Breaking News

Monthly Archives: October 2024

వివిధ వర్గాల ప్రజలు, యువత, ఉద్యోగులు, విద్యార్ధులు పెద్ద ఎత్తున భాగస్వాములు అవుతున్నారు

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : స్వచ్చ గుంటూరు సాధనలో గుంటూరు నగరంలోని వివిధ వర్గాల ప్రజలు, యువత, ఉద్యోగులు, విద్యార్ధులు పెద్ద ఎత్తున భాగస్వాములు అవుతున్నారని, సమిష్టి కృషితో స్వచ్చ గుంటూరు అతి త్వరలో సాకారమవుతుందని గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ అన్నారు. మంగళవారం స్థానిక టిజెపిఎస్ కళాశాల ఆడిటోరియంలో నగరంలోని అంగన్వాడీ టీచర్లు, కార్యకర్తలకు ఐటిసి బంగారు భవిష్యత్ వారు వ్యర్ధాల నిర్వహణపై అవగాహన శిబిరం అనంతరం చేపట్టిన స్వచ్చత హి సేవా మానవహారంలో నగర కమిషనర్ …

Read More »

వ్యర్ధాల నిర్వహణ అత్యంత ప్రాధాన్యతతో చేపట్టాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : వ్యర్ధాల నిర్వహణ అత్యంత ప్రాధాన్యతతో చేపట్టాలని, నాయుడుపేట డంపింగ్ యార్డ్ లోని లెగసి వ్యర్ధాలను మార్చి 31, 2025 నాటికి పూర్తి స్థాయిలో క్లియర్ చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ ఇంజినీరింగి అధికారులు, ఏజన్సీ ప్రతినిధులకు స్పష్టం చేశారు. మంగళవారం కమిషనర్ నాయుడుపేటలోని లెగసి వేస్ట్ ట్రీట్మెంట్ ప్లాంట్ ను అధికారులతో కలిసి పరిశీలించి తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ తొలుత యార్డ్ లోని ప్రస్తుతం ఉన్న వ్యర్ధాలు, …

Read More »

పింఛన్ పంపిణీని అడ్డం పెట్టుకుని ప్రాణాలు తీసిన వ్యక్తి జగన్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : గత ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నామని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ అన్నారు. కూటమి ప్రభుత్వానికి సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లని పేర్కొన్నారు. బాపట్ల జిల్లాలోని జే పంగలూరులో మంగళవారం మంత్రి గొట్టిపాటి రవి కుమార్ పర్యటించారు. స్థానికంగా ఉన్న వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు మంత్రి పింఛన్లు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి మాట్లాడారు… పింఛన్ల పంపిణీలో ఏపీ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోందని అన్నారు. ప్రతీ నెల సరిగ్గా ఒకటో …

Read More »

హెచ్ పి ఎఫ్ ఎస్ ప్రాజెక్ట్ ద్వారా మద్యం షాపులకు దరఖాస్తులు

-ఎక్సైజ్, ప్రొహిబిషన్ శాఖ సంచాలకులు నిషాంత్ కుమార్ -3,396 మద్యం దుకాణాలకు లైసెన్సుల జారీకి కసరత్తు ప్రారంభం -తిరుపతిలో పరిమితంగానే షాపుల ఏర్పాటుకు అవకాశం -ప్రీమియం స్టోర్ లపై త్వరలో నిబంధనావళి విడుదల -అక్టోబరు 12 నుంచి 2026 సెప్టెంబరు 30 వరకు నూతన మధ్యం విధానం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వ మద్యం షాపుల విధానానికి స్వస్తి పలుకుతూ రాష్ట్రంలో నూతన మద్యం పాలసీకి నోటిఫికేషన్ను జారీ చేసామని ఎక్సైజ్, ప్రొహిబిషన్ శాఖ సంచాలకులు నిషాంత్ కుమార్ తెలిపారు. రిజర్వేషన్ …

Read More »

దసరా ఉత్సవాలకు పటిష్ట ఏర్పాట్లు

-భక్తుల కోసం ప్రత్యేక వసతులు -శాసనసభ్యులు సుజన చౌదరి విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : అక్టోబర్ 3 నుండి 12 వ తేది వరకు ఇంద్రకీలాద్రిపై నిర్వహించనున్న దసరా ఉత్సవాలపై పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ (సుజన చౌదరి) మంగళవారం మోడల్ గెస్ట్ హౌస్ లో సమీక్ష నిర్వహించారు. దేవాదాయ ధర్మాదాయ శాఖామంత్రి ఆనం రామనారాయణరెడ్డి, హోం శాఖామంత్రి వంగలపూడి అనిత, విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావు, …

Read More »

ఈ నెల 30లోగా ఏపీ జీఎన్ఏ ఎన్నిక‌ల ప్ర‌క్రియ పూర్తికి చ‌ర్య‌లు

-అత్యంత పార‌ద‌ర్శ‌కంగా ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌ -ఏపీ జీఎన్ఏ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ అధికారి ఎస్‌.శ్రీనివాస‌రెడ్డి విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వ న‌ర్సుల అసోసియేష‌న్ (ఏపీ జీఎన్ఏ) ఎన్నిక‌ల మొత్తం ప్ర‌క్రియ‌ను ఈ నెల 30వ తేదీలోగా పూర్తిచేసేందుకు చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు ఏపీ జీఎన్ఏ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ అధికారి ఎస్‌.శ్రీనివాస‌రెడ్డి మంగ‌ళ‌వారం ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. ఎన్‌టీఆర్ జిల్లా కోఆప‌రేటివ్ అధికారిగా విధులు నిర్వ‌ర్తిస్తున్న త‌న‌ను ఏపీ జీఎన్ఏ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ అధికారిగా నియ‌మిస్తూ రాష్ట్ర స‌హ‌కార‌, స‌హ‌కార సంఘాల రిజిస్ట్రార్ క‌మిష‌న‌ర్ …

Read More »

హోం, రక్షణ శాఖ ల పార్టమెంటరీ కమిటీల్లో సభ్యునిగా విజయవాడ ఎంపీ

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : పార్టమెంటరీ స్థాయీ సంఘాలను పునర్ వ్యవస్థీకరిస్తూ 24 కొత్త కమిటీలను ఏర్పాటు చేసినట్లు లోక్ సభ సెక్రటరీ జనరల్ తెలిపారు. ఈ వివరాలను లోక్ సభ సెక్రటరీ జనరల్ ఇటీవల పి.సి. మోడీ విడుదల చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వివిధ కమిటీల్లో తెలుగు రాష్టాల నుండి స్థానం దక్కించుకున్నారు. అందులో ముఖ్యంగా విజయవాడ లోక్ సభ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ (చిన్ని) హోం శాఖ, రక్షణ శాఖ కమిటీల్లో సభ్యులుగా ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని గెజిట్ …

Read More »

ఎన్యుమరేషన్ చేయటం, వరద సాయం అందించటంలో ప్రభుత్వం ఘోర వైఫల్యం: మల్లాది విష్ణు

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : వరద బాధితులకు పరిహారం విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు దారుణమని సెంట్రల్ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మండిపడ్డారు. ఈ మేరకు ఆంధ్రప్రభ కాలనీలోని జనహిత సదనంలో మంగళవారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. వరద బాధితులను ఈ ప్రభుత్వం నిండా ముంచిందని.. ముఖ్యంగా సర్వే వివరాలు పొంతన లేనివిధంగా ఉన్నాయని మండిపడ్డారు. 97 శాతం మందికి నగదు బదిలీ చేసినట్లు ప్రభుత్వం చెబుతున్నా.. గ్రౌండ్ రిపోర్ట్ పూర్తి విరుద్ధంగా ఉందన్నారు. ఎన్యుమరేషన్లో …

Read More »

ఎంపి కేశినేని శివ‌నాథ్ ను మ‌ర్యాద పూర్వ‌కంగా క‌లిసిన ఒంగోలు ఎంపి మాగుంట‌

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఒంగోలు ఎంపి మాగుంట శ్రీనివాసులురెడ్డి మంగ‌ళ‌వారం గురునాన‌క్ కాల‌నీలోని విజ‌య‌వాడ పార్ల‌మెంట్ కార్యాల‌యం ఎన్టీఆర్ భ‌వ‌న్ లో విజ‌య‌వాడ ఎంపి కేశినేని శివ‌నాథ్ ను మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. ఎంపి మాగుంట తో పాటు విచ్చేసిన‌ ఆయ‌న త‌న‌యుడు రాఘవరెడ్డి కూడా ఎంపి కేశినేని శివ‌నాథ్ క‌ల‌వ‌టం జ‌రిగింది. ఎంపి మాగుంట కు ఎంపి కేశినేని శివనాథ్ సాద‌ర స్వాగ‌తం ప‌లికారు. అనంత‌రం వీరు రాష్ట్రానికి కేంద్రం నుంచి తీసుకురావాల్సిన నిధుల గురించి, రాష్ట్రంలో అభివృద్ది నిరోధ‌క శ‌క్తుల్ని …

Read More »

అమ్మ‌వారి ద‌ర్శ‌న విష‌యంలో సామాన్య భక్తులకే ప్రాధాన్య‌త ఇవ్వాలి : ఎంపి కేశినేని శివ‌నాథ్

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : దసరా శరన్నవరాత్రి మహోత్సవ పర్వదినములలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు, ఆటంకాలు జరగకుండా, అమ్మ‌వారి ద‌ర్శ‌నం అంద‌రికీ అందేలా చూడాల‌ని, సామాన్య భ‌క్తుల‌కే అధిక ప్రాధాన్య‌త ఇవ్వాల‌ని విజ‌య‌వాడ ఎంపి కేశినేని శివ‌నాథ్ అధికారులకు సూచించడం జరిగింది. ఇంద్రకీలాద్రి పై కొలువు దీరిన శ్రీ కనకదుర్గ అమ్మవారి శరన్నవరాత్రి మహోత్సవ ఏర్పాట్ల పై దుర్గా ఘాట్ లోని మోడల్ గెస్ట్ హౌస్ నందు కమాండ్ కంట్రోల్ రూమ్ లో మంగ‌ళ‌వారం స‌మీక్ష స‌మావేశం జ‌రిగింది. ఈ స‌మీక్ష స‌మావేశంలో …

Read More »