Breaking News

Daily Archives: April 27, 2026

రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమే ఇంధన కొరతకు కారణం : ఎంపీ గురుమూర్తి

-రాష్ట్రంలో కృత్రిమ ఇంధన కొరతపై తిరుపతి ఆగ్రహం తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొనసాగుతున్న పెట్రోల్, డీజిల్ కొరత పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమేనని తిరుపతి ఎంపీ డా.మద్దిల గురుమూర్తి విమర్శించారు. ఈ నేపథ్యంలో పట్టణంలోని పలు పెట్రోల్ బంకులను ఎంపీ స్వయంగా తనిఖీ చేసి పరిస్థితిని సమీక్షించారు. బంకుల వద్ద వాహనదారులు కిలోమీటర్ల మేర క్యూలైన్లలో నిలబడాల్సిన పరిస్థితి నెలకొనడం పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా ఎక్కడా ఇంధన కొరత లేదని కేంద్ర పెట్రోలియం శాఖ స్పష్టం …

Read More »

సుజనా చౌదరి కార్యాలయంలో ఎల్వోసీ అందచేత…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : 48వ డివిజన్ కు చెందిన పల్లె సుధా లక్ష్మీ గర్భాశయ వ్యాధి తో బాధ పడుతోంది. మెరుగైన వైద్యం కోసం 1,80,000/- రూపాయలు ఖర్చు అవుతుందని వైద్యులు తెలిపారు. ఆర్థిక స్తోమత లేక పోవడంతో ఆమె ఎమ్మెల్యే సుజనా చౌదరి కార్యాలయాన్ని సంప్రదించింది. ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆమెకు ఆర్థిక సాయం కోసం సీఎం రిలీఫ్ ఫండ్ కు లేఖ రాసారు. దీనికి సంబంధించిన ఎల్వోసీ నీ సోమవారం ఎమ్మెల్యే కార్యాలయంలో రోగి బంధువులకు అంద చేశారు. …

Read More »

ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్టు అనుబంధ ప్రైవేటు ఆసుపత్రులకు బకాయిల చెల్లింపులు ప్రారంభం

-“బిల్ డిస్కౌంటింగ్ అగ్రిమెంట్” విధానంలో రూ. వెయ్యి కోట్లు జమ చేసేలా ప్రభుత్వ నిర్ణయం -ప్రత్యేక పోర్టల్ ద్వారా ఇప్పటివరకు 323 ఆసుపత్రుల యాజమాన్యాల దరఖాస్తులు -ఒప్పందాలకు అనుగుణంగా 25 అస్పత్రులకు రూ. 62 కోట్లు చెల్లిoపు -మంత్రి సత్యకుమార్ యాదవ్ కి నివేదిoచిన అధికారులు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్టు అనుబంధ ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలకు రూ.1,000 కోట్ల బకాయిలను ‘ట్రై-పార్టీ బిల్ డిస్కౌంటింగ్. అగ్రిమెంట్’ (టీబీడీఏ) విధానంలో చెల్లింపుల ప్రక్రియను కూటమి ప్రభుత్వం ప్రారంభించింది. …

Read More »

వినియోగదారుల సేవలో ‘పైలెట్ పెట్రోల్  బంక్’

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గత రెండు రోజుల నుండి ప్రజలు పెట్రోల్ మరియు డీజిల్ సరఫరా విషయంలో ఇబ్బందులు పడుతున్న విషయం విధితమే. అటువంటి సమయంలో బందరురోడ్డులోని ఇండియన్ ఆయిల్ డీలర్స్ ‘పైలెట్ సర్వీస్ స్టేషన్’ (పైలెట్ పెట్రోల్ బంక్) కరోనా సమయం నుండి ఇప్పటి పెట్రోల్ మరియు డీజిల్ సరఫరా విషయం వరకు సేవలు అందించడంలో ఎప్పుడూ ముందుంది అని ‘మేనేజర్ వెంకటప్పయ్య’ తెలిపారు. ఇండియన్ ఆయిల్ కంపెనీ ఇంధనాన్ని నిరంతరం అందించేలా చర్యలు తీసుకుంటూ, ప్రభుత్వ యంత్రాంగం, పోలీసుశాఖ …

Read More »

జూన్ నెలలో చలో సెక్రటేరియట్ కి పిలుపునిచ్చిన ఫ్యాప్టో

-మూడు రోజుల నిరాహార దీక్షలు విజయవంతం!! విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఫ్యాప్టో 3వ రోజు నిరాహార దీక్ష శిబిరం నుంచి ఫ్యాప్టో రాష్ట్ర కమిటీ జూన్ నెలలో చలో సెక్రటేరియట్ కార్యక్రమానికి పిలుపునిచ్చినదని ఫ్యాప్టో చైర్మన్ ఎల్ సాయి శ్రీనివాస్, సెక్రటరీ జనరల్ ఎస్ చిరంజీవి నిరాహార దీక్ష శిబిరం నుండి ప్రకటన చేశారు. ఈరోజు 03వ రోజు నిరాహారదీక్షను ఫ్యాప్టో పూర్వపు సీనియర్ నాయకులు పి. కృష్ణయ్య ప్రారంభించారు.మరో ఫ్యాప్టో సీనియర్ నాయకులు సిహెచ్. జోసఫ్ సుధీర్ బాబు సాయంత్రం …

