Breaking News

తూర్పు గోదావరి జిల్లా కలెక్టరేట్ లో “వికాస” ఆధ్వర్యంలో నిర్వహించిన మినీ జాబ్ మేళా లో ఎంపిక అయిన విద్యార్థులకు ఆఫర్ లెటర్స్ ను జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి శనివారం అందచేశారు.

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
తూర్పు గోదావరి జిల్లా కలెక్టరేట్ లో “వికాస” ఆధ్వర్యంలో నిర్వహించిన మినీ జాబ్ మేళా లో ఎంపిక అయిన విద్యార్థులకు ఆఫర్ లెటర్స్ ను జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి శనివారం అందచేశారు. కలెక్టర్ విద్యార్థులను ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ జాబ్ మేళాలో 150 మంది విద్యార్థులు పాల్గొన్నారు, అందులో 107 మంది ఎంపికయ్యారని వికాస ప్రాజెక్ట్ డైరెక్టర్ కే. లచ్చారావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. 10 కంపెనీల ప్రతినిధులు ఇంటర్వ్యూలు నిర్వహించినట్లు తెలిపారు. ఎంపికైన విద్యార్థులు ఆఫర్ లెటర్స్ ను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో వికాస సిబ్బంది మరియు ఇతర అధికారులు కూడా పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *