Breaking News

తిరునక్షత్ర మహోత్సవాలకు గౌతంరెడ్డికి ఆహ్వానం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వచ్చేనెల 12వ తేదీ నుంచి 16వ తేదీ వరకు సీతానగరం జీయర్‌ ఎడ్యుకేషనల్‌ ట్రస్ట్‌లో నిర్వహించబోయే తిరునక్షత్ర మహోత్సవాలకు శనివారం ఏపీ ఫైబర్‌నెట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ డాక్టర్‌ పూనూరు గౌతంరెడ్డికి ఆహ్వాన పత్రిక అందజేశారు. ఆశ్రమ కార్యాలయ నిర్వాహకులు రఘుస్వామి స్వామివారి ముఖ్య శిష్యులు వేద పాఠశాల అధ్యాపకులు మధుగురుస్వామి, మాధవాచారి స్వామి గౌతంరెడ్డికి ఆహ్వాన పత్రికను అందజేసి ఆహ్వానించారు. ఈ సందర్భంగా గౌతంరెడ్డి మాట్లాడుతూ తిరునక్షత్ర మహోత్సవాలకు తాను తప్పక హాజరవుతానని అన్నారు. అనంతరం స్వామివారి తీర్ధప్రసాదాలను గౌతంరెడ్డికి అందజేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో ముఖ్య అతిథిగా డా. పసుపులేటి హరిప్రసాద్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని గుంటూరులో నిర్వహిస్తున్న జన్మదిన వారోత్సవాల్లో భాగంగా జరిగిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *