తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
తిరుపతి మున్సిపల్ కమిషనర్ జయకృష్ణ ఐఏఎస్ ని ఆంధ్రప్రదేశ్ హస్తకళా నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్, జనసేన పార్టీ PAC సభ్యులు, రాష్ట్ర జాయినింగ్ కమిటీ సభ్యులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కమిషనర్ జయకృష్ణ ఐఏఎస్ కి డా. పసుపులేటి హరిప్రసాద్ శుభాకాంక్షలు తెలియజేశారు. తిరుపతి నగర అభివృద్ధి, ప్రజలకు అందుతున్న మున్సిపల్ సేవలు, నగరంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన అంశాలపై వారిద్దరూ స్నేహపూర్వక వాతావరణంలో మాట్లాడుకున్నారు. అనంతరం కమిషనర్ జయకృష్ణ ఐఏఎస్ తో డా. పసుపులేటి హరిప్రసాద్ కొంతసేపు ఆత్మీయంగా ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ఆనంద్, తిరుపతి నగర వార్డు ఇన్చార్జి భరత్ భూషణ్ పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News