-అందులో భాగంగా అక్టోబర్ 16న ఎస్పీ తో జిల్లా కలెక్టరేట్లో ప్రత్యేక స్పందన
– కలెక్టర్ డా కే.మాధవీలత
రాజమహేంద్రవరం , నేటి పత్రిక ప్రజావార్త :
ప్రతి సోమవారం నిర్వహించే స్పందన కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు అక్టోబర్ 16 సోమవారం జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ పి. జగదీష్ తో కలిసి ప్రజల నుంచి అర్జీలను స్వీకరిస్తామని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం ఉదయం 10.30 నుంచి మ.1.00 వరకు అర్జిలను స్వీకరించడం జరుగు తుందన్నారు. రాజమహేంద్రవరం లోని జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఎస్పి పి. జగదీష్ తో కలిసి అర్జీలను ప్రజల నుంచి స్వీకరిస్తామన్నారు. ప్రతి నెల 3 వ సోమవారం కలెక్టర్, ఎస్పీ లు కలెక్టరేట్ కు హాజరై ప్రజల నుంచి అర్జీలను స్వీకరించడం జరుగుతొందని ఆమె తెలిపారు. సోమవారం క్షేత్ర స్థాయి లో డివిజన్, మండల, గ్రామ స్థాయి స్పందన కార్యక్రమం యధావిధిగా జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. అదే విధంగా సంబంధిత డివిజన్, మండల స్థాయి అధికారులు అందరూ ఒకే చోట ప్రజలకు అందుబాటులో ఉండి అర్జీలను స్వీకరిస్తారని కలెక్టర్ తెలియ చేశారు.
Prajavartha Online Telugu News