Tag Archives: rajamandri

రోగసీ సేవలు అందిస్తున్న ఆసుపత్రిని క్షేత్ర స్థాయిలో పరిశీలన

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర వైద్య మరియు ఆరోగ్య శాఖ ఆదేశాల మేరకు, జిల్లా వైద్య మరియు ఆరోగ్య అధికారి డా. కె. వెంకటేశ్వరరావు జూలై 29న రాజమహేంద్రవరం నగరంలోని ART మరియు సరోగసీ సేవలు అందిస్తున్న ఆసుపత్రిని క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ART (Assisted Reproductive Technology), ఐవీఎఫ్ (In Vitro Fertilization) కేంద్రాల్లో నిబంధనలకు అనుగుణంగా సేవలు అందుతున్నాయా అన్న విషయంపై సమగ్ర తనిఖీ ఆయన నిర్వహించారు. తనిఖీ సందర్భంగా కేంద్రంలోని మౌలిక సదుపాయాలు, అర్హత …

Read More »

అన్నదాత సుఖీభవ సమస్యల పరిష్కారం కోసం 0883- 2944455 గ్రివియన్స్ సెల్

-సంక్షేమ వసతి గృహ దోమల నివారణ కోసం మండల ప్రజా పరిషత్, పంచాయతీ నిధులు ఖర్చు చేయాలి -కలెక్టర్ పి ప్రశాంతి -అన్నదాత సుఖీభవ ఫిర్యాదుల పరిష్కారం కోసం మండల, డివిజన్, జిల్లా స్థాయిలలో గ్రీవెన్స్ సెల్‌లు ఏర్పాటు: జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : మంగళవారం బొమ్మూరు కలెక్టరేట్ వీడియో దృశ్య మాధ్యమ సమావేశ మందిరం లో అన్నదాత సుఖీభవ, తదితర అంశాలపై జిల్లా , డివిజన్ మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గృహ …

Read More »

తల్లిదండ్రుల సంరక్షణపై ట్రైబ్యునల్ తీర్పును పిల్లలు అప్పీల్ చేయలేరు

-వృద్ధులను నిర్లక్ష్యం చేసిన వారికి మూడు నెలల జైలు, రూ.5000 జరిమానా -డిఆర్ఓ టి.సీతారామ మూర్తి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తల్లిదండ్రుల సంరక్షణ విషయమై ట్రైబ్యునల్ ఇచ్చిన తీర్పుపై పిల్లలు కలెక్టర్‌కు అప్పీల్ చేయలేరని జిల్లా రెవిన్యూ అధికారి సీతారామమూర్తి తెలిపారు. వృద్ధుల పోషణ & సంక్షేమ చట్టం – 2007పై జిల్లా అధికారులకు అవగాహన కల్పించేందుకు రాజమహేంద్రవరం కలెక్టరేట్‌లోని పి.జి.ఆర్.ఎస్ మందిరంలో నిర్వహించిన ఒరియంటేషన్ కార్యక్రమానికి సీతారామ మూర్తి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా డిఆర్ఓ మాట్లాడుతూ – ట్రైబ్యునల్ తీర్పు …

Read More »

స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు సమన్వయంతో ఏర్పాట్లు చేయాలి… 

-జాయింట్ కలెక్టర్ చిన్న రాముడు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆగస్టు 15న జరగనున్న 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు సంబంధిత శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో కృషి చేయాలని జాయింట్ కలెక్టర్ ఎస్. చిన్న రాముడు ఆదేశించారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో నిర్వహించిన సమన్వయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, వేడుకలను ఎప్పటిలాగే రాజమహేంద్రవరం ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్‌లో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు సూచనలు చేస్తూ, …

Read More »

రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గానికి చెందిన 33 మంది లబ్ధిదారులకు ₹41.66 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

రాజమహేంద్రవరం , నేటి పత్రిక ప్రజావార్త : రాజమహేంద్రవరం రూరల్ శాసన సభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి వారి చేతుల మీదుగా ఆదివారం ఆయన నివాసంలో ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ద్వారా మంజూరైన చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ, “ఆపదలో ఉన్న వారికి అండగా నిలిచే ప్రభుత్వ విధానాలకు ప్రతిఫలంగా ముఖ్యమంత్రి సహాయ నిధి రూపంలో ప్రభుత్వం బాధిత కుటుంబాలకు ఊరట కలిగిస్తోందన్నారు. ఈరోజు చెక్కుల పంపిణీ కార్యక్రమంలో భాగంగా 33 మంది …

Read More »

అర్జీలు meekosam.ap.gov.in  పోర్టల్ లేదా 1100 టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా కూడా నమోదుకి అవకాశం

-పిజిఆర్ఎస్ పరిష్కార స్థాయి కోసం “1100” -9552300009  వాట్సాప్ గవర్నెన్స్ నెంబర్ పౌర సేవలు -జూలై 28 సోమవారం యధావిధిగా పిజిఆర్ఎస్ -జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా సమస్యలు పరిష్కార  కోసం  జిల్లా, డివిజన్ మండల స్థాయిలో నిర్వహిస్తున్న పీజీఆర్ఎస్ జూలై 28 వ తేదీ సోమవారం యధావిధిగా నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి ఆదివారం ఒక ప్రకటనలో తెలియచేసారు. ప్రజలు తమ అర్జీలను ఇవ్వడం కోసం ఇంటి వద్దనే”1100″ మీ-కోసం కాల్ సెంటర్” …

Read More »

వాతావరణ శాఖ హెచ్చరికలు – అధిక వర్షాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి – కలెక్టర్ పి. ప్రశాంతి

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : వాతావరణ శాఖ హెచ్చరికల మేరకు తూర్పు గోదావరి జిల్లాలో జూలై 24 నుండి జూలై 28 వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందనీ తెలియ చేయడం జరిగిందనీ జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి గురువారం ఒక ప్రకటనలో తెలియచేసారు. ప్రత్యేకంగా జూలై 24, 25 తేదీల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లాలోని లోతట్టు ప్రాంతాలు, పాత భవనాలు, నదీ తీర ప్రాంతాల వద్ద నివసించే …

Read More »

ఐ టి ఐ లో స్పాట్ అడ్మిషన్లు

– ప్రిన్సిపాల్ సి.హెచ్. సునీల్ కుమార్ ధవళేశ్వరం, నేటి పత్రిక ప్రజావార్త : 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించి తూర్పు గోదావరి జిల్లా ప్రభుత్వ ఐ.టి.ఐ., ధవళేశ్వరం లో ప్రవేశం కొరకు నమోదు చేసుకుని, పరిశీలన పూర్తి అయిన అభ్యర్థులు జూలై 23 న నిర్వహించిన కౌన్సెలింగ్‌కు హాజరుకాకపోయిన అభ్యర్థులు మరియు హాజరైనప్పటికీ సీట్లు పొందలేకపోయిన అభ్యర్థులు కోసం జూలై 25 వ తేది శుక్రవారం స్పాట్ అడ్మిషన్లను చేపట్టనున్నట్లు ప్రిన్సిపాల్ సి.హెచ్. సునీల్ కుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలియచేసారు. కావున ఈ …

Read More »

సమాచార హక్కు చట్టంపై సహకార శాఖ ఉద్యోగులకి అవగాహన కార్యక్రమం

-ఎమ్ వెంకట రమణ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : సహకార సంస్థలు ప్రజలకు అత్యంత దగ్గరగా పనిచేసే శక్తివంతమైన సంస్థలని, సమాచారం హక్కు చట్టం (2005) అమలులో సహకార శాఖ ఉద్యోగులు కీలకంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని తూర్పు గోదావరి జిల్లా సహకార అధికారి ఎం. వెంకటరమణ తెలిపారు. బుధవారం ఆర్యాపురం అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ సమావేశ మందిరంలో జిల్లా సహకార శాఖ ఆధ్వర్యంలో సమాచార హక్కు చట్టం 2005 పై జిల్లా స్థాయి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న …

Read More »

తూర్పు గోదావరి జిల్లాలో MSMEల బలోపేతానికి ర్యాంప్ (RAMP) పథకం

-ఉద్యోగావకాశాలు – స్థానిక పరిశ్రమల అభివృద్ధికి కార్యాచరణ -జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు గోదావరి జిల్లాలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (MSMEs) అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం, ప్రపంచ బ్యాంకు మద్దతుతో అమలు చేస్తున్న RAMP (Raising and Accelerating MSME Performance) పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన వార్షిక లక్ష్యాల మేరకు కార్యాచరణ అమలు చేయనున్నట్లు జిల్లా కలెక్టర్  పి. ప్రశాంతి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పథకం …

Read More »