Breaking News

క్యూబాకు సంఘీభావంగా భారత్‌ మందులు

హవానా, నేటి పత్రిక ప్రజావార్త :
తీవ్రమైన ఔషధాల కొరతను ఎదుర్కొంటున్న క్యూబా ప్రజలకు సంఘీభావంగా భారతదేశం నుంచి ఉభయ కమ్యూనిస్టు పార్టీలు సేకరించిన మందులను భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) జాతీయ కార్యదర్శి కామ్రేడ్ కె. రామకృష్ణ బుధవారం హవానాలో క్యూబా వైద్యులకు అందజేశారు.
క్యూబాపై అమెరికా ఆంక్షలు, ఆర్థిక దిగ్బంధనం కారణంగా అవసరమైన మందులు, వైద్య సామగ్రి అందుబాటులో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో, క్యూబా ప్రజలకు అండగా నిలవాలనే ఉద్దేశంతో భారతదేశంలోని సీపీఐ, సీపీఎం నాయకులు, కార్యకర్తలు కలిసి మందులను సేకరించి క్యూబాకు పంపించారు.
హవానాలో జరిగిన కార్యక్రమంలో క్యూబా వైద్యులు, ఆరోగ్య సిబ్బందికి ఈ మందులను కామ్రేడ్ కె. రామకృష్ణ అందజేశారు. ఈ సందర్భంగా భారత కమ్యూనిస్టు ఉద్యమం తరఫున క్యూబా ప్రజలకు తమ సంపూర్ణ సంఘీభావాన్ని, స్నేహాన్ని ఆయన తెలియజేశారు.
క్యూబా ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు కేవలం క్యూబా సమస్య కాదని, ప్రపంచవ్యాప్తంగా శాంతి, మానవత్వం, సామాజిక న్యాయం కోరుకునే ప్రజలందరి సమస్య అని రామకృష్ణ పేర్కొన్నారు. అమెరికా ఆర్థిక దిగ్బంధనాన్ని ఎత్తివేసి, క్యూబా ప్రజలకు స్వేచ్ఛగా మందులు, ఆహారం, వైద్య పరికరాలు అందేలా అంతర్జాతీయ సమాజం మరింత బలమైన పాత్ర పోషించాలని ఆయన కోరారు.
సీపీఎం నాయకుడు వెంకట్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని క్యూబా వైద్యులకు మందులను అందజేయడంలో భాగస్వామ్యమయ్యారు.
భారత్‌లోని కమ్యూనిస్టు పార్టీలు, ప్రజా సంఘాలు, సాధారణ ప్రజలు క్యూబా ప్రజల కష్టకాలంలో తమ వంతు సహాయం అందించడం ద్వారా భారత్–క్యూబా ప్రజల మధ్య ఉన్న స్నేహం, అంతర్జాతీయ సంఘీభావం మరింత బలపడుతుందని నాయకులు తెలిపారు.
“క్యూబా ఒంటరిగా లేదు – ప్రపంచంలోని శాంతి, ప్రగతి, సామాజిక న్యాయం కోరుకునే ప్రజలు క్యూబా ప్రజలతో ఉన్నారు” అని వారు స్పష్టం చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో ముఖ్య అతిథిగా డా. పసుపులేటి హరిప్రసాద్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని గుంటూరులో నిర్వహిస్తున్న జన్మదిన వారోత్సవాల్లో భాగంగా జరిగిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *