Breaking News

Monthly Archives: September 2024

వరద బాధితులకు ఆపన్నహస్తం అందించిన పశ్చిమగోదావరి జిల్లా

-కలెక్టర్ చదలవాడ నాగరాణి చొరవతో కదిలిన వ్యధాన్యులు -1,98,960 ఆహార పొట్లాలు, 70 వేల వాటర్ ప్యాకెట్లు, 1.15 లక్షల బిస్కెట్ ప్యాకెట్లు భీమవరం, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ ప్రాంతవాసులు అకాల వరదలలో చిక్కుకోవడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయిడు ఆదేశాల మేరకు పశ్చిమగోదావరి జిల్లా నుండి వారికి పెద్ద ఎత్తున ఆపన్న హస్తం అందింది. జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి చొరవతో దాతలు తమదైన శైలిలో ముందడుగు వేసారు. కలెక్టర్ కోరిందే తడవుగా పలువురు ముందుకు వచ్చి తమ వ్యధాన్యతను చాటుకున్నారు. …

Read More »

4 నుంచి నగరంలో ‘వసంతం 2024’

-క్రాఫ్ట్ కౌన్సిల్ ఆఫ్ ఏపీ చైర్ పర్సన్ ఎస్ రంజన విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : క్రాప్ట్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో ఈ నెల 4,5 తేదీలలో నగరంలోని శేష సాయి కళ్యాణ వేదికలో వసంతం 2024 నిర్వహించనున్నట్లు క్రాఫ్ట్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ చైర్ పర్సన్ ఎస్ రంజన, సంయుక్త కార్యదర్శి బి సుజాత తెలిపారు.ఈ సందర్భంగా మంగళవారం నగరంలోని శేష సాయి కళ్యాణ వేదికలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మీరు మాట్లాడుతూ రెండు రోజులపాటు నిర్వహించే …

Read More »

ఇస్కాన్ ఫుడ్ ఫర్ లైఫ్ ద్వారా అన్నదానం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గత మూడు రోజులుగా కురుస్తున్న తీవ్రభారీ వర్షాల కారణంగా విజయవాడ అస్తవ్యస్తం అయింది. విజయవాడ పరిస్థితి అతి విషమంగా ఉంది. ఇస్కాన్ ఫుడ్ ఫర్ లైఫ్ ద్వారా కొన్ని వేల మందికి అన్నదానం చేస్తున్నాము. కబేళా సితార ప్రాంతాలలో వరద బాధితులకు ప్రసాద వితరణ చేశారు. మరియు రామలింగేశ్వర నగర్, కృష్ణలంక చిట్టినగర్ మిల్క్ ప్రాజెక్ట్ ఏరియా ప్రాంతాలలో ప్రసాద వితరణ చేయడం జరిగింది. రామలింగేశ్వలనగర్, కృష్ణలంక పరిసర ప్రాంతాల వాళ్ళు నీటి మునగడంతో జగన్నాథ మందిరంలోకి …

Read More »

బిజెపి రాష్ట్ర కార్యాలయం కేంద్రం గా ఆహార పంపిణీ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : బిజెపి రాష్ట్ర కార్యాలయం కేంద్రం గా విజయవాడ ముంపు ప్రాంతాలకు ఆహార పంపిణీ నిర్వహించారు. రాజరాజేశ్వరీ నగర్, వైఎస్ ఆర్ కాలనీ కి వాటర్ బాటిల్స్, బిస్కెట్ ప్యాకెట్ లు, ఆహారం ఈరోజు అందించారు. మైనారటీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు షేక్ బాజీ, కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు చిగురు పాటి కుమార స్వామి ఆహార పంపిణీ నిర్వహించారు, కలిదిండి మండలం కొండంగి గ్రామస్తులు ఆరువేల వాటర్ బాటిల్స్ బిజెపి కార్యాలయానికి అందించారు. కిసాన్ మోర్చా రాష్ట్ర …

Read More »

రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార  కార్యక్రమం తాత్కాలిక వాయిదా

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : Dr. సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి సందర్భంగా రాష్ట్రస్థాయి లో నిర్వహిస్తున్న రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ దినోత్సవం 05-09-2024 C K Convention, మంగళగిరి లో చేయుటకు ఏర్పాట్లు చేయడం జరిగింది. కానీ వాతావరణం అనుకూలించని కారణంగా,ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు, మంత్రులు, రాష్ట్ర మరియు జిల్లా స్థాయి అధికారులందరూ వివిధ జిల్లాల్లో వచ్చిన వరద బాధితుల సహాయ కార్యక్రమాలలో పాల్గొనడం మరియు పురస్కార గ్రహీతల రవాణా ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర స్థాయిలో నిర్వహించాల్సిన ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల ప్రదానోత్సవం …

Read More »

వరద బాధితుల సహాయంలో ఎన్టీఆర్ జిల్లా ఎన్ఎస్ఎస్ వాలంటీర్ల సేవలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్టీఆర్ జిల్లాకు చెందిన ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు సుమారు 500 మంది వివిధ ప్రాంతాలలో అజిత్ సింగ్ నగర్, రాజరాజేశ్వరి కాలనీ, కృష్ణలంక ప్రాంతాలలో ఆహారం, నీరు, పాలు మొదలగు సేవలను గత రెండు రోజుల నుంచి అందిస్తున్నట్లు ఎన్టీఆర్ జిల్లా ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ కొల్లేటి రమేష్ తెలిపారు. ఎన్టీఆర్ జిల్లాలోని ఎస్ఆర్ఆర్ అండ్ సివిఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, సిద్ధార్థ కళాశాల, నలంద కళాశాల, కేబీఎన్ కళాశాల, ఫార్మసీ కళాశాల మేరీ స్టెల్లా కళాశాల కు …

Read More »

రాష్ట్రంలో అందుబాటులో ఉన్న ఇసుక 14,76,958 మెట్రిక్ టన్నులు

-రాష్ట్ర గనులు, అబ్కారీ శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు, వరదల నేపధ్యంలో ఇసుక సరఫరాలో నెలకొంటున్న స్వల్ప అంతరాయాన్ని త్వరలోనే అధికమిస్తామని వాణిజ్య పన్నుల శాఖ ఛీప్ కమీషనర్, గనులు, అబ్కారీ శాఖ ముఖ్య కార్యదర్శి, ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. వివిధ రీచ్ ల నుండి సరఫరా నిలిచిపోయిందని, వర్షాలు తగ్గుముఖం పట్టి, రవాణా పరిస్ధితులు మెరుగైన తురువాత పూర్తి స్ధాయిలో ఇసుక సరఫరా కొనసాగుతుందన్నారు. బుధవారం …

Read More »

వరద ప్రభావిత ప్రాంతాల్లో నీరు తగ్గిన తర్వాత చేపట్టాల్సిన చర్యలపై సమావేశం నిర్వహించిన మున్సిపల్ మినిస్టర్

-నగరంలో పారిశుధ్య నిర్వహణ కోసం ఇతర మున్సిపాలిటీల నుంచి అధికారులను రప్పించిన మంత్రి నారాయణ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో గల నూతన భవనంలో మంగళవారం సాయంత్రం మున్సిపల్ శాఖ మినిస్టర్ పొంగూరు నారాయణ, మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్, స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ఎండీ గంధం చంద్రుడు,మున్సిపల్ శాఖ డైరెక్టర్ హరి నారాయణన్, టీడ్కో ఎండీ సాయి కాంత్ వర్మ, వీఎంసి కమిషనర్ ధ్యాన చంద్ర, సమక్షంలో వివిధ …

Read More »

భోజనం ప్యాకెట్లను ప్రతి ఒక్కరికి అందేలా చూసుకోవాలి

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధనచంద్ర మంగళవారం కండ్రిక జంక్షన్, అజిత్ సింగ్ నగర్ ప్రాంతాలు పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అక్కడ ఉన్న ప్రజలకు బోట్ సహాయం అందుతుందా లేదా, భోజనం బోట్ల ద్వారా కానీ, ట్రాక్టర్ ద్వారా కానీ ప్రజలందరికీ అందుతున్నాయా లేదా వార్డ్ సెక్రటరీలు అప్రమత్తంగా ఉన్నారా లేదా, ప్రజలకు ఇంకేమైనా అవసరం ఉందా అన్న అంశంపై క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఫ్లై ఓవర్ పైన పంపిణీ చేశాక …

Read More »

నిజాయితితో కులగణన అమలు చేసి బీసీలకు న్యాయం చెయ్యాలి

-ఎన్నికలే అజెండాగా కులగణనపై ఆరెస్సెస్ ప్రకటన : రిటైర్డ్ డీజీపీ, ఏపీ కోఆర్డినేటర్ డా పూర్ణచంద్ర రావు -BSP రాష్ట్ర అధ్యక్షులు బి పరంజ్యోతి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఉన్నట్టుండి కులగణనకు మేము సముఖంగా ఉన్నాము అని ఆరెస్సెస్ చెప్పటం విడ్డూరమైన విషయం, ఇది కేవలం రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇచ్చిన ప్రకటనలా ఉంది, అని రిటైర్డ్ DGP, బీఎస్పీ ఏపీ కోఆర్డినేటర్ డా పూర్ణచంద్ర రావు అభిప్రాయపడ్డారు. “ఇవాళ ఆరెస్సెస్ ఈ ప్రకటన ఎందుకు చేసింది. వచ్చే రెండు …

Read More »