Breaking News

జాతీయ నాణ్యతా అస్సూరెన్స్ ప్రమాణాలతో పలు ఆసుపత్రుల అభివృద్ధి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జాతీయ క్వాలిటీ అస్సూరెన్స్ (యన్ క్యూఏ) ప్రమాణాలు మేరకు ఆసుపత్రుల అభివృద్ధి పనులు ఉండాలని జాయింట్ కలెక్టరు (అభివృద్ధి) యల్. శివశంకర్ చెప్పారు. స్థానిక జెసి క్యాంపు కార్యాలయంలో శుక్రవారం జిల్లాలో అభివృద్ధి పరుస్తున్న ఆసుపత్రుల పనుల పురోగతిపై సంబంధి తాధికారులతో జెసి శివశంకర్ సమీక్షించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 92 ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల అభివృద్ధిలో భాగంగా 10 పిహెచ్ సిలకు క్రొత్త భవనాల నిర్మాణాలు జరుగుతున్నాయని వాటి ప్రగతితీరునుఆయన సమీక్షించారు. మరో 80 పిహెచ్ సిల ఆధునికీకరణ పనులను కూడా త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. రెండు పిహెచ్ సిలకు సంబంధించి భూమి సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. అదేవిధంగా గుడివాడ, నూజివీడు ఏరియా ఆసుపత్రులకు క్రొత్త భవనాల నిర్మాణ పనులు, 13 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లకు క్రొత్త భవనాల పనులు ప్రారంభం, తదితర అంశాలపై ఆయన సమీక్షించారు. అంతేకాకుండా జిల్లాకు మణిహారంగా నిలిచే మచిలీపట్నం వైద్యకళాశాల నిర్మాణపనులు పురోగతిపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. సమావేశంలో ఆర్ అండ్ బి యస్లీ వెంకటేశ్వర్లు, ఏయంయడిసి ఇఇ ప్రవీణ్ రాజ్, డిసిహెచ్ యస్ డా. జ్యోతిర్మణి, జిల్లా ఆరోగ్య నాణ్యతా ప్రమాణాల అధికారి డా. చైతన్యకృష్ణ, గుడివాడ, మచిలీపట్నం, విజయవాడ, నూజివీడుల డిప్యూటి డియం హెచ్ఓలు డా. వంశీ, డా. శర్మిష్ఠ, డా. జె. ఉషారాణి, డా. ఆశాలత, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *