కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త :
కొవ్వూరు నియోజకవర్గం కొవ్వూరు టౌన్ పరిధిలో కొవ్వూరు టోల్గేట్ వద్ద శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని, ప్రకృతి రావణబ్రహ్మ శివలింగాన్ని రాష్ట్ర హోమ్ మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత సందర్శించారు. ఈ కార్యక్రమంలో హోంమంత్రి తానేటి వనిత తో పాటు ఎమ్మెల్యే తలారి వెంకట్రావు పాల్గొన్నారు. ఇరు దేవాలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఆలయానికి విచ్చేసిన హోంమంత్రికి ముందుగా అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో గోపాలపురం, కొవ్వూరు నియోజకవర్గ స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News