Breaking News

Monthly Archives: October 2024

ఉపాధి అవకాశాల కల్పనకు నైపుణ్య గణన… : జిల్లా కలెక్టర్

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ఉపాధి అవకాశాల కల్పనకు నైపుణ్య గణన ఎంతో ఉపయోగపడుతుందని, ఈ సర్వేకు పూర్తి స్థాయిలో సిద్ధం కావాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ గ్రామ వార్డు సచివాలయ సిబ్బందిని ఆదేశించారు. కలెక్టరేట్ లోని మీకోసం సమావేశపు మందిరంలో మంగళవారం మధ్యాహ్నం జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారులు, గ్రామ వార్డు సచివాలయ సిబ్బందికి నిర్వహించిన కార్యశాలలో జిల్లా కలెక్టర్ పాల్గొని పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి తొలి అయిదు …

Read More »

క్రికెట్ తో పాటు అన్ని క్రీడ‌ల‌ను రాష్ట్ర ప్ర‌భుత్వం ప్రోత్స‌హిస్తుంది : ఎంపి కేశినేని శివ‌నాథ్

-ఎంపీ కేశినేని శివ‌నాథ్ తో సీఎం చంద్రబాబును క‌లిసిన‌ కపిల్ దేవ్. -కపిల్ దేవ్ ను స‌న్మానించిన సీఎం చంద్ర‌బాబు -అనంతపురం, అమరావతి, విశాఖలో గోల్ఫ్ కోర్స్ ఏర్పాటుపై చర్చ -ఏపీ క్రీడాకారులు అంతర్జాతీయంగా ఆడేందుకు కృషి -గ్రామీణ క్రికెట్ క్రీడాకారులను వెలికితీసేందుకు ప్ర‌య‌త్నాలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడుకి క్రీడ‌ల‌ప‌ట్ల చాలా ఆస‌క్తి వుంది. హైద‌రాబాద్ లో స్పోర్ట్స్ సిటీ రావ‌టానికి ఆయ‌న చేసిన కృషే కార‌ణం. ఇప్పుడు ఎపిలో కూడా క్రీడాభివృద్ది కి కృషి …

Read More »

ఎసిఎ అధ్య‌క్షుడు, ఎంపి కేశినేని శివ‌నాథ్ తో భార‌త్ క్రికెట్ మాజీ కెప్టెన్ క‌పిల్ దేవ్ భేటీ

-కపిల్ ను స‌న్మానించిన ఎంపి కేశినేని శివ‌నాథ్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గోల్స్ కోట్ ఏర్పాటుకు సంబంధించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కలిసెందుకు వచ్చిన భార‌త్ క్రికెట్ మాజీ కెప్టెన్ క‌పిల్ దేవ్ ఆంధ్రా క్రికెట్ అసోసియేష‌న్ అధ్య‌క్షుడు, ఎంపి కేశినేని శివ‌నాథ్ ను మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. గురునాన‌క్ కాల‌నీలోని కేశినేని శివ‌నాథ్ నివాసంలో కపిల్ దేవ్ మంగ‌ళ‌వారం క‌ల‌వ‌టం జ‌రిగింది. ఎంపి కేశినేని శివ‌నాథ్ క‌పిల్ దేవ్ కి సాద‌ర స్వాగ‌తం ప‌లికి పుష్ప‌గుచ్ఛం అందించ‌టంతో …

Read More »

బాధితుల‌కి ల‌క్షా యాభై వేల రూపాయ‌ల సీఎంఆర్ఎఫ్ చెక్కును అంద‌జేసిన ఎంపి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు నియోజ‌క‌వ‌ర్గం 7వ డివిజ‌న్ నేహ్రూ న‌గర్ శిఖామ‌ణి సెంట‌ర్ కి చెందిన కొండ‌వీటి అనిల్ మెద‌డు సంబంధిత వ్యాధి కి ప్రైవేట్ ఆసుప‌త్రిలో ఆప‌రేష‌న్ చేయించుకున్నాడు. సీఎంఆర్ఎఫ్ కి ఎంపి కేశినేని శివ‌నాథ్ సాయంతో ఆర్జీ పెట్టుకోగా, మంజూరైన ల‌క్షా యాభైవేల రూపాయ‌ల చెక్కును ఎంపి కేశినేని శివ‌నాథ్ మంగ‌ళ‌వారం గురునానక్ కాలనీ లోని విజయవాడ పార్లమెంట్ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో కొండ‌వీటి అనిల్ కుటుంబ సభ్యులు బి.కార్తీక్ , కె.భ‌గ‌త్ చందు కి …

Read More »

ఎంపి కేశినేని శివ‌నాథ్ ను క‌లిసిన గొల్ల‌పూడి పాత రైల్వే క‌ట్ట వాసులు

-ఎవ‌రి ఇళ్లూ కూల్చ‌ర‌ని ఎంపి హామీ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గొల్ల‌పూడి ప్రాంతంలో రామ‌రాజు న‌గ‌ర్, పాత రైల్వే క‌ట్ట ద‌గ్గ‌ర నివాసం వుంటున్న త‌మ ఇళ్లు రైల్వే అధికారులు తొల‌గించ‌కుండా చూడాల‌ని ఆ ప్రాంత నివాసితులు ప‌దుల సంఖ్య‌లో మంగ‌ళ‌వారం గురునాన‌క్ కాల‌నీలోని విజ‌య‌వాడ పార్ల‌మెంట్ కార్యాల‌యం ఎన్టీఆర్ భ‌వ‌న్ లో ఎంపి కేశినేని శివ‌నాథ్ ను క‌లిసి వారి బాధ వెల్ల‌బోసుకున్నారు. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు పాల‌నలో ఎవ‌రికీ అన్యాయం జ‌ర‌గ‌ద‌ని పాత రైల్వే క‌ట్ట నివాసితుల‌కు ఎంపి …

Read More »

2047 క‌ల్లా ప్ర‌పంచంలోనే భార‌త‌దేశాన్ని శ‌క్తివంత‌మైన ఆర్థిక దేశంగా ప్ర‌ధాని మోదీ తీర్చిదిద్దారు : ఎంపి కేశినేని శివ‌నాథ్

-రోజ్ గార్ మేళా కార్య‌క్ర‌మానికి ముఖ్యఅతిథిగా హాజ‌రు -ఉద్యోగ‌ల‌కు నియామ‌క ప‌త్రాలు అంద‌జేత విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విద్య, వైద్య, పారిశ్రామిక రంగాల‌తో పాటు ముఖ్యంగా డిఫెన్స్ రంగంలో మ‌న దేశం మ‌రింత ధృడంగా ప్ర‌ధాన మంత్రి మోదీ నాయ‌క‌త్వంలో కానుంది. విక‌సిత్ భార‌త్ అనే నినాదంతో దేశాన్ని ముందుకు తీసుకువెళ్లి ప్ర‌పంచంలో అగ్ర‌గామి ఆర్థిక శ‌క్తి చేయాల‌నే త‌లంపు ప్ర‌ధాన‌మంత్రి మోదీ ఎన్నో కార్య‌క్ర‌మాలు యువ‌త కోసం ప్ర‌వేశ‌పెట్టారు. ప్ర‌పంచంలో భార‌త‌దేశాన్ని 2047 క‌ల్లా ఒక శ‌క్తివంతమైన ఆర్థిక దేశం …

Read More »

నాగబాబు అజాతశత్రువు… : ఎమ్మెల్యే సుజనా చౌదరి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : భవానిపురంలోని ఎన్డీఏ కార్యాలయంలో జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి, పిఎసి సభ్యులు కొణిదల నాగబాబు జన్మదిన వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. జనసేన పార్టీ 47వ డివిజన్ అధ్యక్షులు వేంపల్లి గౌరీ శంకర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ జన్మదిన వేడుకల్లో పశ్చిమ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ (సుజన చౌదరి) ముఖ్యఅతిథిగా పాల్గొని కేక్ కట్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జనసేన పార్టీ బలోపేతానికి కొణిదల నాగబాబు విశేషమైన కృషి చేశారన్నారు. అజాతశత్రువుగా పేరు పొందిన నాగబాబు …

Read More »

ఉత్సాహంగా బిజెపి సభ్యత్వ నమోదు కార్యక్రమం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : బిజెపి సభ్యత్వ నమోదుకు యువత, పెద్దలు స్వచ్ఛందంగా తరలి వస్తున్నారని పశ్చిమ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ (సుజన చౌదరి) అన్నారు . భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు నరిశెట్టి ఆదిశేషు ఆధ్వర్యంలో సిద్ధార్థ కళాశాల వద్ద మంగళవారం నిర్వహించిన బిజెపి సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఎమ్మెల్యే సుజనా చౌదరి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. బూత్ స్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా సభ్యత్వ నమోదు ప్రక్రియ నిర్వహిస్తున్నామన్నారు. సుజనా చేతుల మీదుగా స్థానిక యువత …

Read More »

సుజనా చౌదరి ఔదార్యం మట్టి ఖర్చుల నిమిత్తం ఆర్థిక సాయం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ (సుజన చౌదరి) ఆదేశాలతో 47వ డివిజన్ టెనర్ పేటలో గుండెపోటుతో మరణించిన కొత్తపల్లి అశోక్ కుమార్ 59 కుటుంబానికి ఆర్థిక సాయం అందించారు. ఎమ్మెల్యే కార్యాలయ సిబ్బంది, కూటమి నాయకులతో కలిసి, మంగళవారం వారి కుటుంబాన్ని పరామర్శించారు. నిరుపేద అయినటువంటి కొత్తపల్లి అశోక్ కుమార్ కుటుంబానికి మట్టి ఖర్చుల నిమిత్తం సాయం అందజేయాలని 47వ డివిజన్ టిడిపి అధ్యక్షులు నాగోతి రామారావు సుజనా దృష్టికి తీసుకెళ్లగా తక్షణమే సాయం అందజేయాలని …

Read More »

ఇంద్రకీలాద్రి అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించిన ఎమ్మెల్యే సుజనా చౌదరి

ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ ఇంద్రకీలాద్రి పై దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం లో చేయవలసిన అభివృద్ధి కార్యక్రమాలను పశ్చిమ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ (సుజన చౌదరి) పరిశీలించారు. ఆలయ ఈవో కేఎస్ రామారావు , ఇతర ఉన్నతాధికారులతో కలిసి ఈవో కార్యాలయంలో ఎమ్మెల్యే సుజనా మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో రూపొందించిన దుర్గగుడి మాస్టర్ ప్లాన్ ను పరిశీలించామని ఆలయ అభివృద్ధికి అవసరమయ్యే సలహాలను, సూచనలను పరిగణలోకి తీసుకుంటామన్నారు. అధికారుల, ప్రజాప్రతినిధుల …

Read More »