Read More »

స్వచ్చ నగరంగా తీర్చిదిద్దుకోవడానికి అధికారులు సమన్వయంతో కృషి చేయాలి …

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరాన్ని స్వచ్చ నగరంగా తీర్చిదిద్దుకోవడానికి నగర పాలక సంస్థ అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో కృషి చేయాలని నగర కమిషనర్ కే. మయూర్ అశోక్ తెలిపారు. సోమవారం కమిషనర్ ఛాంబర్ నందు ప్రజారోగ్య, ఇంజనీరింగ్ అధికారులతో స్వచ్చ సర్వేక్షన్ పై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమీషనర్ మాట్లాడుతూ, రాష్ట్రంలో ఇప్పటికే స్వచ్చ సర్వేక్షన్ బృందాలు కొన్ని నగరాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నాయని, గుంటూరు నగరంలో కూడా త్వరలోనే తనిఖీల నిమిత్తం పర్యటిస్తారని తెలిపారు. అందు …

Read More »

రాయితీతో పన్ను చెల్లింపుకు విశేష స్పందన.. 3 రోజులే గడువు… : కమిషనర్ మయూర్ అశోక్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రస్తుత ఆర్ధిక సంవత్సరానికి (2026-27) సంబందించిన ఆస్తి పన్నును ముందస్తుగా చెల్లించి పన్నుపై 5 శాతం, బకాయిలపై 50 శాతం వడ్డీ రాయితీ పొందేందుకు 3 రోజులే గడువు ఉందని, నగర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ కె.మయూర్ అశోక్ తెలిపారు. సోమవారం లలితా సూపర్ స్పెషాలిటి హాస్పిటల్ 7 అసెస్మెంట్లకు సంబంధించి జనరల్ మేనేజర్ సురేష్ అడ్వాన్స్ ట్యాక్స్ గా రూ.86 లక్షల చెక్ ని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ కి నగరపాలక సంస్థ …

Read More »

పిచ్చి మొక్కలను వెంటనే తొలగించి శుభ్రం చేసుకోవాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగర ప్రజల ఆరోగ్యం మరియు పారిశుద్ధ్యాన్ని దృష్టిలో ఉంచుకుని నగర పాలక సంస్థ పరిధిలోని ఖాళీ స్థలాల యజమానులు తమ స్థలాల్లో పెరిగిన పిచ్చి మొక్కలను వెంటనే తొలగించి శుభ్రం చేసుకోవాలని, ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో నీరు నిల్వ ఉండకుండా మట్టితో పూడ్పించుకోవాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఒకవేళ ఈ ఆదేశాలను పాటించని పక్షంలో, నగర పాలక సంస్థ చట్టంలోని 496, 504, 639, 640 మరియు 641 …

Read More »

ప్రజల నుండి అందే అర్జీలను నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల నుండి అందే అర్జీలను నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలని గుంటూరు నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ (ఇంచార్జి) జి.సాంబశివరావు విభాగాదిపతులకు తెలిపారు. సోమవారం నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ ఆదేశాల మేరకు జిఎంసి కౌన్సిల్ సమావేశ మందిరంలో నిర్వహించిన ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ కార్యక్రమంలో అదనపు కమిషనర్ (ఇంచార్జి) పాల్గొని ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా అదనపు కమిషనర్ (ఇంచార్జి) మాట్లాడుతూ, పిజిఆర్ఎస్ కు అందే ఫిర్యాదుల్లో ఎక్కువగా పారిశుధ్యం, డ్రైనేజీ సమస్యలు, …

Read More »

యుద్ధప్రాతిపదికన ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద గ్రీన్ మ్యాట్స్, చలివేంద్రాల ఏర్పాటు… : నగర కమిషనర్ మయూర్ అశోక్

-వేసవి తాపం నుండి నగర ప్రజలకు ఊరట  గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలో వేసవి ఎండ నుండి ప్రజలకు ఉపశమనం కల్గించేలా జిఎంసి ప్రత్యేక చర్యలు తీసుకుంటుందన్నారు. ఎండ తీవ్రత దృష్ట్యా వాహనదారులు, పాదచారులు వడదెబ్బ బారిన పడకుండా ఉండేందుకు ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర గ్రీన్ మ్యాట్ల ఏర్పాటు, ప్రధాన రోడ్ల పై నీటిని స్ప్రే చేయడం, అలాగే చల్లని నీటితో చలివేంద్రాలు ఏర్పాటుకు చర్యలు తీసుకున్నామని సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, ట్రాఫిక్ సిగ్నల్స్ …

Read More »