Breaking News

Monthly Archives: September 2024

అజిత్ సింగ్ నగర్ పోస్ట్ ఆఫీసును త్వరితగతంగా పునరుద్ధరించి అందు సేవలను తక్షణమే అందుబాటులోకి తేవాలి

-ఎన్.ఎస్.యు.ఐ. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేముల శ్రీనివాస్ డిమాండ్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా ఎన్టీఆర్ జిల్లా లోని బుడమేరు ముంపు ప్రాంతాలలో అకాలంగా వరద ముంపు సంభవించి ముంపు ప్రాంతంలోని చాలా పోస్ట్ ఆఫీస్ కార్యాలయాలు పూర్తిగా ధ్వంసం అయ్యాయని.. ముఖ్యంగా లక్షల మంది ఉన్న విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని అజిత్ సింగ్ నగర్ పోస్ట్ ఆఫీస్ కార్యాలయంలోకి వరద నీరు బురదచేరి సదరు కార్యాలయంలోని ఆఫీస్ ఫర్నిచర్ పరికరాలు ఎక్కువ మొత్తంలో పూర్తిగా …

Read More »

26న జనసేనలో చేరనున్న వైసీపీ మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యేలు, నాయకులు

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : జనసేన పార్టీలో చేరేందుకు వైసీపీ మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు సన్నద్ధమయ్యారు. ప్రకాశం జిల్లాకు చెందిన సీనియర్ వైసీపీ నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి, పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలారి రోశయ్య, జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను జనసేనలో చేరనున్నారు. ఈ నెల 26వ తేదీన మంగళగిరిలో నిర్వహించే కార్యక్రమంలో వీరు జనసేనలో చేరుతారు. ఇప్పటికే వీరు ముగ్గురూ వేర్వేరుగా పవన్ కల్యాణ్ తో సమావేశమయ్యారు. పార్టీలో చేరికపై చర్చించారు. అదే …

Read More »

సుజన చౌదరి ఔదార్యం కార్యకర్త కుటుంబానికి ఆర్థిక సాయం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పశ్చిమ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ (సుజన చౌదరి) ఆదేశాలతో 48వ డివిజన్ పరిధిలో అనారోగ్యంతో మరణించిన పోలవరపు నూకరాజు వయసు 66 సం కుటుంబానికి ఆర్థిక సాయం అందించారు. ఎమ్మెల్యే కార్యాలయ సిబ్బంది కూటమి నాయకులతో కలిసి శనివారం వారి కుటుంబాన్ని పరామర్శించారు. రిక్షవాలా అయినటువంటి పోలవరపు నూకరాజు కుటుంబానికి ఆర్థిక సాయం అందజేయాలని భారతీయ జనతా పార్టీ డివిజన్ అధ్యక్షులు దేవిన హరిప్రసాద్ సుజనా దృష్టికి తీసుకెళ్లగా తక్షణమే మట్టి ఖర్చుల నిమిత్తం ఆర్థిక సాయం …

Read More »

స్వచ్చత హి సేవా లో భాగంగా స్వచ్చ నగరంగా మార్చుకోవడానికి ఈ నెల 17 నుండి అక్టోబర్ 2 వరకు వివిధ కార్యక్రమాలు

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలో వాయు కాలుష్య, ట్రాఫిక్ నియంత్రణ, రోడ్లు, డ్రైన్లపై ఆక్రమణల తొలగింపుకు జిఎంసితో పాటుగా ట్రాఫిక్ పోలీస్, డిటిసి, విద్యుత్, కాలుష్య నియంత్రణ మండలి, ఆర్టీసి, ఆర్ & బి శాఖల సమన్వయంతో సంయుక్త కార్యాచరణ ప్రణాళిక సిద్దం చేస్తామని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ తెలిపారు. శనివారం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ సమావేశ మందిరంలో నగర కమిషనర్ అధ్యక్షతన వివిధ శాఖల అధికారులతో ప్రత్యేక సంయుక్త సమావేశం జరిగింది. ఈ …

Read More »

వాహనాలను రిపేర్లు చేసి బాధితులకు అంద‌జేసే పక్రియ వేగవంతం చేస్తున్నాం

-ఇన్సూరెన్స్ క్లెయిమ్ ద్వారా 1730.19 లక్షలు అందజేసాం- రవాణాశాఖ -విజయవాడ; వరద ముంపుకు గురైన మోటార్ వాహనాలను రిపేర్లు చేసి త్వ‌ర‌గా బాధితులకు అంద‌జేసే విధంగా రవాణాశాఖ చర్యలు తీసుకుంటుంది విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడలోని ఆర్టీసీ బస్టాండ్‌లో ఉన్న రవాణా కమిషనర్ కార్యాలయం నుండి ఒక పత్రిక ప్రకటనను విడుదల చేసింది. వరద ముంపుకు గురైన వాహనాలకు సంబంధించి ఇన్సూరెన్స్ క్లెయిమ్‌లను త్వరగా పొందేందుకు రవాణాశాఖ పర్యవేక్షిస్తోంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఇన్సూరెన్స్ కంపెనీలతో సమావేశాలు …

Read More »

యధావిధిగా సెప్టెంబరు 23 సోమవారం “పీజీఆర్ఎస్ ‘మీ కోసం”

-జిల్లా కలెక్టర్ ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతి సోమవారం నిర్వహించే ప్రజల నుంచి అర్జీలను స్వీకరించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక పీజీఆర్ఎస్ సెప్టెంబరు 23 వ తేదీన చేపట్టనున్నట్లు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి శనివారం ఒక ప్రకటనలో శుభాకాంక్షలు తెలియ చేశారు. సెప్టెంబరు 23 సోమవారం పి జి ఆర్ ఎస్ – మీ కోసం ద్వారా ప్రజల నుంచి అర్జీలను జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో, రెవెన్యు డివిజనల్ , మునిసిపల్, మండల స్థాయిలో “మీ కోసం” …

Read More »

సమర్థవంతమైన నాయకత్వంతో రాష్ట్రం అభివృద్ధి వైపు పరుగులు తీస్తుంది…

-సాటిలైట్ సిటీ గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న గోరంట్ల… -పిడింగొయ్యి గ్రామంలో స్వచ్ఛత హి సేవా కార్యక్రమం లో పాల్గొన్న ఎమ్మెల్యే, అధికారులు, స్థానిక యువత , గ్రామస్తులు రాజమహేంద్రవరం రూరల్, నేటి పత్రిక ప్రజావార్త : శనివారం ఉదయం సాటిలైట్ సిటీ సి.బ్లాక్ కళ్యాణ మండపం నందు ఏర్పాటుచేసిన “ఇది మంచి ప్రభుత్వం” అనే కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి హాజరయ్యారు. ఆ సందర్భంగా శాసన సభ్యులు గోరంట్ల బుచ్చయ్య శాస్ర్తీ మాట్లాడుతూ కూటమి …

Read More »

ఇచ్చిన హామీలను ప్రాధాన్యత క్రమంలో  లబ్ధిదారులకు వాటి ప్రయోజనాలను అందజేశాం.

-ధైర్యంగా నేడు వారి ఇంటి ముందుకే వెళుతున్నాం. -ప్రభుత్వ ఏర్పడిన మొదటి 100 రోజుల్లోనే లబ్ధిదారులకు హామీలను అమలు చేసింది -రాబోయే దీపావళి నుంచి ఉచిత సిలిండర్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టనున్నాం. -సిటీ శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు మేరకు ప్రభుత్వం ఏర్పడిన అనతి కాలంలోనే ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ప్రజల ముందుకు వస్తున్న ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వమని సిటీ శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు పేర్కొన్నారు. శనివారం స్థానిక 45,46,47,48 డివిజన్లకు సంబంధించి …

Read More »

తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణ అధికారి శ్యామలరావు గురించి తెలుసుకుందాం

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : ఒక గొప్ప మెరిట్ స్టూడెంట్ ఆయన, ఎలా అంటే ఎంసెట్ లో 29 th ర్యాంక్.. తర్వాత కాకినాడ JNTU లో బీటెక్ ,అదవగానే IIT Mumbai నుండి ఎం టెక్… క్యాంపస్ సెలెక్షన్స్ లో BPCL లో ఉద్యోగం ,కొద్దిరోజుల్లోనే IES కి సెలెక్ట్ అయ్యారు. చదువే లక్ష్యం గెలవడమే తన ఆశయం అని కష్టపడితే తప్ప ఒక స్టూడెంట్ కి ఇవన్నీ సాధ్యం కాదు.కొన్నాళ్ళు AIR లో పనిచేసారు తర్వాత సౌత్ సెంట్రల్ రైల్వే …

Read More »

గ్రీన్ గ్రేస్ అపార్ట్మెంట్ నిర్మాణ పనులను పట్టణ ప్రణాళికాధికారులతో కలిసి పరిశీలన

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : వివిధ మీడియా సంస్థల కధనాలు, ఫిర్యాదులపై గుంటూరు నగరంలోని గ్రీన్ గ్రేస్ అపార్ట్మెంట్ నిర్మాణ పనులను పట్టణ ప్రణాలికాధికారులతో కలిసి పరిశీలించామని, వారు పొందిన అనుమతి, జరుగుతున్న పనులను ప్రత్యక్ష్యంగా తనిఖీ చేశామని, జిఎంసి అధికారులు ఇచ్చిన షార్ట్ ఫాల్స్ పూర్తి చేసే వరకు నిర్మాణ పనులను పూర్తిగా నిలిపివేయాలని జూలై 2024న ఇచ్చిన నోటీసు మేరకు నిర్మాణదారులు పనులు నిలిపివేయాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ తెలిపారు. శనివారం కమిషనర్ పట్టాభిపురం మెయిన్ రోడ్ …

Read More »