అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : నాడు నేడు పధకం రెండో విడతలో భాగంగా నాలుగు మండలాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో (తెనాలి, కంచికచర్ల, వీరులపాడు, అచ్యుతాపురం, పరవాడ) రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న మౌలిక సదుపాయాల కల్పన నిమిత్తం ముఖ్యమంత్రి సహాయనిధికి లారస్ ల్యాబ్స్ తరపున నాలుగు కోట్ల రూపాయల విరాళం. మూడు, నాలుగు విడతల్లో అదే మండలాల్లోని మిగిలిన పాఠశాలల్లో నేరుగా లారస్ ల్యాబ్స్ మౌలిక సదుపాయాలు ఏర్పాటుచేయనున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డికి కంపెనీ ప్రతినిధులు తెలియచేసారు. విరాళానికి సంబంధించిన చెక్కును, సంబంధించిన పత్రాలను బుధవారం ముఖ్యమంత్రి …
Read More »Latest News
నాట్యకళకు ఆకర్షితులు కానివారు అత్యంత అరుదు : మంత్రి పేర్ని నాని
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : భారతీయ నాట్యరీతులు దేశ విదేశాలలో విశేష ప్రాచుర్యాన్ని పొంది భారతీయుల గౌరవాన్ని ఇనుమడింప చేశాయని, ముఖభావాలు చూపుతూ నటనమాడే ఈ మహోన్నతమైన కళకు ఆకర్షితులు కానివారు అత్యంత అరుదని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పేర్ని వెంకట్రామయ్య ( నాని ) నిర్వచించారు. బుధవారం తన కార్యాలయం వద్దకు వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలను ఆయన ముఖాముఖిగా, బిగ్ స్క్రీన్ ద్వారా పలుకరించి ప్రజలు పడుతున్న …
Read More »మైనారిటీల అభివృద్దికి విశేష కృషి : ప్రత్యేక కార్యదర్శి గంధం చంద్రుడు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మార్గదర్శకత్వంలో మైనారిటీల అభివృద్దికి కృషి చేస్తానని మైనారిటీ సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి గంధం చంద్రుడు అన్నారు. ఇటీవలి వరకు అనంతపురం జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు నిర్వహించిన గంధం చంద్రుడు ప్రభుత్వ పరిపాలనాపరమైన బదిలీలలో భాగంగా మైనారిటీ సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శిగా నియమితులయ్యారు. బుధవారం సచివాలయంలో పదవీ బాధ్యతలు చేపట్టి ఆశాఖ ఉన్నతాధికారులతో ప్రాధమికంగా సమావేశం అయ్యారు. శాఖకు సంబంధించిన విభిన్న అంశాలను అధికారులు ప్రత్యేక కార్యదర్శికి వివరించారు. …
Read More »ఆంధ్ర ప్రదేశ్ భవన, ఇతర నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు చైర్మన్ గా గుమ్మనూర్ జయరాం
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : గుమ్మనూర్ జయరాం కార్మిక శాఖ మంత్రి బుధవారం “ఆంధ్ర ప్రదేశ్ భవన, ఇతర నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు చైర్మన్ గా” పదవిని చేపట్టారు. చేపట్టిన వెంటనే CESS వసూలు పై ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, కార్మిక, కర్మాగారాలు, బాయిలర్లు మరియు బీమా వైద్య సేవల శాఖ, కార్మిక శాఖ కమిషనర్, డిప్యూటీ కమిషనర్లు, ఉమ్మడి కమిషనర్లు మరియు ఇతర అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో CESS వసూలు పెంచడానికి అధికారులకు దిశా నిర్దేశం …
Read More »ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల్లో ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు అందుబాటులో ఉంచాలి: సీఎం వైయస్.జగన్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కోవిడ్ –19 నివారణ, నియంత్రణ, వ్యాక్సినేషన్పై రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి క్యాంప్ కార్యాలయంలో బుధవారం సమీక్షించారు. ఈ సమీక్షా సమావేశంలో సీఎం వైయస్ జగన్ మాట్లాడుతూ ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల్లో ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు అందుబాటులో ఉంచాలన్నారు. కోవిడ్ నివారణ చర్యల్లో భాగంగా ప్రభుత్వం కొనుగోలు చేసిన కాన్సన్ట్రేటర్లు, డీ–టైప్ సిలెండర్లు, ఆక్సిజన్ జనరేషన్ (పీఎస్ఏ) ప్లాంట్ల నిర్వహణ కోసం ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. దీనికోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. జిల్లాల వారీగా …
