Breaking News

ఎస్.ఎస్.సి స్పాట్ కేంద్రాలలో ట్యాబ్ ఆధారిత మూల్యాంకనాన్ని రద్దు చేయాలి- ఎస్.టి.యు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఎస్.ఎస్.సి స్పాట్ వాల్యుయేషన్ నందు ఈ సంవత్సరం ప్రవేశపెట్టిన ట్యాబ్ ఆధారిత మూల్యాంకన విధానంలో ఉపాధ్యాయులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆ సమస్యలను పరిష్కరించాలని రాష్ట్రోపాధ్యాయ సంఘం ఆం.ప్ర. రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మల్లు రఘునాథరెడ్డి, లంకలపల్లి సాయి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ట్యాబ్ ఆధారిత మూల్యాంకనంలో అనేక సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయని, దీనివలన మూల్యాంకన ప్రక్రియ ఆలస్యమై ఉపాధ్యాయులు రాత్రి 9, 10 గంటల వరకు స్పాట్ కేంద్రంలో గడపవలసి వస్తుందని తెలిపారు. నాణ్యమైన ట్యాబ్ లను అందించి, వేగవంతమైన నెట్వర్క్ సదుపాయం కల్పించినప్పుడే ట్యాబ్ ఆధారిత మూల్యాంకనం విజయవంతమవుతుందని తెలిపారు. కనుక ఈ సంవత్సరం ట్యాబ్ ఆధారిత మూల్యాంకనం రద్దు చేయాలని లేదా పైలెట్ ప్రాజెక్టుగా ఒకటి రెండు సబ్జెక్టులకు మాత్రమే పరిమితం చేయాలని, స్పెషల్ అసిస్టెంట్ల పని భారం తగ్గించి వారికి చెల్లించే రెమ్యూనరేషన్ పెంచాలని, స్పెషల్ అసిస్టెంట్లను అదనంగా నియమించి ట్యాబ్ ఆధారిత మార్కుల నమోదుకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసి మూల్యాంకన కేంద్రాలలోని సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఆర్టీజీఎస్ సీసీటీవీ360… న‌మ్మికైన నేస్తం

-ప్ర‌జ‌ల భ‌ద్ర‌త‌కు భ‌రోసా ఇస్తున్న స‌ర్వైలెన్సు వ్య‌వస్థ‌ -రోజుల వ్య‌వ‌ధిలోనే ముగ్గురు బాల‌ల ఆచూకీ క‌నుగొన్న సీసీకెమెరాలు -య‌ల‌మంచిలిలో ఇద్ద‌రు, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *