Breaking News

బెజవాడ కనకదుర్గమ్మకు తెలంగాణ బంగారు బోనం… : మంత్రి వెలంప‌ల్లి శ్రీ‌నివాస‌రావు


విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆషాడ మాసం బోనాల జాతర ఉత్సవాలను పురస్కరించుకుని భాగ్యనగర్ శ్రీ మహాంకాళి జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటి ఆధ్వర్యంలో బెజవాడ కనకదుర్గమ్మకు బంగారు బోనం అత్యంత వైభవంగా కన్నుల పండువగా జ‌రిగాయి అని దేవ‌దాయ శాఖ మంత్రి వెలంప‌ల్లి శ్రీ‌నివాస‌రావు పేర్కొన్నారు. ఆషాడ మాసం బోనాల జాతర ఉత్సవాలను ఆంధ్రప్రదేశ్ లో కూడా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంద‌న్నారు. ఉత్సవాల్లో భాగంగా బోనాలను సమర్పణ తో పాటు నిర్వాహకులు, భక్తులు, కళాకారులు, పోతు రాజుల విన్యాసాలతో విజయవాడ బ్రహ్మణ వీధి నుంచి కళాకారుల నృత్యాలతో దేవాలయానికి సామూహిక ఊరేగింపు బ‌య‌లు దేరి, అమ్మ వారి పట్టు వస్త్రాలు సమర్పించడం జ‌రిగింద‌న్నారు. కార్య‌క్ర‌మంలో బోనాల ఉత్సవ కమిటి దేవాలయం ఈవో,ఆలయ కమిటి చైర్మన్ లతో పాటు అధికారులు ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

గత ప్రభుత్వం హయాంలో అసంపూర్తిగా పిహెచ్ సిల నిర్మాణాలు

-ఆర్భాటంగా నాడు-నేడు కార్యక్రమాన్ని చేపట్టారే తప్ప ప్రయోజనం శూన్యం -కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించనందున నిలిచిపోయిన పిహెచ్సిల నిర్మాణాలు -గిరిజన ప్రాంతాల్లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *