-కమిషనర్ మయూర్ అశోక్ గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని తక్కెళ్ళపాడు హెడ్ వాటర్ వర్క్స్ లో, బృందావన్ కాలనీ, శంకర్ విలాస్ సెంటర్ లో పంపింగ్ లైన్లపై ఏర్పడిన లీకుల మరమత్తు పనులను నిర్దేశిత గడువుకి ముందే అంటే శనివారం ఉదయంలోపే పూర్తి చేసి, త్రాగునీటి సరఫరాని పునరుద్దరించాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ ఇంజినీరింగ్ అధికారులకు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ వేసవిని దృష్ట్యా నగరంలో త్రాగునీటి సమస్య కొరత రాకుండా ఉండడానికి …
Read More »Daily Archives: April 17, 2026
ఏబీసి వేగవంతంపై సమీక్షా సమావేశం
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలో వీధి కుక్కలకు ఏబీసి, ఏఆర్వీలు వేగంగా జరుగుతున్నాయని, రోజువారీ చేసే ఏబీసిల సంఖ్య పెంచేందుకు అవసరమైన అదనపు సెంటర్ ఏర్పాటుకు త్వరితగతిన చర్యలు తీసుకుంటున్నామని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ తెలిపారు. శుక్రవారం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కమిషనర్ చాంబర్ లో ఎంహెచ్, విఏఎస్, స్నేహ యానిమల్ వెల్ఫేర్ సొసైటీ ప్రతినిధులతో ఏబీసి వేగవంతంపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలోని వీధి కుక్కల దాడులపై ప్రజల భద్రతను …
Read More »చలివేంద్రం ప్రారంభం…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : నగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో చలివేంద్రాన్ని ప్రారంభించిన నగర కమిషనర్ కే. మయూర్ అశోక్. శుక్రవారం జిఎంసి ప్రధాన కార్యాలయంలోని పార్కింగ్ వద్ద చలివెంద్రాన్ని కమిషనర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, వేసవి ఎండల తీవ్రత దృష్ట్యా నగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో సందర్శకులు, పన్ను చెల్లించడానికి వచ్చే ప్రజల దాహార్తి తీర్చేలా ప్రస్తుతం ఉన్న రెండు ఆర్.ఓ ప్లాంట్లకు అదనంగా చలివేంద్రం ఏర్పాటు చేశామని తెలిపారు. సమ్మర్ యాక్షన్ ప్లాన్ క్రింద …
Read More »గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశం
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్)లో భాగంగా ఎలక్ట్రోల్ మ్యాపింగ్ 95 గుంటూరు తూర్పు, 94 పశ్చిమ నియోజకవర్గాల్లో 60 శాతంకి పైగా మ్యాపింగ్ జరిగిందని గుంటూరు తూర్పు నియోజకవర్గ ఏఈఆర్ఓ, డిప్యూటీ కమిషనర్ సాంబశివరావు రాజకీయ పార్టీల ప్రతినిధులకు తెలిపారు. శుక్రవారం జిఎంసి ప్రధాన కార్యాలయంలోని డిప్యూటీ కమిషనర్ చాంబర్ లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా డిప్యూటీ కమిషనర్ మాట్లాడుతూ, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు పోలింగ్ కేంద్రాల …
Read More »ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్లను పరిశీలన
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరానికి తక్కెల్లపాడు హెడ్ వాటర్ వర్క్స్ తర్వాత ప్రధానమైన త్రాగునీటి సరఫరా కేంద్రమైన సంగం జాగర్లమూడి పంపింగ్ పాయింట్ నుండి పూర్తి సామర్ధ్యంతో నగరానికి త్రాగునీటి సరఫరా జరిగేలా ఇంజినీరింగ్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ ఆదేశించారు. శుక్రవారం సంగంజాగర్లమూడిలోని జిఎంసి ఫిల్టరేషన్ పాయింట్, సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ లోని ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్లను పరిశీలించి అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ తొలుత జాగర్లమూడి …
