Breaking News

Monthly Archives: September 2024

న్యూయార్క్ లో వివిధ రంగాల ప్రముఖులతో సమావేశమైన రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్

-మాస్టర్ కార్డు స్ట్రైవ్ ప్లాట్ ఫాం ద్వారా చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు కలుగుతున్న ప్రయోజనాలపై పై చర్చ -ఆంధ్రప్రదేశ్ లో మాంస ఎగుమతి ఆధారిత కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు అప్ సైడ్ ఫుడ్స్ కంపెనీ ప్రతినిధి ఉమా ఒలేటి సంసిద్ధత. -కృత్రిమ మేద యూనివర్సిటీ ఏర్పాటు వల్ల కలిగే ప్రయోజనాలపై సౌమిత్ చింతలతో చర్చించిన మంత్రి కొండపల్లి న్యూయార్క్/అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ …

Read More »

చంద్రబాబు కృషితోనే జేపీసీకి వక్ఫ్ సవరణ బిల్లు

-అభ్యంతరాలు తెలిపేందుకు 15మందితో ప్రత్యేక కమిటీ -హైదరాబాదులో జరిగిన జేపీసీ సమావేశంలో ఏపీ కమిటీ సభ్యులు పలు సూచనలు -రాష్ట్ర మైనార్టీ సంక్షేమ న్యాయ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలనుకున్న వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లు-2024 పై ముస్లిం సమాజం నుంచి వివిధ రూపాల్లో పలు ఆందోళనకరమైన అభిప్రాయాలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో అభిప్రాయ సేకరణ నిమిత్తం బిల్లు జాయింట్ పార్లమెంటరీ కమిటీకి (జేపీసి) వెళ్లేలా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృషి …

Read More »

రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న భారత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి కి ఘన స్వాగతం

రేణిగుంట, నేటి పత్రిక ప్రజావార్త : భారత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డా. ధనంజయ వై. చంద్రచూడ్ తిరుపతి జిల్లాలో రెండు రోజుల పర్యటన నిమిత్తం నేటి శనివారం రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న భారత సిజెఐ కి ఘన స్వాగతం లభించింది. జస్టిస్ పి.కృష్ణమోహన్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జి అండ్ అడ్మినిస్ట్రేటివ్ జడ్జ్ ఆఫ్ చిత్తూరు జిల్లా, జస్టిస్ వై. లక్ష్మణరావు రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఏపీ హైకోర్టు, జస్టిస్ రాఘవ స్వామి రిజిస్ట్రార్ ప్రోటోకాల్ హైకోర్టు ఆఫ్ ఏపీ, జస్టిస్ …

Read More »

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బాటలో మంత్రి సత్యకుమార్ యాదవ్

-పారిశుద్ధ్య కార్మికుల కాళ్లు కడిగి వారి సేవలను స్మరించుకున్నారు. -స్వచ్ఛభారత్ కి వారే వెన్నుముక -పారిశుద్ధ కార్మికుల కాళ్లు కడిగిన మంత్రి సత్య కుమార్ యాదవ్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : స్వచ్ఛభారత్ నిర్మాణానికి పారిశుద్ధ్య కార్మికులే స్ఫూర్తి ప్రదాతలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ పేర్కొన్నారు. సత్య సాయి జిల్లా ధర్మవరం పట్టణానికి చెందిన జె.ఆర్ సిల్క్స్ అధినేత జింక రామాంజనేయులు దుస్తులు మంత్రి గారికి అందజేయగా వాటిని NDA కార్యాలయంలో శనివారం రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ …

Read More »

చంద్రబాబు పాపాలు ప్రజలకు తగలకూడదని పూజలు : మల్లాది విష్ణు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : చంద్రబాబు తన స్వార్థ ప్రయోజనాల కోసం మతాలు, దేవుడిని కూడా రాజకీయం చేస్తున్నారని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆరోపించారు. తిరుమల పవిత్రతను మంటగలిపిన చంద్రబాబు పాపానికి ప్రక్షాళనగా.. సత్యనారాయణపురంలోని శ్రీశ్రీశ్రీ దాసాంజనేయస్వామి ఆలయం నందు శనివారం ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మల్లాది విష్ణు మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో జరిగిన అపచారాలు, అరిష్టాలు అన్నీ ఇన్నీ కావని విమర్శించారు. ముఖ్యంగా తిరుమల లడ్డూ ప్రసాదంపై …

Read More »

వరదలతో నష్టపోయిన తమ ఉద్యోగులకు అండగా వరుణ్‌ గ్రూప్‌

-కోటి రూపాయిల సహాయం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఇటీవలి విజయవాడలో వరదలతో నష్టపోయిన తమ ఉద్యోగులకు వరుణ్‌ గ్రూప్‌ అండగా నిలిచింది. తమ ఉద్యోగులకు కోటి రూపాయిల నగదు సహాయాన్ని అందించింది వరుణ్‌ మేనేజ్‌మెంట్‌. శనివారం విజయవాడ నోవాటెల్‌ హోటల్లో ప్రత్యేకంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా పౌరసరఫరాల శాఖా మంత్రి నాదెండ్ల మనోహర్‌, విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దే రామ్మోహనరావు, విజయవాడ సెంట్రల్‌ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు, పోలీస్‌ కమీషనర్‌ ఎస్‌.వి.రాజశేఖరబాబు పాల్గొన్నారు. వారు చేస్తున్న ఈ కార్యక్రమాన్ని …

Read More »

తెలుగువారి ఆత్మగౌరవం పద్మ విభూషణ్ ప్రొఫెసర్ కొత్త సచ్చిదానందమూర్తి

-ఆయన పేరుతో రెండు రోజుల జాతీయ సదస్సు నిర్వహణ -ముఖ్య అతిథులుగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు విద్యాశాఖ మంత్రి లోకేష్ -రెవెన్యూ సివిల్ సప్లై మంత్రులు సత్య ప్రసాద్, నాదెండ్ల మనోహర్ రాక -వర్సిటీ ముస్తాబు ఏర్పాట్లు ముమ్మరం -విలేకరుల సమావేశంలో ఉప కులపతి ఆచార్య కే గంగాధరరావు వెల్లడి విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : పద్మ విభూషణ్ ప్రొఫెసర్ కొత్త సచ్చిదానందమూర్తి ప్రపంచ తత్వవేత్తల్లో ఒకరుగా నిలుస్తారని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య కే గంగాధర రావు పేర్కొన్నారు. …

Read More »

ఉచిత శిక్షణకు Tally దరఖాస్తులు

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, జిల్లా ఉపాధి కల్పనాశాఖ సంయుక్త ఆధ్వ ర్యంలో కానూరులోని ఫెడరల్ స్కిల్ అకాడమీ ట్రైనింగ్ సెంటర్లో Account Tally 30 రోజుల పాటు ఇచ్చే ఉచిత శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఎస్.శ్రీనివాసరావు తెలిపారు. శిక్షణ అనంతరం ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగావకా శాలు కల్పించనున్నట్లు పేర్కొన్నారు. జిల్లా ఉపాధి కల్పనాధికారి డి. విక్టర్ బాబు మాట్లా డుతూ ఉచిత శిక్షణలకు ఇంటర్, డిగ్రీ, బీటెక్ (పాస్ లేదా ఫెయిల్) …

Read More »

సామాజిక ప్రయోజనం ఆశించి రచనలు చేసిన గొప్ప కవి గుఱ్ఱం జాషువా

-పద్మభూషణ్ గుఱ్ఱం జాషువా 129వ జయంతి వేడుకల్లో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడి -తన సాహితీ సౌరభంతో సామాజిక రుగ్మతలను ఎదిరించిన విశ్వ మానవుడు గుర్రం జాషువా -కవి కోకిల గుర్రం జాషువా చూపించిన మార్గం అనుసరణీయం -సమకాలీన సమాజం పోకడలకు అద్దం పట్టిన  కావ్యం జాషువా రచించిన గబ్బిలం -రాబోయే రోజుల్లో సాంస్కృతిక వారసత్వాన్ని సుసంపన్నం చేసే స్పష్టమైన కార్యాచరణతో ముందుకు వెళ్లాలని అధికారులకు సూచన -కవులు కళాకారుల భుజం తట్టి ప్రోత్సహించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎప్పుడూ …

Read More »

విజయవాడ రెవెన్యూ డివిజనల్‌ అధికారిగా కె. చైతన్య బాధ్యతల స్వీకారం…

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ రెవెన్యూ డివిజనల్‌ అధికారిగా నిమితులైన కె. చైతన్య శనివారం నగరంలోని సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలోని ఆయన ఛాంబర్‌లో బాధ్యతలు స్వీకరించారు. చింతూరు రెవెన్యూ డివిజనల్‌ అధికారి, ఇన్‌చార్జ్‌ ఐటిడిఎ ప్రాజెక్టు అధికారిగాను పని చేసిన కావూరి చైతన్యను సాధారణ బధిలీలలో భాగంగా విజయవాడ రెవెన్యూ డివిజనల్‌గా అధికారిగా నియమించారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఆర్డీవోను సబ్ కలెక్టరేట్ ఏవో హేమ కుమారి, విజయవాడ సెంట్రల్ తహసిల్దార్ సూర్యారావు, సబ్ కలెక్టరేట్ సిబ్బంది మర్యాదపూర్వకంగా కలిశారు.

Read More »