9న “స్పందన” : క‌మిష‌న‌ర్‌ ప్రసన్న వెంకటేష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగర ప్రజల సమస్యల పరిష్కార వేదికగా సోమవారం న‌గ‌ర పాల‌క సంస్థ ప్ర‌ధాన కార్యాల‌యం మరియు సర్కిల్ కార్యాలయములలో “స్పందన” కార్యక్రమము జరుగుతుందని నగర కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఐ.ఏ.ఎస్ ప్రకటన ద్వారా తెలిపారు. నగరపాలక సంస్థకు సంబంధించి ప్రజలకు మౌలిక స‌దుపాయ‌ల క‌ల్ప‌న‌లో ఇబ్బందులు, సమస్యలను పరిష్కరించుకొనుటకు ది.09.08.2021 సోమవారం ఉదయం 10.30 ని.ల నుంచి మద్యాహ్నం 1.00 గంట వరకు న‌గ‌ర పాల‌క సంస్థ‌ ప్ర‌ధాన కార్యాలయంలో మేయ‌ర్‌, క‌మిష‌న‌ర్ మరియు మూడు సర్కిల్ కార్యాలయములలో జోనల్ కమిషనర్ల అధ్యక్షతన “స్పందన ” కార్యక్రమం నిర్వ‌హించ‌బ‌డుతుంద‌న్నారు. నగర ప్రజలు వారు ఎదుర్కొంటున్న సమస్యల ఆర్జీలను తమ యొక్క అధార్ గుర్తింపు నకలు జతపరచి నేరుగా ప్ర‌ధాన కార్యాల‌యంలో మేయ‌ర్, క‌మిష‌న‌ర్ గార్లకు, లేదా సర్కిల్ కార్యాలయాల్లో జోనల్ కమీషనర్లకు ప్రజలు వారి సమస్యలను వివ‌రించ‌డం ద్వారా స‌మ‌స్య ప‌రిష్కారించ‌డం జ‌రుగుతుంద‌న్నారు. ఈ అవకాశమును ప్రజలందరూ సద్వినియోగపరచుకొనవలసినదిగా కోరారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మస్టర్ పాయింట్లను ఆకస్మిక తనిఖీ

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : వార్డ్ సచివాలయ శానిటేషన్ కార్యదర్శులు మస్టర్ సమయంలో తప్పనిసరిగా ప్రజారోగ్య కార్మికుల హాజరు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *