Breaking News

పౌరోహిత్యాన్ని కుల వృత్తిగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలి… 

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు ని ఆంధ్రప్రభ కాలనీలోని ఆయన కార్యాలయంలో ఏపీ పురోహిత బ్రాహ్మణ సమాఖ్య సభ్యులు కలిసారు. పౌరోహిత్యాన్ని కుల వృత్తిగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలని, తమ సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లాలని ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ కి వినతిపత్రం అందజేసారు. కులవృత్తిగా గుర్తించడం ద్వారా తమకు భద్రత, భరోసా లభిస్తుందని, అన్ని సంక్షేమ పథకాలకి అర్హులు అవుతామని సమాఖ్య సభ్యులు విన్నవించారు. సానుకూలంగా స్పందించిన చైర్మన్ ముఖ్యమంత్రి  దృష్టికి తీసుకువెళ్లి ప్రభుత్వం తరపున పూర్తి సహాయ సహకారం అందిస్తామని చెప్పటంతో ఏపీ పురోహిత బ్రాహ్మణ సమాఖ్య సభ్యులు హర్షం వ్యక్తం చేసారు. ఎమ్మెల్యే ని కలిసిన వారిలో యామజాల నరసింహమూర్తి, విధ్యాదర శాస్త్రి, సునీల్ శర్మ తదితరులున్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *