-అభినందించిన సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు బి.శ్రీనివాసరావు IAS.,
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జాతీయ స్థాయి అండర్ – 17 ‘సెపక్ తక్రా’ పోటీలకు ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు ఎంపికైనట్లు స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శి శ్రీ జి.భానుమూర్తిరాజు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 15 నుండి 21 వరకు మణిపుర్ రాష్ట్రం ఇంఫాల్ శాయ్ సెంటర్లో జరగనున్న పోటీల్లో పాల్గొంటారన్నారు. ఈ సందర్భంగా సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు బి.శ్రీనివాసరావు IAS., ని ఏపీ జట్టు కలిశారు. సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు బి.శ్రీనివాసరావు IAS., బృందాన్ని అభినందించి, విజయవంతంగా రావాలని ఆకాంక్షించారు.
అండర్-17 బాలురు జట్టు
1. జి. సతీష్ (దేవరాపల్లి, పశ్చిమగోదావరి)
2. కె. కుశల్ (కేబీసీ బాయ్స్ హైస్కూల్, పటమట, ఎన్టీఆర్ జిల్లా)
3. డీఎం. షాహిద్ (ఉరవకొండ, అనంతపురం)
4. టి . జశ్వంత్ (విశాఖపట్నం)
5. టి . వంశీ (కేబీసీ బాయ్స్ హైస్కూల్, పటమట, ఎన్టీఆర్ జిల్లా)
అండర్ 17 బాలికలు జట్టు
1. పి. హరి ప్రియ (కేబీసీ)
2. కె. వెంకట లక్ష్మి (కేబీసీ)
3. పి. దుర్గ మధుర శ్రీ (దేవరాపల్లి, ప.గో)
4. సి. తేజ (ఉరవకొండ)
5. జి. రమ్య (కాకినాడ)
ఈజట్లుకు పీఈటీలు కోచ్ గా ఎస్. రమేష్ (ఎన్టీఆర్), బాలికల మేనేజర్ ఎం. సంతోషి కుమారి (కర్నూలు), బాయ్స్ టీమ్ మేనేజర్ డి. సుంకర రావు (కర్నూలు) వ్యవహరిస్తున్నారు.