Read More »హరిత నగరంగా తీర్చిదిద్దేందుకు చర్యలు
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా గుంటూరు నగరాన్ని స్వచ్ఛమైన మరియు హరిత నగరంగా తీర్చిదిద్దేందుకు గుంటూరు నగరపాలక సంస్థ ప్రత్యేక చర్యలు చేపడుతోందని, ఇందులో భాగంగా విద్యుత్ మరియు ఎలక్ట్రానిక్ వ్యర్థాలను (ఈ-వేస్ట్) శాస్త్రీయ పద్ధతిలో సేకరించి, పునర్వినియోగం చేసేందుకు ప్రత్యేక సేకరణ వాహనాన్ని అందుబాటులోకి తీసుకువచ్చినట్లు నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ గుంటూరు నగరాన్ని ఈ-వేస్ట్ రహిత నగరంగా తీర్చిదిద్దుకోవడంలో నగర ప్రజలు స్వచ్చందంగా పెద్ద …
Read More »నేటి నుంచే కొండపల్లి బొమ్మల పండగ
– మూడు రోజుల పాటు కళా సాంస్కృతిక సంబరం – ప్రతిఒక్కరూ భాగస్వాములై వారసత్వ సంపదకు వన్నె తేవాలి – ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 18వ తేదీ శనివారం నుంచి మూడు రోజుల పాటు కొండపల్లి బొమ్మల పండగ అత్యంత వైభవంగా జరగనుందని.. ఇందుకు సంబంధించి పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేసినట్లు జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ తెలిపారు. ప్రపంచ వారసత్వం దినోత్సవం (World Heritage Day) సందర్భంగా జిల్లాలో మన ఘన …
Read More »సహకార రంగంలో ఆంధ్రప్రదేశ్కు కొత్త శకం
– KDCC విజయగాథపై సీఎం చంద్రబాబుతో రఘురాం కీలక చర్చలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ని అమరావతి సచివాలయంలో మాజీ మంత్రి, ఉమ్మడి కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ (KDCC) చైర్మన్ నెట్టెం రఘురాం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో సహకార బ్యాంకింగ్ రంగం బలోపేతం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి, రైతు సంక్షేమం వంటి కీలక అంశాలపై ముఖ్యమంత్రితో విస్తృతంగా చర్చించారు. కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ గత కొన్నేళ్లలో …
Read More »రోగులకు అందించే సేవల్లో రాజీ ప్రసక్తే లేదు
– ఆసుపత్రి సేవలపై పూర్తిస్థాయిలో సంతృప్తి వ్యక్తం కావాలి – జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు వైద్యాధికారులు, సిబ్బంది కృషిచేయాలని, ఆసుపత్రి సేవలపై పూర్తిస్థాయిలో సంతృప్తి వ్యక్తం కావాలని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అన్నారు. జిల్లా కలెక్టర్ లక్ష్మీశ శుక్రవారం నందిగామలోని డీవీఆర్ కాలనీ యూపీహెచ్సీతో పాటు స్థానిక సీహెచ్సీని తనిఖీ చేశారు. ప్రజలకు అందుతున్న వైద్య సేవల నాణ్యత, సిబ్బంది హాజరు, ఔషధాల లభ్యత తదితర అంశాలను …
Read More »ప్రకృతి వ్యవసాయ పంట పొలాల పరిశీలన…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ IAS, నందిగామ మండలం కంచేల గ్రామంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతు సాధికార సంస్థ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న ప్రకృతి వ్యవసాయ పంట పొలాలను పరిశీలించారు. కంచేల గ్రామంలోని రైతు సిచ్ వి.ఎన్. మహేంద్ర పొలంలో మామిడి తోటలో ప్రకృతి వ్యవసాయానికి ఉపయోగించే జీవ ఉత్ప్రేరకాలు అయిన ద్రవ జీవామృతం, కీటకనాశిని, దశపర్ణి కషాయాల తయారీలో పాల్గొన్నారు. అలాగే ప్రీ-మాన్సూన్ డ్రై సోయింగ్ (PMDS)లో పాల్గొని విత్తన గుళికల తయారీని పరిశీలించారు. విత్తనాలు …
Read More »
Prajavartha Online Telugu News