిష్కరణలు

– ఆధునిక చికిత్సలతో ప్రజలకు మరింత మెరుగైన చికిత్సలు – యలమంచి డయాబెటిస్ రీసెర్చ్ ఫౌండేషన్ డయాబ్ ఎండో కాన్ 2024లో వక్తలు – పలు అంశాలపై నిపుణుల విశ్లేషణాత్మక ప్రసంగాలు – 500 మందికి పైగా వైద్యుల హాజరు – ప్రముఖ ఎండోక్రైనాలజిస్ట్ డాక్టర్ కృష్ణ శేషాద్రికి గోల్డ్ మెడల్ ప్రదానం విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : మధుమేహం, ఎండోక్రైనాలజీ చికిత్సల్లో విప్లవాత్మక ఆవిష్కరణలు చోటుచేసుకున్నాయని యలమంచి డయాబెసిస్ రీసెర్చ్ ఫౌండేషన్ చైర్మన్, ప్రఖ్యాత డయాబెటాలజిస్ట్ డాక్టర్ యలమంచి సదాశివరావు తెలిపారు. …

Read More »