విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జాతీయ బీసీ సంఘం జాతీయ కార్యదర్శి గా ఎన్.వి.ఎస్ ప్రసాద్ ని నియమించినట్లు జాతీయ బీసీ సంఘం అధ్యక్షుడు దేరంగుల ఉదయ్ కిరణ్ ఆదివారం ఓ ప్రకటన లో తెలిపారు. విజయవాడ చెందిన ఎన్.విఎస్ ప్రసాద్ బీసీ సంఘం హక్కులకోసం సేవలందించి బీసీల కోసం పోరాటం చేసిన వ్యక్తి అని, ఎల్లవేళలా బీసీలకు అందుబాటులో ఉండి బీసీల కోసం నిరంతరం కృషి చేస్తున్నందుకు ఈ అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. బీసీ సంఘం పునర్వ్యవస్థీకరణలో భాగంగా కొత్త కమిటీలు …
Read More »Andhra Pradesh
బొమ్మినంపాడులో క్యాంబ్ బెల్ కాల్వ పై రూ. 10 లక్షలతో కాలిబాట వంతెన నిర్మించడం సంతోషంగా ఉంది…
-త్వరలో కొల్లేరు పైన ర్యేగులేటర్, గరిసిపూడి వద్ద ర్యేగులేటర్ నిర్మాణాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేస్తారు… -ఏలూరు పార్లమెంట్ సభ్యులు కోటగిరి శ్రీధర్ -శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు ముదినేపల్లి, నేటి పత్రిక ప్రజావార్త : చిరకాలంగా ఉన్న గ్రామ సమస్యను యంపీ నిధుల నుండి పరిష్కరించడం ఎంతో సంతృప్తినిచ్చిందని ఏలూరు పార్లమెంట్ సభ్యులు కోటగిరి శ్రీధర్ అన్నారు. ఆదివారం సాయంత్రం ముదినేపల్లి మండలంలోని బొమ్మినంపాడు గ్రామంలో క్యాంబ్ బెల్ కాల్వ పై నాగమ్మ తల్లి గుడివద్ద నూతనంగా నిర్మించిన కాలిబాట వంతెనను …
Read More »వ్యవసాయానికి పవర్ ఫుల్ పంపుసెట్లు…
-పీఎంబీఎల్డీసి మోటర్ల ఆవిష్కారం పై పరిశోధనకు ఏ పీ సీడ్కో శ్రీకారం -పంపుసెట్ల సామర్థ్యం పెంపు, వాటి జీవిత కాలాన్ని రెట్టింపు చేయటమే లక్ష్యం -ఆంధ్రా యూనివర్సిటీ తో ఎంఓయూ -పీఎంబీఎల్డీసి టెక్నాలజీ తో 90 శాతానికి పెరగనున్న వ్యవసాయ పంపుసెట్ల సామర్థ్యం -10 నుంచి 20 సంవత్సరకు పెరగనున్న పంపుసెట్ల జీవిత కాలం -పీ ఎం బీ ఎల్ డీ సి, ఇంధన సామర్ధ్య సాంకేతికలతో వ్యవసాయ రంగంలో 30 శాతం వరకు విద్యుత్ ఆదా చేసే అవకాశం -సాంప్రదాయ ఇండక్షన్ మోటర్లకు …
Read More »పాఠశాలల ఆధునికీకరణలో పెను విప్లవం-మన బడి నాడు నేడు…
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పాఠశాలను ఒక పవిత్ర దేవాలయంగా భావించి అందులో చదివే విద్యార్థులకు మెరుగైన విద్యను అందించాలని అకుంటిత దీక్షతో రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చి, మౌలిక సదుపాయాలు కల్పించడం ద్వారా స్కూల్స్ లో పరీక్షా ఫలితాలను మెరుగుపరచడం, బడి బయట విద్యార్థుల సంఖ్యను తగ్గించి వారిని స్కూల్స్ లో చేర్పించాలన్నదే ప్రభుత్వ ధ్యేయం. ప్రభుత్వం విద్యా రంగంలో చేపట్టిన విప్లవాత్మక కార్యక్రమాల వల్ల ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల్లో దాదాపు 4 లక్షల వరకు అడ్మిషన్లు పెరిగాయి. …
Read More »పాలనను ఇంటింటికీ చేర్చిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిదే..
-పేదవారికి అన్నివిధాల చేయూత నందించి వారి జీవన ప్రమాణాలు మెరుగుపర్చడమే ప్రభుత్వ ధ్యేయం.. -ఎంపీ కోటగిరి శ్రీధర్ -ఎమ్మెల్యే. డీఎన్నార్ కలిడింది, నేటి పత్రిక ప్రజావార్త : పాలనను ఇంటింటికీ చేర్చిన ఘనత ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిదేనని పేదవారికి అన్నివిధాల చేయూత నందించి వారి జీవన ప్రమాణాలు మెరుగుపర్చడమే ప్రభుత్వ ధ్యేయమని ఏలూరు పార్లమెంట్ సభ్యులు కోటగిరి శ్రీధర్ అన్నారు. ఆదివారం కలిదిండి మండలం కాళ్లపాలెం గ్రామంలో నూతనంగా రూ.40 లక్షల వ్యయంతో నిర్మించిన గ్రామ సచివాలయ భవనాన్ని ఎంపీ ప్రారంభించారు. …
Read More »పీవీ సింధుకు అభినందనలు తెలిపిన గవర్నర్ హరి చందన్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : టోక్యో ఒలింపిక్స్లో మహిళల బ్యాడ్మింటన్ సింగిల్స్ విభాగంలో తెలుగు తేజం పీవీ సింధు కాంస్య పతకం సాధించి కొత్త రికార్డు నెలకొల్పటం పట్ల ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వ భూషణ్ హరి చందన్ సంతోషం వ్యక్తం చేశారు. చైనా క్రీడాకారిణి హి బింగ్జియావోతో హోరాహోరీగా సాగిన పోరులో సింధు స్పష్టమైన ఆధిక్యం కనబరిచి, వరుస గేమ్స్లో 21-13, 21-15 తేడాతో అద్భుత విజయం సాధించారు. టోక్యో ఒలింపిక్స్లో భారత్కు ఆమె రెండో పతకం అందించగా గవర్నర్ తన అభినందనలు …
Read More »పి.వి.సింధు పోరాట పటిమకు జేజేలు… : పవన్ కల్యాణ్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : టోక్యో ఒలింపిక్స్ లో బ్యాడ్మింటన్ విభాగంలో కాంస్యం గెలుచుకొని మన దేశానికి మరో పతకాన్ని అందించిన బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పి.వి.సింధుకి నా తరఫున, జనసేన పక్షాన హృదయపూర్వక అభినందనలు తెలియచేస్తున్నానని జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ కార్యాలయం నుండి ఆదివారం ఓ ప్రకటన విడుదల చేసారు. టోక్యోలో మన దేశ పతాకం మరోమారు రెపరెపలాడేలా చేసిన సింధుని చూసి దేశమంతా గర్విస్తోంది. అప్పుడు రియోలోనూ, ఇప్పుడు టోక్యోలోనూ… వరుసగా రెండు ఒలింపిక్స్ పోటీల్లో పతకాలు సాధించిన భారత క్రీడాకారిణిగా …
Read More »కనకదుర్గమ్మ సేవ కోసం జనసేన ధార్మిక సేవా మండలి…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రముఖ పుణ్యక్షేత్రంగా భాసిల్లుతున్న విజయవాడలోని కనకదుర్గమ్మ ఆలయానికి జనసేన ధార్మిక సేవా మండలి నియామకానికి ఆమోదం తెలిపిన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కి హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మ సన్నిధానానికి రోజూ వేలాది మంది భక్తులు వస్తుంటారు. వారికి ప్రత్యక్షంగా, పరోక్షంగా సేవ చేయడంతోపాటు అమ్మవారికి సంప్రదాయబద్ధంగా జరిగే నిత్య కైంకర్యాలు సక్రమ పద్ధతిలో జరుగుతున్నాయో లేదో అని పరిశీలించడం, ఆలయంలో భక్తిప్రవత్తులు వెల్లివిరిసే విధంగా పర్యవేక్షించడం ధార్మిక సేవా మండలి ప్రధాన లక్ష్యం. …
Read More »2న నగర ప్రజల సమస్యల పరిష్కార వేదిక “స్పందన” : కమిషనర్ ప్రసన్న వెంకటేష్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగర ప్రజల సమస్యల పరిష్కార వేదికగా సోమవారం నగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయం మరియు సర్కిల్ కార్యాలయములలో “స్పందన” కార్యక్రమము జరుగుతుందని నగర కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఐ.ఏ.ఎస్ ప్రకటన ద్వారా తెలియజేసారు. నగరపాలక సంస్థకు సంబంధించి ప్రజలకు మౌలిక సదుపాయల కల్పనలో ఇబ్బందులు, సమస్యలను పరిష్కరించుకొనుటకు ది.02.08.2021 సోమవారం ఉదయం 10.30 ని.ల నుంచి మద్యాహ్నం 1.00 గంట వరకు నగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో మేయర్, కమిషనర్ మరియు మూడు సర్కిల్ …
Read More »కలెక్టర్ జె. నివాస్ నేతృత్వంలో ముమ్మరంగా సాగుతున్న వరద ముంపు నివారణ చర్యలు…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆదివారం సాయంత్రానికి నాగార్జున సాగర్ డాం నుంచి మిగులు జలాలను విడుదల చేయనున్నారు. ఆదివారం అర్ధరాత్రి కి ఫుల్ రిజర్వాయర్ స్థాయికి చేరుకుంటుంది. ప్రారంభదశలో 2 లక్షల క్యూసెక్కుల వరకు వరద నీరు విడుదల ఉండవచ్చు. సోమవారం ఉదయం నుంచి 4.5 లక్షల క్యూసెక్కుల నుంచి 5 లక్షల వరకు పెరగనున్నట్లు జలవనరుల శాఖ అధికారులు తెలుపుతున్నారు. ఈ నేపద్యంలో కృష్ణా జిల్లా కలెక్టర్ జె. నివాస్ ఆదేశాలతో వరద ముంపు నివారణ చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. …
Read More »
Prajavartha Online Telugu News