Breaking News

Daily Archives: April 28, 2026

విజయవాడ తో పాటు స్వచ్ఛ షహర్ జోడీలు కూడా స్వచ్ఛ సర్వేక్షన్ లో ముందంజలో ఉండాలి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర మంగళవారం ఉదయం ప్రధాన కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ రూమ్ లో స్వచ్ఛ షెహార్ జోడీల కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. స్వచ్ఛ సర్వేక్షన్ 2024 -25 లో ఉత్తమ ర్యాంకులున్న నగరాలకు తక్కువ ర్యాంక్ ఉన్న నగరాలను జతపరుస్తూ స్వచ్ఛ జోడిలుగా కేంద్ర ప్రభుత్వం వారిని ప్రకటించింది. అందులో భాగంగా విజయవాడకు చింతలపూడి, సామర్లకోట, ఆకివీడు, నర్సాపూర్, గొల్లప్రోలు, నగరాలను విజయవాడకు జతపరిచి, విజయవాడతో పాటు ఆ మున్సిపాలిటీలు మరియు …

Read More »

పార్కుల అభివృద్ధి మరియు నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెడుతున్నాం

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విసవి సెలవల్లో ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించేందుకు పార్కుల అభివృద్ధి మరియు నిర్వాహణలో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. మంగళవారం ఉదయం తన పర్యటనలో భాగంగా ముత్యాలంపాడు, సత్యనారాయణపురం, గాంధీనగర్, హనుమాన్ పేట ప్రాంతాలన్నీ పర్యటించి క్షేత్రస్థాయిలో పార్కుల అభివృద్ధి మరియు నిర్వహణ పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ వేసవికాలం నేపథ్యంలో, చిన్నారులకు వేసవి సెలవులు ఉంటాయి కాబట్టి ప్రజలు పార్కులలో …

Read More »

గుంటూరు నగరానికి హరిత శోభ – మోడల్ రోడ్లుగా ప్రధాన రహదారుల అభివృద్ధి

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరాన్ని పచ్చదనంతో నింపి, పర్యావరణహితంగా మరియు సుందరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు నగరపాలక సంస్థ కమిషనర్ కె.మయూర్ అశోక్ తెలిపారు. మంగళవారం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కమిషనర్ ఛాంబర్‌లో ఆంధ్రప్రదేశ్ అర్బన్ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ (ఏపీయూజీ&బీసీ) మేనేజింగ్ డైరెక్టర్ కె.వి.శ్రీనివాస్ బృందంతో ఆయన ప్రత్యేకంగా సమావేశమై, నగరంలోని ప్రధాన రహదారుల అభివృద్ధి మరియు పార్కుల ఆధునీకరణపై ఏపీయూజీ&బీసీ ప్రతినిధులు సమర్పించిన వివిధ ప్రతిపాదనలను సుదీర్ఘంగా పరిశీలించారు. ఈ సందర్భంగా …

Read More »

రాయితీతో పన్ను చెల్లింపుకు 2 రోజులే గడువు… : కమిషనర్ మయూర్ అశోక్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రస్తుత ఆర్ధిక సంవత్సరానికి (2026-27) సంబందించిన ఆస్తి పన్నును ముందస్తుగా చెల్లించి పన్నుపై 5 శాతం, బకాయిల వడ్డీపై 50 శాతం రాయితీ పొందేందుకు 2 రోజులే గడువు ఉందని, నగర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ కె.మయూర్ అశోక్ మంగళవారం ఒక ప్రకటనలో కోరారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆస్తి పన్నును ముందస్తుగా ఏక మొత్తంగా చెల్లించే వారికి ప్రకటించిన 5 శాతం రాయితీని నగర ప్రజలు విస్తృతంగా వినియోగించుకుంటున్నారని, రాయితీ …

Read More »

సమిష్టి కృషితో స్వచ్ఛ సర్వేక్షణ్‌లో జిఎంసిని అగ్రపథాన నిలుపుదాం… : కమిషనర్ మయూర్ అశోక్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరం ఇప్పటికే స్వచ్ఛ సర్వేక్షణ్‌లో ‘సూపర్ స్వచ్ఛ లీగ్ సిటీ’ కేటగిరీలో అత్యుత్తమ ర్యాంకును కలిగి ఉందని, ఈ ఏడాది కూడా అదే స్ఫూర్తితో సమిష్టిగా కృషి చేసి జిఎంసిని దేశంలోనే మెరుగైన స్థానంలో నిలబెట్టాలని నగర కమిషనర్ కె. మయూర్ అశోక్ పిలుపునిచ్చారు. మంగళవారం స్తానిక శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ప్రజారోగ్య అధికారులు మరియు సచివాలయ కార్యదర్శులతో నిర్వహించిన సమావేశంలో కమిషనర్ పారిశుధ్య నిర్వహణపై కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా …

Read More »

విస్తరణ పెండింగ్ లో ఉన్న రోడ్లను పూర్తి చేయడానికి యుద్దప్రాతిపదికన చర్యలు తీసుకోవాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలో విస్తరణ పెండింగ్ లో ఉన్న రోడ్లను పూర్తి చేయడానికి ఇంజినీరింగ్, పట్టణ ప్రణాళిక అధికారులు సమన్వయంతో యుద్దప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ ఆదేశించారు. మంగళవారం రెడ్డిపాలెం, నందివెలుగు రోడ్, ఏటి అగ్రహారం రోడ్ల విస్తరణ పనుల్లో పెండింగ్ పోర్షన్లు, వాసవి నగర్ లో అనుమతి కోసం దరఖాస్తు చేసిన లేఅవుట్, వివిధ ప్రాంతాల్లో పారిశుధ్య పనులను తనిఖీ చేసి, సంబందిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా …

Read More »