విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జనసేన పార్టీ విజయవాడ నగర అధ్యక్షులుగా నియమితులైన సందర్భంగా పోతిన వెంకట మహేష్ కి వంద మందికిపైగా నగరాల యువత వచ్చి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ 2024 లో పోతిన వెంకట మహేష్ ని ఎమ్మెల్యేగా చేయడమే మా లక్ష్యంగా పని చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కొర్ర గంజి రమణ, పోతిన వెంకటేష్, మరి పిళ్ళ రాజు, దుక్క సాంబ, మురళి, పిళ్ళ వంశీ, తమ్మిన రఘు, గుడెల దుర్గారావు, పోతిన అదిత్, జగదీష్, నాగోతి సాయి తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News