Read More »జర్నలిస్టులు కరోనా బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో పనిచేస్తున్న వర్కింగ్ జర్నలిస్టులు జాగ్రత్తలు తీసుకోవాలని కరోనా థర్డ్ వేవ్ వస్తుందని ప్రచారంలో ఉందని అందరూ అప్రమత్తంగా ఉండాలని ఫోటోగ్రాఫర్లు, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు జాగ్రత్తలు పాటిస్తూ ముందుకెళ్లాలని మచ్చా రామలింగారెడ్డి రాష్ట్ర అధ్యక్షులు (APWJU) ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టు యూనియన్ అన్నారు. బుధవారం ది ఆంధ్ర ప్రదేశ్ జర్నలిస్ట్ అసోసియేషన్ కార్యాలయం నందు బొనిగి అనందయ్య సేవ ట్రస్ట్ సౌజన్యం తో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టు యూనియన్ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు అనందయ్య మందును ఉచితముగా …
Read More »రాష్ట్ర స్థాయి స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు విజయవాడ నగరాన్ని సిద్ధం చేయండి…
-కృష్ణా జిల్లా కలెక్టర్ ను ఆదేశించిన సిఎస్ ఆదిత్యనాథ్ దాస్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరంలో రాష్ట్ర స్థాయి స్వాతంత్రదినోత్సవ వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ జిల్లా కలెక్టర్ జె. నివాస్ ను ఆదేశించారు. రాష్ట్ర స్థాయి స్వాతంత్రదినోత్సవ వేడుకల ఏర్పాట్లపై బుధవారం రాత్రి జిల్లా కలెక్టర్ జె. నివాస్, విజయవాడ నగర పాలక సంస్థ కమీషనర్ వి.ప్రసన్న వెంకటేష్ లతో జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా సిఎస్ సమీక్షించారు. ఈ సందర్భంగా …
Read More »దేవినేని ఉమా పెద్ద డ్రామా ఆర్టిస్టు… : ఎమ్మెల్యే మల్లాది విష్ణు
-జి.కొండూరు వివాదానికి దేవినేని ఉమానే ప్రధాన కారణం... విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తెలుగుదేశం నేత దేవినేని ఉమా పెద్ద డ్రామా ఆర్టిస్టు అని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు అన్నారు. బుధవారం నాడు ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో ప్రజలంతా టీడీపీని ఏకపక్షంగా తిరస్కరించినా, మరీముఖ్యంగా దేవినేని ఉమాను ఛీ కొట్టినా బుద్ది మారలేదన్నారు. వసంత కృష్ణ ప్రసాద్ చేతిలో ఓటమిని జీర్ణించుకోలేక ఇటువంటి కుట్రలు చేస్తున్నారని మల్లాది విష్ణు మండిపడ్డారు. మంత్రిగా ఉండి కూడా గెలవలేకపోయినందుకు దేవినేని …
Read More »ఆస్తి విలువ ఆధారితంగా పన్నులు నిర్ణయించాలని తీసుకున్న నూతన విధానం మాత్రమే … : కమిషనర్ ప్రసన్న వెంకటేష్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : బుధవారం నగర పాలక సంస్థ కౌన్సిల్ హాల్ నందు మేయర్ రాయన భాగ్యలక్ష్మి అధ్యక్షతన నూతన అస్తి పన్ను విధింపుపై జరిగిన సర్వ సభ సమావేశంలో జీవో198 కౌన్సిల్ ఆమోదించింది. తొలుత కౌన్సిల్ సమావేశంలో నూతన ఆస్తి పన్ను విధింపు విధి విధానాలను నగర పాలక సంస్థ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఐ.ఏ.ఎస్ సభ్యలుకు వివరించడం జరిగింది. బలహీనుడు, బలవంతుడు, పేద, ధనిక అన్న తేడా లేకుండా, రాజకీయ సిఫార్సులకు, అవినీతి ఆస్కారం లేకుండా అందరికీ యూనిఫాంగా …
Read More »ప్రతి అధికారి, ఉద్యోగి సాంకేతిక పరిజ్ఞానాన్ని అంది పుచ్చుకొని పనులను వేగవంతంగా పూర్తి చేయాలి…
ఏలూరు, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా ప్రజలకు మేలు చేకూరేలా అధికారులు సమర్థవంతంగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా అధికారులకు సూచించారు. బుధవారం కలెక్టరేట్లోని గోదావరి సమావేశ మందిరంలో జిల్లాస్థాయి , ద్వితీయ స్థాయి అధికారులతో సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ అధికారులు సిబ్బంది సమయపాలన పాటించడంతో పాటు, నిర్ణీత వ్యవధిలో పనులు పూర్తిచేయాలని అన్నారు. కోర్టు కేసులకు సంబంధించి వెంటనే కౌంటర్ దాఖలు చేయాలని సూచించారు . సంబంధిత శాఖలకు హెడ్ ఆఫీసు …
Read More »
Prajavartha Online Telugu News