Breaking News

Tag Archives: rajamandri

‘ఉల్లాస్ – అక్షర ఆంధ్ర’ వయోజన అక్షరాస్యతా కార్యక్రమంపై ఒకరోజు శిక్షణా కార్యక్రమం

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : మంగళ వారం జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి ఆదేశాల మేరకు తూర్పు గోదావరి జిల్లా కలెక్టరేట్, రాజమహేంద్రవరం పీజీఆర్‌ఎస్ సమావేశ మందిరంలో ఒకరోజు శిక్షణా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కార్యక్రమాన్ని జిల్లా రెవెన్యూ అధికారి సీతారామమూర్తి, డీఆర్‌డీఏ పీడీ మూర్తి, డ్వామా పీడీ నాగమహేశ్వరరావు, మెప్మా పీడీ వెంకటరామణ, సీపీవో ఎల్ . అప్పలకొండ, వయోజన విద్య డీడీ పి. పొసయ్య, వయోజన విద్య నోడ్‌ల్ అధికారి అనిసెట్టి వెంకటరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారులు …

Read More »

నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ త్వరితగతిన పనులు పూర్తిచేయాలి

-జిల్లా కలెక్టర్, కమిషనర్(F.A.C) పి.ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలో చేపట్టిన వివిధ ఇంజనీరింగ్ పనులు విధిగా నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ సత్వరమే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్, కమిషనర్(F.A.C) పి.ప్రశాంతి అధికారులను ఆదేశించారు. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో చేపట్టిన పలు రహదారులు, డ్రెయిన్ల నిర్మాణ పనులను ఇంజనీరింగ్ అధికారులతో కలిసి మంగళవారం పరిశీలించారు. శ్రామిక భవన్, ఆర్టీవో ఆఫీస్ వద్ద సీసీ డ్రెయిన్, కంటిపూడి రామారావు స్కూల్ సీసీ రోడ్డు, NRCP రోడ్డు జంక్షన్ వద్ద సీసీ డ్రెయిన్, పూలే …

Read More »

రాజానగరంలో ‘నక్షయ మిత్రా’ కిట్ల పంపిణీ – అవగాహన కార్యక్రమం

రాజానగరం, నేటి పత్రిక ప్రజావార్త : మంగళవారంరాజానగరంలో నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా టి.బి బాధితులకు ‘నక్షయ మిత్రా’ కిట్లను పంపిణీ చేశారు. ఈ కిట్లలో పౌష్టికాహారం, అవసరమైన ఔషధాలు, రోజువారీ వినియోగ వస్తువులు ఉండగా, రోగులు త్వరగా కోలుకోవడానికి మద్దతు అందించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యం. ఈ సందర్భంగా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు మాట్లాడుతూ, టి.బి నిర్మూలనలో సామాజిక భాగస్వామ్యం కీలకమని, ‘నక్షయ మిత్రా’గా నమోదు అయి ఆర్థిక సహాయం అందించడంలో చైతన్యం కలిగించే కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. పోషకాహారం, సమయానికి చికిత్స, …

Read More »

రాజానగరంలో BPHU శంఖుస్థాపన

-ఆరోగ్య మంత్రి సత్య కుమార్ యాదవ్ రాజానగరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆర్ & బి శాఖ ద్వారా 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.50 లక్షలతో రాజానగరంలో నిర్మించనున్న నూతన BPHU (బ్లాక్ పబ్లిక్ హెల్త్ యూనిట్) భవనానికి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం & వైద్య విద్య శాఖ మంత్రివర్యులు సత్య కుమార్ యాదవ్  శంఖుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణ రెడ్డి, రుడా చైర్మన్ బొడ్డు …

Read More »

ప్రజల ఆరోగ్యం మా ధ్యేయం… నగర శుభ్రత మనందరి బాధ్యత

– ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్‌ – 39వ డివిజన్‌లో ఆకస్మిక పర్యటన రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల ఆరోగ్యం తమ ధ్యేయమని, అలాగే నగర శుభ్రత మనందరి మాధ్యత అని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్‌ (వాసు) అన్నారు. మంగళవారం ఉదయం ఆయన 39వ డివిజన్‌లో రాజమండ్రి పార్లమెంట్ డాక్టర్స్ సెల్ అధ్యక్షులు యాళ్ల ప్రదీప్, జనసేన పార్టీ రాజమండ్రి సిటీ అధ్యక్షులు వై శ్రీను తదితరులతో కలిసి ఆకస్మికంగా పర్యటించారు. సదరు డివిజన్‌లో శానిటేషన్‌ ఏ విధంగా చేస్తున్నారో …

Read More »

నులిపురుగుల నివారణకు రాష్ట్రంలోని కోటి 13 లక్షల మంది విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు అందజేత

-సర్వైకల్ క్యాన్సర్ నివారించడానికి బాలికలకు ఉచితంగా హెచ్ పి వి వ్యాక్సిన్లు -నులిపురుగుల నివారణ దినం సందర్భంగా  వడిసలేరు గ్రామంలో  విద్యార్థులకు ఔషధాల అందజేత -రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జాతీయ నులిపురుగుల నివారణ దినం సందర్భంగా మంగళవారం రంగంపేట మండలం వడిసెలేరు లోని జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రల ను రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి …

Read More »

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ని మర్యాదపూర్వకంగా కలిసిన సోము వీర్రాజు

అమరావతి/ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ని అమరావతిలో మర్యాదపూర్వకంగా కలిసి, తూర్పు గోదావరి జిల్లాలో చేపట్టాల్సిన పలు అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించడం జరిగిందనీ శాసన మండలి సభ్యులు సోము వీర్రాజు ఒక ప్రకటనలో తెలియచేసారు. ఈ సందర్భంగా తూర్పు గోదావరి జిల్లాలో నీటి పారుదల సదుపాయాల మెరుగుదల, జాతీయ రహదారుల విస్తరణ, పర్యాటక రంగ అభివృద్ధి , గృహ నిర్మాణం , పోలవరం ప్రాజెక్టు పరిసర ప్రాంతాల అభివృద్ధి, అలాగే గండి పోచమ్మ తల్లి …

Read More »

మాజీ సైనికుడి నుంచి లంచం – రెవెన్యూ అధికారిపై కలెక్టర్ కఠిన చర్యలు

-రూ.14 లక్షల అవినీతి – డిప్యూటీ తహశీల్దార్ సస్పెన్షన్ -అనధికార భూ రికార్డుల మార్పులు – ఇద్దరు VRAలపై క్రమశిక్షణా చర్యలు -కలెక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : మాజీ సైనిక ఉద్యోగి నుండి లేని భూమి ఉన్నట్లు చూపించి రూ.14 లక్షలు లంచం వసూలు చేసిన ఘటనపై తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ & జిల్లా మేజిస్ట్రేట్ శ్రీమతి పి. ప్రశాంతి కఠిన చర్యలు చేపట్టినట్లు మంగళవారం ఒక ప్రకటనలో తెలియచేసారు. గోపాలపురం మండలం ఎలక్షన్ డి టి …

Read More »

ర్యాగింగ్ కు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు

-జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత -సమష్టి కృషితో వర్సిటీ విలువలు కాపాడదాం -వీసీ ఆచార్య ఎస్ ప్రసన్నశ్రీ -నన్నయ వర్సిటీలో యాంటీ ర్యాగింగ్ వీక్ రాజానగరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆనందంగా జీవితాన్ని గడపాలని, ఇతరులను ఇబ్బందికి గురిచేయాలని, బాధపెట్టాలనే మానసిక రుగ్మతే ర్యాంగింగ్ అని, ర్యాగింగ్ కు పాల్పడితే చర్యలు తప్పవని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత అన్నారు. మంగళవారం ఆదికవి నన్నయ యూనివర్సిటీ ఎన్టీఆర్ కన్వెన్షన్ సెంటర్ లో యాంటీ ర్యాగింగ్ వీక్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ …

Read More »

ఆగస్టు 11 సోమవారం – పీజీఆర్ఎస్ కార్యక్రమం యథాతధంగా

-1100 కాల్ సెంటర్ ద్వారా ఫిర్యాదుల పరిష్కార వేదిక -9552300009 వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా సేవలు అందుబాటులో -కలెక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రతి నెలా నిర్వహించే పీజీఆర్ఎస్ (ప్రజా సమస్యల పరిష్కార) కార్యక్రమం ఈ నెల ఆగస్టు 11వ తేదీ సోమవారం యథావిధిగా నిర్వహించబడుతుందని తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ శ్రీమతి పి. ప్రశాంతి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా స్థాయిలో జరుగుతున్న పీజీఆర్ఎస్‌లో ప్రజలు తమ అర్జీలను డివిజన్, మండల …

Read More »