Breaking News

Monthly Archives: May 2026

ప్రశాంతంగా ముగిసిన నీట్‌-2026 ప‌రీక్ష‌

– 98.69 శాతం హాజ‌రు న‌మోదు – ప‌రీక్షా కేంద్రాన్ని త‌నిఖీ చేసిన క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ ఇబ్ర‌హీంప‌ట్నం, నేటి పత్రిక ప్రజావార్త : నేష‌న‌ల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ద్వారా నిర్వ‌హించిన జాతీయస్థాయి వైద్య విద్య ప్రవేశ పరీక్ష నీట్ (యూజీ)-2026 ఆదివారం ఎన్‌టీఆర్ జిల్లాలో ప్ర‌శాంతంగా ముగిసింది. జిల్లాలో 32 కేంద్రాల్లో ప‌రీక్ష నిర్వ‌హించ‌గా మొత్తం 11,496 మంది అభ్య‌ర్థుల‌కుగాను 11,345 మంది (98.69 శాతం) హాజ‌రైన‌ట్లు క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ తెలిపారు. క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ ప‌రీక్ష ప్ర‌క్రియ‌ను నిరంత‌రం ప‌ర్య‌వేక్షించడంతోపాటు …

Read More »

వ‌డివ‌డిగా జ‌ల‌ధార.. ఒడిసిప‌ట్టు జీవ‌ధార‌

– జిల్లాలో ముమ్మ‌రంగా సాగుతున్న ప‌నులు – మంజూరైన 197 ప‌నుల్లో 88 ప‌నులు ప్రారంభం – త్వ‌ర‌లో మ‌రికొన్ని ప‌నులకు శ్రీకారం – క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ నిరంత‌ర ప‌ర్య‌వేక్ష‌ణ‌లో కార్య‌క్ర‌మం అమ‌లు – శాస్త్రీయ దృక్ప‌థంతో ప‌దేళ్ల డేటా ఆధారంగా కార్యాచ‌ర‌ణ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నీటి భద్రత ల‌క్ష్యంగా రాష్ట్ర ప్ర‌భుత్వం అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా ప్రారంభించిన జ‌ల‌ధార‌-జ‌ల‌హార‌తి కార్య‌క్ర‌మం కింద ఎన్‌టీఆర్ జిల్లాలో ప‌నులు వ‌డివ‌డిగా ముందుకెళ్తున్నాయి. నీటి వనరుల సంరక్షణ, భూగర్భ జలాల పెంపు లక్ష్యంగా ముఖ్య‌మంత్రి …

Read More »

నేడు (మే 4) పీజీఆర్ఎస్ యథావిధిగా

-జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో ఫిర్యాదుల స్వీకరణ -కలెక్టర్ కీర్తి చేకూరి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : నేడు (మే 4) పీజీఆర్ఎస్ కార్యక్రమం యథావిధిగా నిర్వహించనున్నట్లు కలెక్టర్ కీర్తి చేకూరి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. స్థానిక కలెక్టరేట్‌లో పీజీఆర్ఎస్ (ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక) సోమవారం సాధారణంగా కొనసాగుతుందని ఆమె పేర్కొన్నారు. తూర్పు గోదావరి జిల్లా ప్రజా ప్రతినిధులతో అమరావతి లో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మే 4న నిర్వహించే సమావేశానికి హాజరు కానున్న నేపథ్యంలో, జిల్లా జాయింట్ …

Read More »

శ్రియో కనెక్ట్’ యాప్‌ను ఆవిష్కరించిన మంత్రి కందుల దుర్గేష్

-టెక్నాలజీతో సామాన్యుడికి సేవలందించడం అభినందనీయమని యాప్ నిర్వాహకులను కొనియాడిన మంత్రి దుర్గేష్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాజమహేంద్రవరం: ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రజల అవసరాలకు అనుగుణంగా మలచుకోవడంలో యువత ముందుండాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పిలుపునిచ్చారు. ఆదివారం రాజమహేంద్రవరంలోని తన నివాసంలో స్థానిక అవసరాలే లక్ష్యంగా రూపొందించిన ‘శ్రియో కనెక్ట్’ (Srieyo Connect) యాప్‌ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా యాప్ నిర్వాహకులు యాప్ పనితీరును, దాని వల్ల కలిగే ప్రయోజనాలను మంత్రికి వివరించారు. …

Read More »

రైతుకు వెన్నుదన్నుగా ఉంటాం:మంత్రి కందుల దుర్గేష్

-కష్టాల్లో ఉన్న రైతులకు అండగా కాన్వాయ్ ఆపి ధైర్యాన్నిచ్చిన మంత్రి దుర్గేష్…కానూరు వద్ద ధాన్యం రాశుల పరిశీలన -ఆకస్మిక వర్షాలకు దెబ్బతిన్న ధాన్యాన్ని మంత్రి దుర్గేష్ కు చూపించిన రైతాంగం.. చివరి గింజ వరకు ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని రైతులకు భరోసానిచ్చిన మంత్రి దుర్గేష్ -ఆధునిక సాగు వైపు అడుగులు వేయాలని రైతులకు మంత్రి దుర్గేష్ పిలుపు నిడదవోలు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల కష్టమే తన కష్టంగా భావించే రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ …

Read More »

నీట్ పరీక్షలు ప్రశాంతంగా నిర్వహణ – 3242 మంది హాజరు

-కలెక్టర్ కీర్తి చేకూరి రాజమహేంద్రవరం / రాజానగరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు గోదావరి జిల్లా పరిధిలో నీట్ (NEET) పరీక్షలను ప్రశాంతంగా నిర్వహించడం జరిగిందని జిల్లా కలెక్టర్ కలెక్టర్ కీర్తి చేకూరి ఆదివారం ఒక ప్రకటనలో తెలియజేశారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 3341 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, 3242 మంది పరీక్షలకు హాజరయ్యారు. 99 మంది గైర్హాజరయ్యారు. జిల్లాలోని వివిధ పరీక్షా కేంద్రాలలో అభ్యర్థులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తూ పరీక్షలను సజావుగా నిర్వహించారు. పరీక్షా కేంద్రాల వారీగా వివరాలు: దరఖాస్తు …

Read More »

మే 4 డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా జిల్లా పర్యటన – సమీక్ష, ప్రజలతో సమావేశాలు

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా ఆదివారం సాయంత్రం మధురపూడి విమానాశ్రయానికి చేరుకోగా, ఆయనకు రాజమహేంద్రవరం ఇంచార్జి రెవెన్యూ డివిజనల్ అధికారి కె. ఆనందరావు , జిల్లా బిసి సంక్షేమ అధికారి బి శశాంక తదితరులు స్వాగతం పలికారు. అనంతరం ఆయన స్థానికంగా ఏర్పాటు చేసిన ప్రైవేట్ అతిథి గృహం (మంజీరా)కు చేరుకుని రాత్రి బస చేశారు. సోమవారం మే 4 వ తేదీ ఉదయం 10 గంటల నుండి …

Read More »

“నాడు సమస్యలు – నేడు పరిష్కారాలుయువ నాయకుడు బొండా సిద్ధార్థ పర్యటన

-నిర్లక్ష్యానికి ముగింపు – అభివృద్ధికి నాంది, గత ప్రభుత్వంలో నిర్లక్ష్యం ఎదుర్కొన్న కాలనీకి కొత్త రూపు ₹50 లక్షలతో మౌలిక సదుపాయాల కల్పన రోడ్లు, డ్రైనేజీ, లైటింగ్, తాగునీటి సౌకర్యాలు ఏర్పాటు -ప్రజల అభిప్రాయం – అభివృద్ధికి ప్రశంసలు ప్రజల కోసం నిరంతరం సేవలో బొండా కుటుంబం అందుకే “బొండా ఉమ కాలనీ”గా నామకరణం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సెంట్రల్ నియోజకవర్గంలోని 28వ డివిజన్‌లో ఆదివారం గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో అభివృద్ధికి నోచుకోక, కనీస మౌలిక సదుపాయాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న పూనూరు …

Read More »

శ్రీశ్రీశ్రీ దుర్గా మల్లికార్జున స్వామి వారి దేవస్థానంలో ధ్వజస్తంభ ప్రతిష్టాపన

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కండ్రికలోని శ్రీశ్రీశ్రీ దుర్గా మల్లికార్జున స్వామి వారి దేవస్థానంలో ఆదివారం నిర్వహించిన ధ్వజస్తంభ ప్రతిష్టాపన కార్యక్రమంలో ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొబ్బరికాయ కొట్టి కార్యక్రమానికి శ్రీకారం చుట్టి, నవధాన్యాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా బొండా ఉమా మాట్లాడుతూ:- ఆలయాలు ఆధ్యాత్మిక కేంద్రాలుగా మాత్రమే కాకుండా సమాజంలో సానుకూల శక్తిని పెంపొందించే కేంద్రాలుగా నిలుస్తాయని అన్నారు. ఇలాంటి పవిత్ర కార్యక్రమాలు ప్రజల్లో భక్తి భావాన్ని పెంపొందించడమే కాకుండా …

Read More »

ఈ నెల 4వ తేదీ సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక – మీకోసం నిర్వహిస్తాం..

-జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ మచిలీపట్నం,  నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 4వ తేదీ సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఉదయం 10:30 గంటల నుండి మీకోసం –ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టం) కార్యక్రమం నిర్వహించి ప్రజల నుండి అర్జీలు స్వీకరించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలకు పాలనను మరింత చేరువ చేయడానికి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను మండల, మున్సిపల్ స్థాయిలకు ప్రభుత్వం వికేంద్రీకరించినట్లు కలెక్టర్ …

Read More »