Breaking News

తెలుగు సాహిత్యంలో చెరగని ముద్ర వేసిన మొల్ల

-రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
తెలుగు సాహిత్యంలో కవయిత్రి ఆతుకూరి మొల్లమాంబ(మొల్ల) చెరగని ముద్ర వేశారని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత కొనియాడారు. తెలుగు సాహిత్యంలో ఆమె రచనలకు ప్రత్యేకమైన స్థానం ఉందన్నారు. గురువారం మొల్ల జయంతి సందర్బంగా రాష్ట్ర సచివాలయంలో ఆమె చిత్రపటానికి మంత్రి పూల మాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ, సామాన్య కుమ్మరి కుటుంబంలో జన్మించిన మొల్లమాంబ శ్రీరాముడిని అచంచలమైన భక్తి ప్రపత్తులతో కొలిచారన్నారు. వాల్మీకి రామాయణాన్ని తెలుగులోకి అనువదించించిన మహానీయురాలు మొల్ల అని కొనియాడారు. తెలుగు వాడుక భాషలోకి ఆమె రచించిన రామాయణం మొల్ల రామాయణంగా ప్రఖ్యాతగాంచిందన్నారు. మొల్ల తన రచనలలో నైతిక విలువలకు ప్రాధాన్యమిచ్చేవారన్నారు. తెనాలి రామలింగడ వంటి దిగ్గజ కవులకు మొల్ల సమకాలీనరాలు అని చరిత్ర చెబుతోంది. కడపలోని గోపవరం గ్రామంలో జన్మించిన మొల్ల నేటి తరం మహిళాలకు, కవయిత్రిలకు ఆదర్శమని కొనియాడారు. ఆమె రచనలను భావితరాలకు అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందని మంత్రి సవిత స్పష్టంచేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖాధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

దేవరపల్లి మండలం దేవరపల్లి గ్రామానికీ చెందిన తంగెళ్ళ సాంబశివరావు మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెనుకబడిన తరగతుల కేటగిరి కింద గృహ నిర్మాణం చేపట్టడం కోసం రూ.50 వేలు ఆర్ధిక సహాయం మొత్తాన్ని ప్రకటించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : దేవరపల్లి మండలం దేవరపల్లి గ్రామానికీ చెందిన తంగెళ్ళ సాంబశివరావు మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *