తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము వారి ఉత్తర్వ్యులు G.O.Ms.No.7 Finance Budget-11. Department తేదీ 11.01.2023 ప్రకారం ప్రతి ప్రభుత్వ ఉద్యోగి మరియు పెన్షనర్ విధిగా తమ తమ CFMS. ID లను వారి యొక్క ఆధార్ కు లింక్ చేసిన మొబైల్ నెంబర్లకు అనుసంధానము చేయవలసి యున్నది. CFMS ID మరియు HERB PAY ROLL కు సంబంధించిన సేవలను పొందాలంటే ఈ అనుసంధానము అత్యవసరము. తదనుగుణంగా ఉద్యోగుల యొక్క CFMS ID లను ఆధార్ కు లింక్ చేసిన మొబైల్ నెంబర్లకు అనుసంధానము చేయుట జరిగింది. కానీ పెన్షనర్ల CFMS.ID ల అనుసంధానము ఇంకా పూర్తి చేయవలసి యున్నదనీ, ఈ ప్రక్రియ మొత్తము ఈ మే నెల 10వ తేదీలోగా పూర్తి చేయాలని జిల్లా ఖజానా మరియు లెక్కల శాఖ అధికారి లక్ష్మీ కర రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. కావున పెన్షనర్ల సౌలభ్యం కొరకు వారి e-KYC పూర్తి చేయుటకు గాను సంబంధిత ఉప ఖజానా కార్యాలయ సిబ్బంది తిరుపతి మరియు ఇతర ఉప-ఖజానా అధికారులు ఉప-ఖజానా కార్యాలయ పరిధిలో అందుబాటులో వుంటారనీ, తద్వారా ఆయా ఉప ఖజానా పరిధిలోని పెన్షనర్లు ఉప ఖజానా కార్యాలయ సిబ్బందిని సంప్రదించి e-KYC పూర్తి చేయించుకోవలసినదిగా కోరడమైనది. పెన్షనర్లు వారి వెంట ఆధార్ కార్డు మరియు ఆధార్ అనుసంధానిత చరవాణి తెచ్చుకోవలసినదిగా వారు ఆ ప్రకటనలో తెలిపారు.
Prajavartha Online Telugu News